ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రామాయణంలో శబరి ఉదంతంపై మైథిలీ ఠాకూర్ ఆలపించిన భావోద్వేగ గీతాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 20 JAN 2024 9:22AM by PIB Hyderabad

   రామాయణంలో భక్త శబరి ఉదంతంపై మైథిలీ ఠాకూర్ ఆలపించిన భావోద్వేగ గీతాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు. అయోధ్యలో ప్రతిష్ఠాపన సందర్భంగా భగవాన్ శ్రీరాముని జీవితం, ఆదర్శాల సంబంధిత వివిధ ఉదంతాలను ఈ గీతం ప్రతి ఒక్కరికీ గుర్తుచేస్తున్నదని శ్రీ మోదీ అన్నారు.

ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:

“అయోధ్యలో పవిత్ర ప్రతిష్టాపనోత్సవం నేపథ్యంలో ఈ గీతం దేశంలోని నా కుటుంబ సభ్యులకు శ్రీరాముడి జీవితం, ఆదర్శాలకు సంబంధించిన ప్రతి ఉదంతాన్నీ గుర్తుకు తెస్తుంది. అలాంటి వాటిలో శబరికి సంబంధించిన భావోద్వేగ ఉదంతంపై ఈ గీతాన్ని#ShriRamBhajan మైథిలీ ఠాకూర్ తన శ్రావ్యమైన కంఠస్వరంతో ఎలా వినిపించారో వినండి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

********

DS/ST


(रिलीज़ आईडी: 1998163) आगंतुक पटल : 149
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam