ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మధ్యప్రదేశ్ అవతరణ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 01 NOV 2023 11:47AM by PIB Hyderabad

   ధ్యప్రదేశ్ వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ‘‘నానాటికీ ప్రగతి పథంలో కొత్త పుంతలు తొక్కుతున్న మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రం అమృత కాలంలో దేశ సంకల్పాలను సాకారం చేసే దిశగా కీలక తోడ్పాటునిస్తుంది. రాష్ట్రం ఇలాగే సర్వతోముఖాభివృద్ధి వైపు పయనించాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.

మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని నా కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అభివృద్ధిలో నిత్యం కొత్త శిఖరాలు అందుకుంటున్న మన మధ్యప్రదేశ్- అమృత కాలంలో దేశ సంకల్పాలను సాకారం చేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రాష్ట్రం ఇలాగే ప్రగతి పథంలో ముందడుగు వేయాలని నా శుభాకాంక్షలు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

*********

DS/SK


(రిలీజ్ ఐడి: 1973966) సందర్శకుల సూచీ సంఖ్య : : 200