పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ

పబ్లిక్ పాలసీ డైలాగ్స్–2024లో భాగంగా హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో నిర్వహించిన ఇన్నోవేషన్ శాండ్‌బాక్స్ ప్రెజెంటేషన్ లో స్వమిత్వా స్కీమ్ బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డును గెలుచుకుంది.


స్వమిత్వా పథకం హర్యానా, ఉత్తరాఖండ్, పుదుచ్చేరి, అండమాన్ మరియు నికోబార్ దీవులు , గోవాలోని అన్ని జనావాస గ్రామాలకు చెందిన ఆస్తి కార్డులను అందజేసింది.

2.90 లక్షల గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి చేశామని, ఇప్పటి వరకు 1.06 లక్షల గ్రామాలకు 1.66 కోట్ల ఆస్తి కార్డులు సిద్ధం చేశామన్నారు.

Posted On: 06 JAN 2024 1:17PM by PIB Hyderabad

పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్ శాండ్‌బాక్స్ ప్రదర్శనలో పాల్గొంది మరియు భూ పరిపాలన వ్యవస్థలను పారదర్శకంగా మరియు సమర్ధవంతంగా డిజిటలైజ్ చేయడానికి రాష్ట్రాలు అనుసరించే ప్రక్రియలను వివరిస్తూ “స్వామిత్వ పథకం ద్వారా భూపరిపాలనలో డిజిటల్ పరివర్తన కార్యక్రమాలను” ప్రదర్శించింది.  ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), హైదరాబాద్  జనవరి 3వ తేదీ నుంచి  5వ తేదీ మధ్య మూడు రోజులపాటు జరిగిన భారతీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (బిఐపీపీ)యొక్క రెండవ వార్షిక “పబ్లిక్ పాలసీ డైలాగ్స్” కాన్క్లేవ్‌లో “స్వామిత్వ పథకం ద్వారా భూ పరిపాలనలో డిజిటల్ పరివర్తన కార్యక్రమాలు” కోసం ఇన్నోవేషన్ శాండ్‌బాక్స్ ప్రదర్శనలో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకమైన 1వ బహుమతిని అందుకుంది.


స్వామిత్వ పథకం అమలులో సమర్ధత మరియు జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి సాంకేతికతను ఉపయోగించుకోవడంలో మునుపటి సందర్భాలలో  పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ యొక్క వినూత్న ప్రయత్నాలు అత్యుత్తమమైనవి మరియు పరివర్తనాత్మకమైనవిగా గుర్తించబడ్డాయి.  మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్ మంత్రిత్వశాఖ మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో అక్టోబర్ 2023న అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్  "పౌరులకు- కేంద్రీకృత సేవలను అందించడానికి ఎమర్జింగ్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా స్వామిత్వ పథకం ఇ–-గవర్నెన్స్ 2023 కోసం జాతీయ అవార్డులలో ప్రతిష్టాత్మకమైన గోల్డ్ ప్రైజ్‌ని గెలుచుకుంది.

ఆగస్టు 2023లో గోవాలో నిర్వహించిన డిజిటెక్ కాన్‌క్లేవ్ 2023లో “ఇ-గవర్నెన్స్ ఫర్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ఇన్నోవేటివ్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ” కేటగిరీకి గానూ స్వామిత్వ స్కీమ్‌కు గోల్డ్ అవార్డు లభించింది.


నేపథ్యం:

పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ యొక్క స్వామిత్వ పథకం భారతదేశంలోని గ్రామీణ వర్గాల సాధికారతకు గణనీయంగా దోహదపడిన కేంద్ర రంగ పథకం. అత్యాధునిక డ్రోన్ సర్వేలు మరియు జీఐఎస్ మ్యాపింగ్ టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా, ఈ పథకం భూకమతాల ఖచ్చితమైన సరిహద్దులను నిర్ధారిస్తుంది, తద్వారా వివాదాలను తగ్గించడం మరియు హక్కులకు సంబంధించిన ఆస్తి రికార్డులను వ్యక్తులకు అందించడం జరుగుతుంది. స్వామిత్వ ప్రాపర్టీ కార్డ్‌లు, తద్వారా ఆస్తుల మోనటైజేషన్‌ను సులభతరం చేయడం, బ్యాంకు రుణాలు మరియు సమగ్ర గ్రామ-స్థాయి ప్రణాళికను ప్రారంభించడం వంటివి కూడా చేపడుతుంది. సాంకేతికత యొక్క ఈ ఏకీకరణ డాక్యుమెంటేషన్ ప్రక్రియను క్రమబద్ధీకరించడమే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో సామాజిక-ఆర్థిక పురోగతిని పెంపొందించడం ద్వారా మరింత పారదర్శకమైన మరియు సమర్థవంతమైన భూ పరిపాలన వ్యవస్థ వైపు ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది.

స్వామిత్వ స్కీమ్ (https://svamitva.nic.in) అనేది గ్రామీణ భారతదేశంలో భూ యాజమాన్యం యొక్క స్వరూపాన్ని మార్చడానికి ఆవిష్కరణలు మరియు కొత్త సాంకేతికతలను ఉపయోగించుకునే ఒక సంచలనాత్మక చొరవగా నిలుస్తుంది. ఈ పథకం 24 ఏప్రిల్ 2020న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించినప్పటి నుండి వివిధ వేదికలపై గుర్తింపు పొందడమే కాకుండా పలు  అవార్డులను కూడా అందుకుంది.

***

 



(Release ID: 1994521) Visitor Counter : 97