సహకార మంత్రిత్వ శాఖ

అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్‌ల కోసం చత్ర సంస్థ నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ యూ సీ ఎఫ్ డీ సీ )ను న్యూ ఢిల్లీలో ప్రారంభించిన కేంద్ర హోం మంత్రి మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, ప్రభుత్వ వ్యవస్థ మద్దతుతో, సహకార ఉద్యమం వేగంగా పురోగమిస్తుంది మరియు దేశ ఆర్థిక వ్యవస్థలో గౌరవాన్ని పొందుతుంది.

సహకార ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది

"సహకార సంఘాల మధ్య సహకారం" స్ఫూర్తి సహకార ఉద్యమాన్ని బలోపేతం చేస్తుంది

ప్రతి నగరంలో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల ఏర్పాటు లక్ష్యం కావాలి - శ్రీ అమిత్ షా

చత్ర సంస్థ, ఎన్ యూ సీ ఎఫ్ డీ సీ ఏర్పాటుతో దేశంలో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల అభివృద్ధి అనేక రెట్లు పెరుగుతుంది.

ఎన్ యూ సీ ఎఫ్ డీ సీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల సమస్యలను పరిష్కరించడానికి ప్రధాన సంస్థ గా పనిచేస్తుంది

సామాన్య ప్రజల జీవితాల్లో పురోగతికి మార్గం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారానే ఉంది

ఎన్ యూ సీ ఎఫ్ డీ సీ అనేది చిన్న బ్యాంకులకు రక్షణ కవచం, డిపాజిటర్ల విశ్వాసాన్ని పెంపొందిస్తుంది మరియు రాబోయే రోజుల్లో పనిలో మరింత పురోగతిని నిర్ధారిస్తుంది

ఎన్ యూ సీ ఎఫ్ డీ సీ బ్యాంకుల సంక్షోభ సమయంలో మద్దతుగా ఉండటమే కాకుండా వాటి అభివృద్ధి, ఆధునీకరణ మరియు సామర్థ్యాన్ని పెంపొందించే సాధన

Posted On: 02 MAR 2024 4:14PM by PIB Hyderabad

కేంద్ర హోం మంత్రి మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా ఈరోజు న్యూ ఢిల్లీలో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ (యూ సీ బీలు), నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ యూ సీ ఎఫ్ డీ సీ) కోసం చత్ర సంస్థను ప్రారంభించారు. కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి బి.ఎల్. వర్మ, సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్‌ ఆశిష్‌ కుమార్‌ భూటానీతో పాటు ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

శ్రీ అమిత్ షా తన ప్రసంగంలో, సహకార సంస్థల మధ్య సహకారాన్ని మరియు పరస్పర పురోగతిని ప్రోత్సహించే శక్తిని అందించకపోతే మనం ముందుకు సాగలేమని అన్నారు. దాదాపు 20 ఏళ్ల పోరాటం తర్వాత ఈరోజు ఎన్‌యూసీఎఫ్‌డీసీ స్థాపన జరుగుతోందని ఇది మనందరికీ ఎంతో శుభ దినమని పేర్కొన్నారు.

 

ప్రారంభంలో సహకార మంత్రిత్వ శాఖ మరియు సహకార రంగం వివిధ మంత్రిత్వ శాఖలలో చెల్లాచెదురుగా ఉన్నాయని కేంద్ర హోం మంత్రి మరియు సహకార మంత్రి పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సహకార శాఖకు కొత్త ఊపిరి పోస్తూ ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు. సహకార మంత్రిత్వ శాఖ రూపంలో సహకార ఉద్యమానికి చత్రం పట్టిందని ఆయన పేర్కొన్నారు. 125 సంవత్సరాలుగా సహకార రంగం పోరాడి తన ఉనికిని కాపాడుకుందని కానీ ఇప్పుడు ప్రభుత్వ వ్యవస్థ మద్దతుతో అది వేగంగా అభివృద్ధి చెందుతుందని మరియు దేశ ఆర్థిక వ్యవస్థలో గౌరవాన్ని సాధిస్తుందని శ్రీ షా తెలిపారు. సహకార ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. భారతదేశం వంటి విశాలమైన దేశంలో అభివృద్ధి యొక్క పరామితి కేవలం సంఖ్యలు కాదని దేశ అభివృద్ధిలో ఎంత మంది పాల్గొంటున్నారో తెలిపే ముఖ్యమైన పరామితి ద్వారా అంచనా వేయాలని సహకార మంత్రి ఉద్ఘాటించారు.

 

శ్రీ అమిత్ షా ఈ చత్ర సంస్థ నేటి ఆవశ్యకత అని మరియు స్వీయ నియంత్రణ కోసం నూతన ప్రారంభాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. ఈ సంస్థ ఏర్పడిన తర్వాత దేశంలోని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల అభివృద్ధి అనేక రెట్లు పెరుగుతుందన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బీ ఐ) యొక్క అన్ని నిబంధనలకు కట్టుబడి ఉండటం మరియు మనల్ని మనం ఉన్నతీకరించుకోవడం చాలా అవసరం  మన విశ్వసనీయతకు కీలకమైన అవసరాన్ని  శ్రీ షానొక్కి చెప్పారు. అలా చేయడంలో విఫలమైతే రానున్న కాలంలో పోటీలో నిలదొక్కుకోలేమని పేర్కొన్నారు. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్‌కు అనుగుణంగా చిన్న బ్యాంకులను సిద్ధం చేసే చత్ర సంస్థ  ప్రధాన పాత్రను శ్రీ షా హైలైట్ చేశారు. భవిష్యత్ లో ప్రతి నగరంలో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులను తెరవడమే మన లక్ష్యం కావాలని అన్నారు.

 

సహకార రుణాలలో మంచి పనితీరు కనబరుస్తున్న క్రెడిట్ సొసైటీలను బ్యాంకులుగా మార్చేందుకు చత్ర సంస్థ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర హోంమంత్రి, సహకార మంత్రి అన్నారు. ఎన్ యూ సీ ఎఫ్ డీ సీ యొక్క లక్ష్యాలలో ఒకటి క్రెడిట్ సొసైటీలు మరియు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల సేవలు మరియు సంఖ్యలను విస్తరించడం అని ఆయన పేర్కొన్నారు. ప్రతి నగరంలో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులను ఎలా ఏర్పాటు చేయాలనే దానిపై కాలపరిమితితో కూడిన కార్యక్రమాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది. సహకార ఉద్యమాన్ని సజీవంగా ఉంచుకోవాలంటే దానిని అనువైనదిగా అనుకూలం గా విస్తరించాలని అన్నారు. చత్ర సంస్థ చిన్న బ్యాంకులకు వివిధ సౌకర్యాలను అందిస్తుంది, బ్యాంకులు మరియు రెగ్యులేటర్ల మధ్య సంభాషణను సులభతరం చేస్తుంది మరియు కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడానికి కృషి చేస్తుంది. మన పరిధులను విస్తృతంగా మరియు అందరినీ కలుపుకొని పోయేలా చేయడానికి సంస్థ కృషి చేయాల్సిన అవసరం ఉందని శ్రీ షా ఉద్ఘాటించారు. సహకార ఉద్యమాన్ని విస్తృతం చేయాలంటే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులను బలోపేతం చేయాల్సిన బాధ్యత చత్ర సంస్థ దేనని పేర్కొన్నారు.

దేశ వ్యాప్తంగా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు వ్యాపారం నిర్వహించేందుకు క్లియరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం చాలా అవసరమని శ్రీ అమిత్ షా అన్నారు. ప్రస్తుతం మనకు 1,500 బ్యాంకుల 11,000 శాఖల సమిష్టి బలం ఉందని, 5 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లు, మొత్తం 3.50 లక్షల కోట్ల రూపాయల రుణాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇది ఒక ముఖ్యమైన బలమని, దీనిని మెరుగుపరచడమే కాకుండా, మొత్తం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల వ్యవస్థను పటిష్టం చేయడానికి సమిష్టిగా వినియోగించుకోవడమే లక్ష్యంగా ఉండాలని శ్రీ షా అన్నారు. దేశంలోని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు తమ నికర ఎన్‌పిఎ రేటును 2.10%కి తగ్గించాయని, ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. చత్ర సంస్థ కి  పునాది వేయడానికి రాబోయే మూడేళ్లలో కష్టపడి పనిచేయాలని శ్రీ షా ఉద్ఘాటించారు.

ఈ రోజు ప్రారంభించబడిన సంస్థ కేవలం చత్ర సంస్థ మాత్రమే కాదు, మన సమస్యలన్నింటినీ పరిష్కరించే ప్రధాన మార్గం అని కేంద్ర హోం మంత్రి మరియు సహకార మంత్రి  పేర్కొన్నారు. సామాన్యుల జీవితాల్లో ప్రగతి సాధించాలంటే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులే మార్గమని పేర్కొన్నారు. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ భారత్ ప్ర‌పంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా ఎదగడం గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆర్థికాభివృద్ధి లో అందరినీ కలుపుకొని, సమగ్రంగా ఉండాలన్న ఆయన నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. ఈ భావన తో మనం ముందుకు వెళ్లాలంటే ప్రతి గ్రామం మరియు నగరంలో యువతను మరియు స్టార్టప్‌లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని దీనికి యూ సీ బీలను మించిన మార్గం లేదని శ్రీ షా ఉద్ఘాటించారు.చిన్న బ్యాంకులకు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులకు ఈ చత్ర సంస్థ  రక్షణ కవచమని, ఇది డిపాజిటర్లలో విశ్వాసాన్ని పెంచుతుందని, రాబోయే రోజుల్లో ఈ పనిలో మరింత పురోగతి ఉంటుందని శ్రీ షా అన్నారు.

 

***



(Release ID: 2010951) Visitor Counter : 111