ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో మార్పులపై అప్‌డేట్


మెరా అస్పటాల్ యాప్ జిల్లా హాస్పిటల్స్‌తో అనుసంధానించబడింది

Posted On: 02 FEB 2024 3:13PM by PIB Hyderabad

జాతీయ ఆరోగ్య మిషన్ కింద జిల్లా ఆసుపత్రులను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. జిల్లా ఆస్పత్రుల పనితీరు, సేవల నాణ్యతను మెరుగుపరిచేందుకు సమిష్టి కృషి జరిగింది. ఈ దిశలో కొన్ని సంబంధిత ప్రయత్నాలు:
 

  • ఎన్‌హెచ్‌ఎం కాకుండా ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఆయుష్మాన్ భారత్- ఆరోగ్యం మరియు సంరక్షణ కేంద్రాలు (ప్రస్తుతం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌గా పేరు మార్చబడింది), ఎమర్జెన్సీ కోవిడ్ రెస్పాన్స్ ప్యాకేజీ (ఈసిఆర్‌పి) I & II, 15వ ఆర్థిక సంఘం, ప్రధానమంత్రి - ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (పిఎం-ఏబిహెచ్‌ఐఎం).
  • నర్సులు, ఏఎన్‌ఎంలు, పారామెడికల్‌లకు శిక్షణ ఇచ్చే శిక్షణా స్థలాలుగా జిల్లా ఆసుపత్రుల సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో మరియు మెడికల్ ఆఫీసర్లకు (ఎంఓఎస్) డిప్లొమేట్ నేషనల్ బోర్డ్ (డిఎన్‌బి) సిపిఎస్‌ కోర్సులను అందించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
  • ప్రభుత్వం జిల్లా ఆసుపత్రులలో (డిహెచ్‌) పేషెంట్ ఫీడ్-బ్యాక్ సిస్టమ్ అయిన “మేరా అస్పతాల్”ను ఏకీకృతం చేసింది. ప్రజారోగ్య సౌకర్యాల ద్వారా అందించబడే సేవలు సురక్షితంగా రోగి-కేంద్రీకృతమైనవి మరియు నాణ్యత యొక్క హామీ స్థాయిని నిర్ధారించడానికి, జాతీయ నాణ్యత హామీ ప్రమాణాల (ఎన్‌క్యుఏఎస్‌) ధృవీకరణ ప్రజారోగ్య సౌకర్యాలలో చురుకుగా అమలు చేయబడుతుంది.
  • డిహెచ్‌ పనితీరు మూల్యాంకనం డేటా రికార్డింగ్ మరియు రిపోర్టింగ్ సిస్టమ్ యొక్క సమగ్రతపై ఆధారపడి ఉంటుంది కాబట్టి, హెల్త్ మేనేజ్‌మెంట్ మరియు ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్‌ఎంఐఎస్‌)ని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించబడ్డాయి.
  • ప్రజారోగ్య సౌకర్యాలను సందర్శించే రోగులకు అవసరమైన మందులు & రోగనిర్ధారణ పరీక్షల లభ్యతను నిర్ధారించడానికి, ప్రభుత్వం జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కింద ఉచిత డ్రగ్స్ సర్వీస్ ఇనిషియేటివ్ మరియు ఉచిత డయాగ్నస్టిక్స్ ఇనిషియేటివ్‌ను రూపొందించింది.
  • ఇ-సంజీవని వంటి టెలి-కన్సల్టేషన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా నిపుణుల సంరక్షణకు ప్రాప్యత మరింత మెరుగుపరచబడింది.

జిల్లా ఆసుపత్రుల పనితీరును అంచనా వేయడానికి హెచ్‌ఎంఐఎస్ డేటా ఉపయోగించబడుతుంది. దీని ప్రకారం హెచ్‌ఎంఐఎస్‌లో సంగ్రహించబడిన డేటా సూచికల ఆధారంగా, నిర్మాణం, ప్రక్రియ, అవుట్‌పుట్ మరియు ఫలితంపై డొమైన్‌లను కవర్ చేస్తూ నీతి ఆయోగ్ & ఎంఓహెచ్‌ఎఫ్‌డబ్ల్యు సంయుక్తంగా 17 కీలక పనితీరు సూచికల సమితిని ఖరారు చేసింది. రెండవ రౌండ్ అసెస్‌మెంట్ కోసం, మొత్తం జిల్లా ఆసుపత్రులలో దాదాపు 10% కోసం హెచ్‌ఎంఐఎస్‌-రిపోర్ట్ చేసిన డేటా యొక్క ధ్రువీకరణ వారి సంబంధిత భౌతిక రికార్డులపై  చేయబడుతుంది.

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం ఇచ్చారు.

 

***


(Release ID: 2002402)