ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గీతాబెన్ రబారి పాడిన ‘‘శ్రీ రామ్ ఘర్ ఆయే’’ భక్తి గీతాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

Posted On: 07 JAN 2024 9:25AM by PIB Hyderabad

గీతాబెన్ రబారి ఆలపించిన “శ్రీ రామ్ ఘర్ ఆయే” అనే భక్తి గీతాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రజలతో పంచుకున్నారు. ఈ గీతాన్ని సునీతా జోషి (పాండ్యా) రచించగా, 

మౌలిక్ మెహతా సంగీతం సమకూర్చారు.

ఈ మేరకు 'ఎక్స్' ద్వారా పంపిన ఒక సందేశంలో:

“అయోధ్యలో నిర్మించిన శ్రీరామ ప్రభువు దివ్య-భవ్య మందిరంలోకి శ్రీరాముని ఆగమనం కోసం అందరి ఎదురుచూపులు ఫలించే తరుణం ఆసన్నమైంది. దేశవ్యాప్తంగా గల నా కుటుంబ సభ్యులంతా ప్రాణ ప్రతిష్ట నిర్వహించే ఆ శుభ ఘడియ కోసం నిరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీరామునికి ఆహ్వానం పలుకుతూ గీతాబెన్ రబారి ఆలపించిన భక్తి గీతం అందరినీ ఆనంద డోలికలలో ఓలలాడిస్తుంది" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

 

***

DS/ST


(Release ID: 1993953)