ప్రధాన మంత్రి కార్యాలయం

ఆసియా క్రీడల పురుషుల జావెలిన్ త్రోలో రజతం సాధించిన కిషోర్ జెనాకు ప్రధాని అభినందన

Posted On: 04 OCT 2023 7:22PM by PIB Hyderabad

   సియా క్రీడల పురుషుల జావెలిన్‌ త్రోలో రజత ప‌త‌కం సాధించిన క్రీడాకారుడు కిషోర్‌ జెనాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“ఆసియా క్రీడల పురుషుల జావెలిన్‌ త్రోలో మన క్రీడాకారులు సాధించిన విజయాలు ఆమోఘం. స్వర్ణ పతకాన్ని భారత్‌ ఇప్పటికే కైవసం చేసుకోగా, ఇప్పుడు రజతం కూడా మనకే దక్కింది. ఈ క్రీడలో అద్భుత ప్రతిభ ప్రదర్శించిన కిషోర్ జెనాకు నా అభినందనలు. అతడు సాధించిన ఈ విజయాన్ని దేశం ఎంతగానో ఆస్వాదిస్తోంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.



(Release ID: 1964510) Visitor Counter : 111