ప్రధాన మంత్రి కార్యాలయం

కాశీలో లఖా మేళాకి సంబంధించి భారత్ మిలాప్ సంగ్రహావలోకనం పంచుకున్న ప్రధాన మంత్రి

Posted On: 25 OCT 2023 7:41PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు కాశీలోని ల‌ఖా మేళాకు సంబంధించి భార‌త్ మిలాప్ నుండి ఫోటోలను షేర్ చేశారు. ఈ కార్యక్రమాన్ని సనాతన సంస్కృతిలో అంతర్భాగంగా పేర్కొంటూ, ఇది ఐదు శతాబ్దాల నాటి సంప్రదాయమని ప్రధాని మోదీ తెలియజేశారు. పార్లమెంటులో కాశీకి ప్రతినిధిగా ఆయన ఈ విశిష్ట సంప్రదాయంపై తెలియజేయడం గర్వంగా ఉందన్నారు.  

ప్రధానమంత్రి ఎక్స్ మాధ్యమంగా పోస్ట్ చేశారు: 

"‘‘కాశీలో లఖా మేళా ఆధ్వర్యంలో జరిగే భారత్ మిలాప్ భారతదేశ సనాతన సంస్కృతిలో అంతర్భాగమైంది. గత ఐదు శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ప్రదర్శన మరోసారి శ్రీరామభక్తులను భావోద్వేగానికి గురి చేసింది. ఎంపీగా కాశీలో, ఈ సంప్రదాయం పట్ల నేను ఎంతో గర్వంగా భావిస్తున్నాను" అని అన్నారు.



(Release ID: 1971767) Visitor Counter : 63