ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అప్పుడు- ఇప్పుడు తేడాను చూపుతూ ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్న ప్రభుత్వం

प्रविष्टि तिथि: 01 FEB 2024 12:45PM by PIB Hyderabad

ఈరోజు పార్లమెంట్‌లో 2024-25 మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నప్పుడు, కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, “2014లో మా ప్రభుత్వం పగ్గాలు చేపట్టినప్పుడు, ఆర్థిక వ్యవస్థను దశలవారీగా చక్కదిద్దడం, పాలనా వ్యవస్థలను క్రమబద్ధీకరించడం చాలా బాధ్యతగా చేసాం. ప్రజలకు ఆశలు కల్పించడం, పెట్టుబడులను ఆకర్షించడం, అవసరమైన సంస్కరణలకు మద్దతు ఇవ్వడం ఈ కాలపు అవసరం. ‘దేశానికి ప్రథమం’ అనే మా బలమైన నమ్మకాన్ని అనుసరించి ప్రభుత్వం విజయవంతంగా చేసింది.... అని అన్నారు. 

అప్పుడు, ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతూ, కేంద్ర ఆర్థిక మంత్రి "అప్పటి  సంక్షోభం అధిగమించాం ఆర్థిక వ్యవస్థను సర్వతోముఖాభివృద్ధితో అధిక స్థిరమైన వృద్ధి మార్గంలో దృఢంగా ఉంచబడింది" అని అన్నారు. ‘2014 వరకు మనం ఎక్కడ ఉన్నాం, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, ఇన్నాళ్ల దుర్వినియోగం నుంచి పాఠాలు నేర్చుకునేందుకే’ ప్రభుత్వం సభలో శ్వేతపత్రం వేస్తుందని ఆమె ప్రకటించారు.

శ్రీమతి సీతారామన్ ఇంకా ఇలా అన్నారు, “పరిపాలన, అభివృద్ధి మరియు పనితీరు, సమర్థవంతమైన డెలివరీ, మరియు 'జన్ కళ్యాణ్' ఆదర్శప్రాయమైన ట్రాక్ రికార్డ్ 'వికసిత భారత్' లక్ష్యాన్ని సాధించడానికి ప్రజలు ఒక ప్రభుత్వానికి ఒక విశ్వాసం ఇచ్చారు, ఆశీర్వాదాలను ఇచ్చారు. రాబోయే సంవత్సరాలు, దశాబ్దాలలో మంచి ఉద్దేశ్యంతో, నిజమైన అంకితభావం, కృషితో పని చేస్తాం." అని శ్రీమతి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 

 

***


(रिलीज़ आईडी: 2001447) आगंतुक पटल : 341
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Gujarati , Odia , Tamil , Malayalam