ప్రధాన మంత్రి కార్యాలయం

రోజ్‌గార్ మేళా కింద, ఫిబ్రవరి 12న ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా చేరిన వారు 1 లక్షకు పైగా అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేయనున్న ప్రధానమంత్రి


న్యూ ఢిల్లీలో ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ “కర్మయోగి భవన్” మొదటి దశకు శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి

రోజ్‌గార్ మేళా అనేది ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రధానమంత్రి నిబద్ధత నెరవేర్పు దిశగా ఒక అడుగు

కొత్తగా నియమించబడినవారికి ఆన్‌లైన్ మాడ్యూల్ కర్మయోగి ప్రారంభం ద్వారా శిక్షణ

Posted On: 11 FEB 2024 3:15PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 12 ఫిబ్రవరి, 2024న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా చేరిన రిక్రూట్‌లకు 1 లక్షకు పైగా అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా, న్యూఢిల్లీలోని సమీకృత కాంప్లెక్స్  "కర్మయోగి భవన్" మొదటి దశకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ కాంప్లెక్స్ మిషన్ కర్మయోగి వివిధ విభాగాల మధ్య సహకారం, సినర్జీని ప్రోత్సహిస్తుంది.  రోజ్‌గార్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాలలో నిర్వహిస్తున్నారు. ఈ చొరవకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు/యుటీలలో రిక్రూట్‌మెంట్‌లు జరుగుతున్నాయి. కొత్త రిక్రూట్‌లు వివిధ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌లలో ప్రభుత్వంలో చేరతారు. రెవెన్యూ శాఖ, హోం మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యా శాఖ, అణు శక్తి శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ,  ఆర్థిక సేవల శాఖ, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ,  గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ వివిధ హోదాల్లో ఈ నియామకాలు జరిగాయి. 

రోజ్‌గార్ మేళా దేశంలో ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రధానమంత్రి నిబద్ధతను నెరవేర్చే దిశగా ఒక ముందడుగు. రోజ్‌గార్ మేళా మరింత ఉపాధి కల్పనను ప్రభావితం చేస్తుంది. యువతకు వారి సాధికారత, జాతీయ అభివృద్ధిలో ప్రత్యక్ష భాగస్వామ్యం కోసం లాభదాయకమైన అవకాశాలను అందిస్తుంది.

కొత్తగా నియమితులైన వారు కర్మయోగి ప్రారంభం ద్వారా శిక్షణ పొందే అవకాశాన్ని కూడా పొందుతున్నారు, ఇది ఐజిఓటి  కర్మయోగి పోర్టల్‌లోని ఆన్‌లైన్ మాడ్యూల్, ఇక్కడ 880 కంటే ఎక్కువ ఇ-లెర్నింగ్ కోర్సులు 'ఎక్కడైనా ఏదైనా పరికరం' లెర్నింగ్ ఫార్మాట్ కోసం అందుబాటులో ఉంచారు. 

***



(Release ID: 2005509) Visitor Counter : 50