సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఎంఎస్ఎంఈలలో ఉపాధి అవకాశాలు
Posted On:
05 FEB 2024 3:39PM by PIB Hyderabad
వ్యవసాయేతర రంగంలో కొత్త యూనిట్ల స్థాపనలో వ్యవస్థాపకులకు సహాయం చేయడానికి ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కెవిఐసి) ద్వారా ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పిఎంఈజీపి)ని అమలు చేస్తోంది. సాంప్రదాయ కళాకారులు/గ్రామీణ మరియు పట్టణ నిరుద్యోగ యువతకు అండగా నిలవడం మరియు సాధ్యమైనంత వరకు వారి ఇంటి వద్దనే స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడం ఈ కార్యక్రమ లక్ష్యం.
పిఎంఈజిపి కింద జనరల్ కేటగిరీ లబ్ధిదారులు గ్రామీణ ప్రాంతాల్లో ప్రాజెక్ట్ వ్యయంలో 25% మరియు పట్టణ ప్రాంతాల్లో 15% మార్జిన్ మనీ (ఎంఎం) సబ్సిడీని పొందవచ్చు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు,ఓబిసీలు, మైనారిటీలు, మహిళలు, మాజీ సైనికులు, శారీరక వికలాంగులు, ట్రాన్స్జెండర్లు, ఈశాన్య ప్రాంతం, కొండ మరియు సరిహద్దు ప్రాంతాలు, మరియు ఆకాంక్షాత్మక జిల్లాలకు చెందిన లబ్ధిదారుల వంటి ప్రత్యేక వర్గాలకు చెందిన లబ్ధిదారుల సబ్సిడీ గ్రామీణ ప్రాంతాల్లో 35% మరియు పట్టణ ప్రాంతాల్లో 25%. ప్రాజెక్టు గరిష్ట వ్యయం తయారీ రంగంలో రూ.50 లక్షలు మరియు సేవా రంగంలో 20 లక్షలుగా ఉంది.
అలాగే, ప్రత్యేక కేటగిరీ కింద లబ్ధిదారుల స్వంత సహకారం 05% మరియు సాధారణ కేటగిరీ లబ్ధిదారులకు 10%.
2018-19 నుండి అప్గ్రేడేషన్ మరియు విస్తరణ కోసం 2వ లోన్తో ఇప్పటికే ఉన్న పిఎంఈజిపి/ఆర్ఈజిపి/ముద్రా ఎంటర్ప్రైజెస్ గత మంచి పనితీరు ఆధారంగా కూడా మద్దతునిస్తుంది. 2వ లోన్ కింద, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కింద మార్జిన్ మనీ సబ్సిడీకి అనుమతించదగిన గరిష్ట ప్రాజెక్ట్ ధర రూ. 1.00 కోట్లు మరియు సేవా రంగానికి ఇది రూ. 25 లక్షలు. అన్ని వర్గాలకు 2వ రుణంపై అర్హత రాయితీ ప్రాజెక్ట్ వ్యయంలో 15% (ఎన్ఈఆర్ మరియు హిల్ స్టేట్స్లో అది 20%గా ఉంది).
2019-20 ఆర్థిక సంవత్సరం నుండి 2021-22 ఆర్థిక సంవత్సరం వరకు దేశంలో పిఎంఈజిపి కింద అందించబడిన మార్జిన్ మనీ రాయితీ, సహాయం పొందిన యూనిట్ల సంఖ్య మరియు అంచనా వేసిన ఉపాధి సంవత్సరాల వారీగా ఈ క్రింద ఇవ్వబడింది:
క్రమ సంఖ్య
|
సంఖ్య
|
సహాయం అందించిన యూనిట్ల సంఖ్య
|
పంపిణీ చేయబడ్డ మార్జిన్ మనీ (రూ.లక్షల్లో)
|
కల్పించబడ్డ ఉపాధి అంచనా
|
1
|
2019-20
|
66,653
|
195082.15
|
533,224
|
2
|
2020-21
|
74,415
|
218880.15
|
595,320
|
3
|
2021-22
|
103,219
|
297765.91
|
825,752
|
|
మొత్తం
|
244,287
|
711728.21
|
1,954,296
|
పిఎంఈజిపి కింద 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏర్పడిన ఉపాధిలో ఎలాంటి తగ్గుదల లేదు. వాస్తవానికి పిఎంఈజిపి కింద 2020-21 ఆర్థిక సంవత్సరంలో 595,320 నుండి 2021-22 ఆర్థిక సంవత్సరంలో 825,752కి ~39% పెరుగుదల ఉంది.
దేశంలో మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు కెవిఐసి ద్వారా క్రింది చర్యలు తీసుకోబడ్డాయి:
- ఉపాధి అవకాశాల కల్పన కోసం కెవిఐ పథకాలను ప్రచారం చేయడానికి అన్ని స్థాయిలలో అవగాహన శిబిరాలు, వర్క్షాప్లు మరియు ప్రదర్శనలు నిర్వహించబడుతున్నాయి.
- ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కెవిఐ పథకాల ప్రచారం జరుగుతోంది.
- దేశంలోని రైతులు, ఆదివాసీలు మరియు నిరుద్యోగ యువత ఆదాయానికి అనుబంధంగా కెవిఐసి 2017-18లో హనీ మిషన్ను ప్రారంభించింది. హనీ మిషన్ కింద ప్రతి వ్యక్తికి 10 తేనెటీగల పెట్టెలను సజీవ తేనెటీగలు అందజేస్తారు.
- కుంభార్ సశక్తికరన్ ప్రోగ్రామ్ కింద కెవిఐసి గ్రామీణ కుండల కళాకారుల జీవనోపాధిని మెరుగుపరుస్తుంది. అందులో భాగంగా వారికి నైపుణ్యాన్ని పెంచే శిక్షణను అందించడం మరియు మంచి నాణ్యత గల ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి విద్యుత్ కుండల చక్రాలు, బ్లంగర్, పగ్ మిల్లు, బట్టీ మొదలైన కొత్త గృహ స్థాయి శక్తి సామర్థ్య పరికరాలను అందిస్తోంది.
- కెవిఐసీ www.ekhadiindia.com మరియు www.khadiindia.go.in ద్వారా అన్ని కెవిఐ ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించడం ప్రారంభించింది.
సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ ఈరోజు రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందించారు.
***
(Release ID: 2002950)
Visitor Counter : 65