ప్రధాన మంత్రి కార్యాలయం

ఆసియా పారాగేమ్స్‌ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్లో స్వర్ణం గెలిచిన తులసిమతి మురుగేశన్‌కు ప్రధాని అభినందన

Posted On: 27 OCT 2023 7:39PM by PIB Hyderabad

   చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్‌ మహిళల ‘బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్‌యు-5’లో స్వర్ణ పతకం సాధించిన తులసిమతి మురుగేశన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.

మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఎస్‌యు-5’లో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న తులసిమతి మురుగేశన్‌కు అభినందనలు. ప్రతి భారతీయుడూ గర్వపడేలా ఆమె సాధించిన ఈ విజయం భవిష్యత్తరం క్రీడాకారులకూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.



(Release ID: 1972420) Visitor Counter : 110