ప్రధాన మంత్రి కార్యాలయం

లోక్ నాయక్ శ్రీజయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్భం లో ఆయన కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

Posted On: 11 OCT 2023 9:36AM by PIB Hyderabad

లోక్ నాయక్ శ్రీ జయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని సమర్పించారు.

భారతదేశం లో ప్రజాస్వామ్యాన్ని బలపరచడం కోసం ఆయన చేసిన కృషి ని ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకోవడం తో పాటు గా స్వార్థాని కి తావు ఇవ్వకుండా ఆయన చేసిన సేవ దేశ పౌరుల కు ప్రేరణ గా నిలుస్తూనే ఉంటుందన్నారు.

‘‘సంపూర్ణ విప్లవ పిత లోక్ నాయక్ శ్రీ జయప్రకాశ్ నారాయణ్ కు ఆయన జయంతి నాడు ఇవే వందన శతాలు. ఆయన జీవన పర్యంతం భారతదేశం లో ప్రజాస్వామ్యాన్ని శక్తిమంతం గా తీర్చిదిద్దే దిశ లో పాటుపడుతూ వచ్చారు. ఆయన నిస్వార్థ సేవ భావన దేశ ప్రజల కు సదా ప్రేరణ ను అందిస్తూ ఉంటుంది.’’ అని ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశం లో పేర్కొన్నారు.

 



(Release ID: 1966639) Visitor Counter : 63