మంత్రిమండలి
మిషన్ నెట్ జీరో కార్బన్ ఉద్గారాన్ని సాధించడానికి భారతీయ రైల్వేలకు మద్దతు ఇవ్వడం కోసం అంతర్జాతీయ అభివృద్ధి/భారతదేశం (యుఎస్ఏఐడి/ఇండియా) కోసం భారత్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయు)కు ఆమోదం తెలిపిన క్యాబినెట్
Posted On:
05 JAN 2024 1:14PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గానికి ఈ రోజు జూన్ 14, 2023న భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య ఇంటర్నేషనల్ డెవలప్మెంట్/ఇండియా (యుఎస్ఏఐడి/ఇండియా) మధ్య 2030 నాటికి కార్బన్ సున్నా స్థాయికి ఉద్గారాలను సాధించడానికి భారతీయ రైల్వేలకు మద్దతు పడేందుకు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారని తెలియజేశారు.
రైల్వే రంగంలో తాజా పరిణామాలు మరియు పరిజ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడానికి ఈ ఎమ్ఓయు భారతీయ రైల్వేలకు ఒక వేదికను అందిస్తుంది. వినియోగ ఆధునీకరణ, అధునాతన ఇంధన పరిష్కారాలు మరియు వ్యవస్థలు, ప్రాంతీయ ఇంధనం మరియు మార్కెట్ ఏకీకరణ మరియు ప్రైవేట్ రంగ భాగస్వామ్యం, శిక్షణ మరియు సెమినార్లు/వర్క్షాప్లు పునరుత్పాదక శక్తి, ఇంధన సామర్థ్యం మరియు విజ్ఞాన భాగస్వామ్యం కోసం ఇతర పరస్పర చర్యల వంటి నిర్దిష్ట సాంకేతిక రంగాలపై ఈ ఒప్పందం దృష్టి సారిస్తుంది.
అంతకుముందు యూఎస్ఏఐడి/ఇండియా కూడా రైల్వే ప్లాట్ఫారమ్ల అంతటా రూఫ్టాప్ సోలార్ని అమర్చడంపై దృష్టి సారించిన ఐఆర్తోతో కలిసి పనిచేసింది.
యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్/ఇండియాతో భారతీయ రైల్వేలు సంతకం చేసిన ఎంఓయు కింది అవగాహనతో ఇంధన స్వయం సమృద్ధిని ఎనేబుల్ చేయడం కోసం ఉపయోగపడుతోంది.
ఇద్దరూ విడివిడిగా అంగీకరించాల్సిన వివరాలతో కింది కీలక కార్యాచరణ ప్రాంతాలపై సంయుక్తంగా విస్తృతంగా పని చేయాలని భావిస్తున్నారు:
- భారతీయ రైల్వేలకు క్లీన్ ఎనర్జీతో సహా దీర్ఘకాలిక ఇంధన ప్రణాళిక.
- భారతీయ రైల్వే భవనాల కోసం శక్తి సామర్థ్య విధానం మరియు కార్యాచరణ ప్రణాళిక అభివృద్ధి చేయడం.
- భారతీయ రైల్వే నికర-సున్నా దృష్టిని సాధించడానికి స్వచ్ఛమైన ఇంధన సేకరణ కోసం ప్రణాళిక.
- నియంత్రణ మరియు అమలు అడ్డంకులను పరిష్కరించడానికి సాంకేతిక మద్దతు.
- సిస్టమ్కు అనుకూలమై, పెద్ద-స్థాయి పునరుత్పాదక సేకరణ కోసం బిడ్ రూపకల్పన మరియు బిడ్ నిర్వహణ మద్దతు.
- ఇ-మొబిలిటీ ప్రచారంలో భారతీయ రైల్వేలకు మద్దతు ఇవ్వడం.
- గుర్తించబడిన ప్రాంతాలలో సహకారంతో ఈవెంట్, సమావేశాలు మరియు సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలను నిర్వహించడం.
- ఈ ఎమ్ఒయులోని అన్ని లేదా ఏదైనా భాగానికి పునర్విమర్శ, లేదా సవరణను వ్రాతపూర్వకంగా ఇందులో పాల్గొన్నవారు అభ్యర్థించవచ్చు. పార్టిసిపెంట్స్ ఆమోదించిన ఏదైనా రివిజన్, సవరణ లేదా సవరణ సవరించిన ఎంఓయూలో భాగం అవుతుంది. అటువంటి పునర్విమర్శ, సవరణ లేదా సవరణలు పాల్గొనేవారు నిర్ణయించిన తేదీ నుండి అమలులోకి వస్తాయి.
- ఈ అవగాహన ఒప్పందం సంతకం చేసిన తేదీ నుండి అమలులో ఉంటుంది మరియు ఐదు సంవత్సరాల కాలానికి లేదా దక్షిణాసియా ప్రాంతీయ ఇంధన భాగస్వామ్యం (ఎస్ఏఆర్ఈపి) ప్రభావవంతంగా ముగిసే వరకు ఏది ముందైతే అప్పటి వరకూ కొనసాగుతుంది.
ప్రభావం:
2030 నాటికి మిషన్ నెట్ జీరో కార్బన్ ఎమిషన్ (ఎన్జడ్సిఈ) సాధించడంలో భారతదేశ రైల్వేలకు మద్దతు ఇవ్వడానికి ఈ ఎంఓయూ సంతకం చేయబడింది. ఇది డీజిల్, బొగ్గు మొదలైన దిగుమతి చేసుకున్న ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించడానికి భారతీయ రైల్వేలకు సహాయపడుతుంది. పునరుత్పాదక శక్తి (ఆర్ఈ) ప్లాంట్ల విస్తరణకు మద్దతు ఇస్తుంది. దేశంలో ఆర్ఈ టెక్నాలజీతో స్థానిక పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి సహాయపడుతుంది. అలాగే ఇది స్థానిక ఉత్పత్తి అభివృద్ధికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది.
వ్యయం:
ఈ అవగాహన ఒప్పందం కింద సేవలకు సాంకేతిక సహాయాన్ని ఎస్ఏఆర్ఈపి కార్యక్రమం కింద యూఎస్ఏఐడి అందించడానికి ఉద్దేశించబడింది. ఈ ఎమ్ఒయు నిధుల బాధ్యత లేదా ఏ విధమైన నిబద్ధత కాదు మరియు ఇది కట్టుబడి ఉండదు. ఇది భారతీయ రైల్వేల నుండి ఎటువంటి ఆర్థిక నిబద్ధతను కలిగి ఉండదు.
****
(Release ID: 1993879)
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Nepali
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam