హోం మంత్రిత్వ శాఖ

డిసెంబర్ 10న ఆదివారం బీహార్‌లోని పాట్నాలో జరిగే తూర్పు జోనల్ కౌన్సిల్ 26వ సమావేశానికి అధ్యక్షత వహించనున్న కేంద్ర హోం మరియు సహకారశాఖ మంత్రి శ్రీ అమిత్ షా


సర్వతోముఖాభివృద్ధిని సాధించేందుకు సహకార మరియు పోటీ సమాఖ్య విధానాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

బలమైన రాష్ట్రాలు ఒక బలమైన దేశాన్ని సృష్టిస్తాయని మరియు రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు లేదా కేంద్రం మరియు రాష్ట్రాలను ప్రభావితం చేసే సమస్యలపై చర్చలకు వేదిక మరియు క్రమబద్ధమైన యంత్రాంగాన్ని అందిస్తాయని జోనల్ కౌన్సిల్‌లు విశ్వసిస్తున్నాయి.

గత 9 సంవత్సరాలలో 2014 నుండి 29 స్టాండింగ్ కమిటీల సమావేశాలు మరియు 26 జోనన్ కౌన్సిల్ సమావేశాలతో కలిపి మొత్తం 55 వివిధ జోనన్ కౌన్సిల్ సమావేశాలు జరిగాయి.

ప్రతి జోనన్ కౌన్సిల్ సమావేశంలో జాతీయ ప్రాముఖ్యత కలిగిన అనేక అంశాలు కూడా చర్చించబడతాయి

Posted On: 09 DEC 2023 9:34AM by PIB Hyderabad

డిసెంబర్ 10, 2023 ఆదివారం  బీహార్‌లోని పాట్నాలో జరిగే తూర్పు జోనల్ కౌన్సిల్ 26వ సమావేశానికి కేంద్ర హోం  మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. తూర్పు జోనల్ కౌన్సిల్‌లో బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా మరియు జార్ఖండ్ రాష్ట్రాలు ఉన్నాయి.  బీహార్ ప్రభుత్వంతో కలిసి భారత ప్రభుత్వంలోని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సెక్రటేరియట్ ఈ సమావేశం నిర్వహిస్తోంది. ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ యొక్క 26వ సమావేశానికి ఇద్దరు సీనియర్ మంత్రులతో పాటు సభ్యరాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు.

రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956లోని సెక్షన్ 15-22 ప్రకారం 1957లో ఐదు జోనల్ కౌన్సిల్‌లు స్థాపించబడ్డాయి. ఈ ఐదు జోనల్ కౌన్సిల్‌లకు కేంద్ర హోంమంత్రి చైర్మన్‌గా ఉండగా, రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్/లెఫ్టినెంట్ గవర్నర్, సంబంధిత జోనల్ కౌన్సిల్ నుండి  సభ్యులుగా ఉంటారు. వీరిలో ఒకరు ప్రతి సంవత్సరం వైస్-ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ప్రతి రాష్ట్రం నుండి మరో ఇద్దరు మంత్రులను మండలి సభ్యులుగా గవర్నర్ నామినేట్ చేస్తారు. ప్రతి జోనల్‌ కౌన్సిల్‌  ప్రధాన కార్యదర్శుల స్థాయిలో స్టాండింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. తూర్పు జోనల్ కౌన్సిల్ 26వ సమావేశానికి బీహార్ ముఖ్యమంత్రి వైస్ చైర్మన్‌గా ఉన్నారు.

రాష్ట్రాలు ప్రతిపాదించిన అంశాలు ముందుగా సంబంధిత జోనల్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ ముందు చర్చకు సమర్పించబడతాయి. పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోలేని సమస్యలను జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చకు అందజేస్తారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సర్వతోముఖాభివృద్ధిని సాధించేందుకు సహకార మరియు పోటీతత్వ సమాఖ్యవాదాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. బలమైన రాష్ట్రాలు బలమైన దేశాన్ని సృష్టిస్తాయని మరియు రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు లేదా కేంద్రం మరియు రాష్ట్రాలను ప్రభావితం చేసే సమస్యలపై క్రమమైన చర్చలు మరియు చర్చలకు వేదిక మరియు క్రమబద్ధమైన యంత్రాంగాన్ని అందిస్తాయని జోనల్ కౌన్సిల్‌లు విశ్వసిస్తున్నాయి. గత 9 సంవత్సరాలలో 2014 నుండి, 29 స్టాండింగ్ కమిటీల సమావేశాలు మరియు 26 జోనల్ కౌన్సిల్‌ సమావేశాలతో సహా మొత్తం 55 వివిధ జోనల్ కౌన్సిల్‌ సమావేశాలు జరిగాయి.

జోనల్ కౌన్సిల్‌లు సలహా పాత్రను పోషిస్తాయి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ కౌన్సిల్‌లు వివిధ రంగాలలో పరస్పర అవగాహన మరియు సహకారాన్ని ప్రోత్సహించడానికి ఒక ముఖ్యమైన యంత్రాంగంగా ఉద్భవించాయి. కౌన్సిల్ సమావేశాలలో రాగితో సమానంగా కోడో, కుట్కి మరియు ఇతర చిన్న మినుము పంటలకు కనీస మద్దతు ధర, సమగ్ర సిల్ట్ మేనేజ్‌మెంట్ పాలసీ కింద జలశక్తి మంత్రిత్వ శాఖ ద్వారా 2022లో అవక్షేప నిర్వహణ కోసం జాతీయ ఫ్రేమ్‌వర్క్ విడుదల వంటి అనేక ముఖ్యమైన నిర్ణయాలు జరిగాయి. 2022-23 నుండి కిసాన్ క్రెడిట్ కార్డ్‌లో లక్క సాగును చేర్చడానికి మరియు లక్క సాగుకు ఆర్థిక స్థాయిని నిర్ణయించడానికి రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ, జోనల్ కౌన్సిల్‌లు మైనింగ్, కొన్ని అంశాలపై కేంద్ర ఆర్థిక సహాయం, మౌలిక సదుపాయాల కల్పన, భూసేకరణ మరియు భూ బదిలీ, నీటి భాగస్వామ్యం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ స్కీమ్ (డిబిటి) అమలు, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ మరియు ఇతర సాధారణ ప్రయోజనాలతో సహా అనేక రకాల సమస్యలను చర్చిస్తాయి.

ప్రతి జోనల్ కౌన్సిల్‌  సమావేశంలో జాతీయ ప్రాముఖ్యత కలిగిన అనేక అంశాలు కూడా చర్చించబడతాయి. మహిళలు మరియు పిల్లలపై అత్యాచార కేసుల సత్వర విచారణ మరియు త్వరిత పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానాల (ఎఫ్‌ఎస్‌టిసి) కార్యాచరణ, ప్రతి గ్రామానికి 5 కి.మీ పరిధిలో బ్యాంకులు/ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ శాఖల సౌకర్యం, దేశంలో రెండు లక్షల కొత్త ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాల (పిఎసిఎస్) ఏర్పాటు, పోషకాహార ప్రచారం ద్వారా పిల్లల్లో పోషకాహార లోపాన్ని తొలగించడం, పాఠశాల విద్యార్థుల డ్రాప్-అవుట్ రేటును తగ్గించడం, ఆయుష్మాన్ భారత్-ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజనలో ప్రభుత్వ ఆసుపత్రుల భాగస్వామ్యం మరియు జాతీయ స్థాయిలో ఉమ్మడి ఆసక్తి ఉన్న ఇతర అంశాలు ఉన్నాయి.


 

***



(Release ID: 1984561) Visitor Counter : 80