ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఈశాన్య ప్రాంతపు విద్యార్థులకు ఎన్.ఈ.సీ స్కాలర్షిప్లు
Posted On:
21 DEC 2023 2:13PM by PIB Hyderabad
నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ (ఎన్ఈసీ) ద్వారా భారత ప్రభుత్వం ఈశాన్య ప్రాంత విద్యార్థులకు ఉన్నత మరియు వృత్తిపరమైన విద్య స్కాలర్షిప్లను అందిస్తుంది. ఈ స్కాలర్షిప్లు మెరిట్ ప్రాతిపదికన అందుబాటులో ఉంటాయి. నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో నిర్దేశించిన విధానాన్ని అనుసరించి అర్హత పరీక్షలలో అభ్యర్థులు పొందిన వారి మార్కుల ఆధారంగా ధ్రువీకరించబడిన దరఖాస్తుల నుండి జాబితాలు తీసుకోబడతాయి. వివిధ స్థాయిలలో సంబంధిత సబ్జెక్టులు/కోర్సుల కోసం ప్రస్తుత స్కాలర్షిప్ రేటు క్రింది విధంగా ఉంది:
అధ్యయన స్థాయి
|
తాజా మరియు పునరుద్ధరణ కేసుల కోసం స్కాలర్షిప్ మొత్తం
(ఇప్పటికే ఉన్న విద్యార్థులు)
|
గ్రాడ్యుయేట్
|
Rs. 22,000/- per annum
|
పోస్ట్ గ్రాడ్యుయేట్
|
Rs. 25,000/- per annum
|
ఎంఫిల్/పీహెచ్డీ
|
Rs. 30,000/- per annum
|
డిప్లమా
|
Rs. 20,000/- per annum
|
స్కాలర్షిప్ల పంపిణీ 2021-22 సంవత్సరం నుండి డీబీటీ పోర్టల్ ద్వారా అమలు చేయబడుతోంది మరియు ఇప్పుడు క్రమబద్ధీకరించబడిన కొత్త పంపిణీ వ్యవస్థకు మారడం వల్ల జాప్యం జరిగిన సందర్భాలు ఉన్నాయి ఇప్పడు వ్యవస్థ సజావుగా నడుస్తోంది. 2020-21 నుండి 2022-23 మధ్య కాలంలో మొత్తం 27,726 దరఖాస్తులు అందాయి. వాటిలో మొత్తం 4756 కేసులు ఎంపిక చేయబడ్డాయి. 2020-21 నుండి 2022-23 మధ్య కాలంలో వివిధ కేటగిరీలలో ఎంపికైన అభ్యర్థుల సంఖ్య రాష్ట్రాల వారీగా క్రింది పట్టికలో ఇవ్వబడింది:
క్రమ సంఖ్య
|
రాష్ట్రం
|
కోర్సుల వారీగా ఎంపికైన అభ్యర్థుల సంఖ్య
|
గ్రాడ్యుయేట్
|
పోస్ట్ గ్రాడ్యుయేట్
|
ఎంఫిల్/పీహెచ్డీ
|
డిప్లమా
|
మొత్తం
|
1
|
అరుణాచల్ ప్రదేశ్
|
103
|
47
|
3
|
11
|
164
|
2
|
అస్సాం
|
1206
|
397
|
54
|
218
|
1875
|
3
|
మణిపూర్
|
644
|
238
|
37
|
69
|
988
|
4
|
మేఘాలయ
|
133
|
114
|
4
|
14
|
265
|
5
|
మిజోరాం
|
61
|
36
|
1
|
2
|
100
|
6
|
నాగాలాండ్
|
50
|
40
|
2
|
1
|
93
|
7
|
సిక్కిం
|
81
|
91
|
0
|
5
|
177
|
8
|
త్రిపుర
|
722
|
238
|
4
|
130
|
1094
|
|
మొత్తం
|
3000
|
1201
|
105
|
450
|
4756
|
ఈ రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ బి.ఎల్.వర్మ లిఖితపూర్వకంగా అందించిన ఒక సమాధానంలో ఈ సమాచారం అందించారు.
***
(Release ID: 1989459)
Visitor Counter : 96