యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

ఖేలో ఇండియా యువజన క్రీడల తొలిరోజు తమిళనాడుకు రెండు స్వర్ణాలు, పశ్చిమబెంగాల్, ఢిల్లీలకు చెరో స్వర్ణం

Posted On: 20 JAN 2024 8:47PM by PIB Hyderabad

6వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023 తొలి రోజు శనివారం ఆతిథ్య తమిళనాడు రెండు బంగారు పతకాలతో ఖాతా తెరవగా, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ చెరో స్వర్ణాన్ని సాధించాయి.

రాజరత్నం స్టేడియంలో జరిగిన యోగాసన రిథమిక్ పెయిర్ బాలుర విభాగంలో కవలలు దేవేష్ కె, సర్వేష్ కె తొలి స్వర్ణ పతకం సాధించగా, బాలికల విభాగంలో పశ్చిమ బెంగాల్ కు చెందిన మేఘా మైతీ, ఉర్మీ సమత టైటిల్ సాధించారు.

టి ఎన్ పి ఇ ఎస్ యు టేబుల్ టెన్నిస్ హాల్లో ఆనంద్ గోవిన్ ఎన్ 15-11తో జెనిత్ ఎస్ హెచ్  (మణిపూర్)పై, బాలికల సాబెర్ ఫెన్సింగ్ లో ఢిల్లీకి చెందిన ఖనాక్ కౌశిక్ 15-9తో హర్యానాకు చెందిన హిమాన్షి నేగిపై విజయం సాధించారు.

బాలికల రిథమిక్ పెయిర్స్ ఈవెంట్ లో యోగాసన విభాగం నుంచి ఓవియా సి, శివానీ డి మొత్తం 128.32 పాయింట్లతో కాంస్య పతకం సాధించగా, బాలికల సాబెర్ లో ఫెన్సర్ జెఫార్లిన్  జెఎస్ కాంస్య పతకం సాధించింది.

దక్షిణ భారతదేశంలో తొలిసారిగా జరుగుతున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభ వేడుకకు ఆతిథ్య జట్టు ఇంతకంటే మంచి ఆరంభాన్ని ఆశించి ఉండరు.

దేవేష్, సర్వేష్ అద్భుతమైన సమన్వయం, నిలకడను ప్రదర్శించి రిథమిక్ పెయిర్ ఈవెంట్లో 127.89 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన అవర్జిత్ సాహా, నీల్ సర్కార్ లు 127.57 పాయింట్లతో రజత పతకం సాధించగా, మహారాష్ట్రకు చెందిన ఖుష్ ఇంగోల్, యద్నేశ్ వాంఖడే (127.20 పాయింట్లు) కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు.

పతకాల పట్టిక: https://youth.kheloindia.gov.in/medal-tally

ఫోటో క్యాప్షన్: కె ఐ వై జి  2023 - రిథమిక్ పెయిర్ యోగాసన్ స్టేట్ - తమిళనాడు బంగారు పతక విజేతలు దేవేష్ కె (ఎల్), సవేష్ కె (ఆర్) విజేతలు

ఫలితాలు:

బాక్సింగ్

బాలురు:

54కేజీ: నవీన్ కుమార్ (తమిళనాడు) యశ్ గవాయ్ (మహారాష్ట్ర పై విజయం సాధించాడు.

57కేజీ:   ఎస్ ధనచేజియన్  (తమిళనాడు) వివేక్ నైతానీ (యూటీఆర్)పై విజయం సాధించాడు.

63 కేజీ : క్రిష్ కాంబోజ్ (హర్) దోర్జయ్ నమ్గ్యాల్(లదాక్ )పై విజయం సాధించాడు.

67 కేజీ: ఆయుష్ శ్రీవాస్ (ఎంపీ), వేదాంత్ కొరోంకర్ (గోవా) ను ఓడించాడు

71కెజి: డానిష్ పూనియా(రాజస్థాన్ ), రోహన్ సింగ్ (హర్యానా) ను ఓడించాడు

 బాలికలు:

48 కేజీల విభాగం: ఎలంగ్బమ్ తోయిచా దేవి (మణిపూర్) వి.లక్ష్య (తమిళనాడు)పై విజయం సాధించింది.

50 కేజీలు: కాశీష్ (హిమాచల్ ప్రదేశ్ ) మానస వేణి (ఏపీ)పై విజయం సాధించింది.

54 కేజీల విభాగం: బబితా సింగ్ (యూపీ) ఖంకా(ఢిల్లీ) ని ఓడించింది.

57 కేజీల విభాగం:  అంజలి కోరంగా (యూటీకే) హరిప్రియ (తెలంగాణ) పై విజయం సాధించింది.

 ఫెన్సింగ్ :

బాలుర ఎపీ: గోల్డ్ మెడల్ మ్యాచ్: అంబ్లేస్ గోవిన్ ఎన్ (తమిళనాడు) 15-11తో జెనిత్ ఎస్ హెచ్ (మణిపూర్ )పై గెలిచాడు.

కాంస్య పతకం: దేవరాజ్ (హర్యానా), అశ్విని శౌర్య (పునె) ను ఓడించాడు

బాలికల సాబెర్: గోల్డ్ మెడల్ మ్యాచ్:

ఖానక్ కౌశిక్ (ఢిల్లీ) 15-9తో హిమాన్షి నేగి (హర్యానా)పై గెలిచాడు.

కాంస్య పతకాలు: జెఫార్లిన్ జె ఎస్  (తమిళనాడు), కాశీష్ భరాద్ (మహరాష్ట్ర)

కబడ్డీ

బాలురు:

గ్రూప్ -ఎ:  రాజస్థాన్ 48-27తో బిహార్ పై విజయం సాధించింది. మహారాష్ట్ర 41-26తో మధ్యప్రదేశ్ ను ఓడించింది.

గ్రూప్ బి: హర్యానా 58-39తో చండీగఢ్ పై గెలిచింది.

బాలికలు:

గ్రూప్-ఎ: హర్యానా 59-22తో తెలంగాణపై విజయం సాధించింది. తమిళనాడు 41-32తో మహారాష్ట్రపై విజయం సాధించింది.

గ్రూప్ బి: హిమాచల్ ప్రదేశ్ 49-23తో బిహార్ పై విజయం సాధించింది.

స్క్వాష్ (రౌండ్ ఆఫ్ 16):

బాలురు: 1. తవ్నీత్ సింగ్ ముంద్రా (ఎంపీ) 11-2, 11-2, 11-4తో వంశ్ చంద్రాకర్ (చండీఘర్) పై గెలిచాడు. 2. ఆర్యన్ ప్రతాప్ సింగ్ (యూపీ) 11–5, 11–4, 11–3తో గౌతమ్ ఆర్ దాస్ (కేరళ)పై గెలిచాడు. 3. అరిహంత్ కేఎస్ (తమిళనాడు) 11-2, 11-2, 11-1తో మలయ్ రాథోడ్ (చండీఘర్)పై గెలిచాడు. 4. ఎల్.మేయప్పన్ (తమిళనాడు) 10-12, 11-5, 8-11, 11-2, 13-11తో దిషాంత్ ముర్జానీ (రాజస్థాన్) పై గెలిచాడు.

బాలికలు: పూజా ఆర్తి ఆర్ (తమిళనాడు) 11-2, 11-2, 11-2తో సుభద్ర కె సోనీ (కేరళ) పై గెలిచింది. నిరుపమా దూబే (మహారాష్ట్ర ) 1-0 (రిటైర్డ్) తో పెరినా శర్మ (ఢిల్లీ ) ని ఓడించింది. షమీనా రియాజ్ (తమిళనాడు) 11-3, 14-12, 8-11, 11-3తో చిత్రాంగద గోయల్ (యూపీ)పై గెలిచింది. ఛవి శరణ్ (రాజస్థాన్11-6, 11-6, 6-11, 11-7తో రీవా నింబాల్కర్ (మహారాష్ట్ర )ను ఓడించింది

 యోగాసన:

బాలురు:

రిథమిక్ జోడీలు: గోల్డ్ - దేవేష్ కె / సర్వేష్ కె (తమిళనాడు) 127.89 పాయింట్లు; రజతం - అవర్జిత్ సాహా/ నీల్ సర్కార్ (పశ్చిమ బెంగాల్) 127.57; కాంస్యం - ఖుష్ ఇంగోల్/యద్నేశ్ వాంఖడే (మహారాష్ట్ర) 127.20

బాలికలు:

రిథమిక్ జోడీలు: గోల్డ్ - మేఘా మైటీ/ఉర్మీ సమతా (పశ్చిమ బెంగాల్ ) 128.76; రజతం - స్వర గుజార్/యుగంక రాజం (మహారాష్ట్ర) 128.64; కాంస్యం - ఓవియా సి/శివానీ డి (తమిళనాడు) 128.32

 కెఐవైజీ 2023 గురించి, తమిళనాడు

 చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జనవరి 19 నుంచి 31 వరకు 6వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ (కెఐవైజీ) జరుగుతున్నాయి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ దక్షిణ భారతదేశంలో జరగడం ఇదే తొలిసారి. తమిళనాడులోని చెన్నై, మదురై, తిరుచ్చి, కోయంబత్తూరు నగరాల్లో ఈ క్రీడలు జరుగుతున్నాయి. ఈ క్రీడలకు చిహ్నం వీర మంగై. వీర మంగై అని ముద్దుగా పిలువబడే రాణి వేలు నాచియార్ బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా యుద్ధం చేసిన భారతీయ రాణి. ఈ చిహ్నం భారతీయ మహిళల శౌర్యానికి, స్ఫూర్తికి ప్రతీక, మహిళా శక్తి బలాన్ని ప్రతిబింబిస్తుంది. ఆటల లోగోలో కవి తిరువళ్లువర్ బొమ్మ ఉంది. 15 వేదికల్లో 13 రోజుల పాటు జరిగే ఖెలో ఇండియా యువజన క్రీడలలో 26 క్రీడా విభాగాలు, 275 పైగా పోటీలు, 1 డెమో స్పోర్ట్ లో 5600 మందికి పైగా అథ్లెట్లు పాల్గొంటున్నారు.  ఫుట్ బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్ వంటి సంప్రదాయ క్రీడలు, కలరిపయట్టు, గట్కా, తంగ్ తా, కబడ్డీ, యోగాసనం వంటి సంప్రదాయ క్రీడల సమ్మేళనం 26 క్రీడాంశాలు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ చరిత్రలో తొలిసారిగా తమిళనాడు సంప్రదాయ క్రీడ అయిన సిలంబంను డెమో క్రీడగా పరిచయం చేస్తున్నారు.

***



(Release ID: 1998282) Visitor Counter : 79