ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా క్రీడల మహిళల 5000 మీటర్ల పరుగులో స్వర్ణ పతక విజేత పారుల్ చౌదరికి ప్రధానమంత్రి అభినందన

Posted On: 03 OCT 2023 9:47PM by PIB Hyderabad

   సియా క్రీడల మహిళల 5000 మీటర్ల పరుగులో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న ట్రాక్ అండ్ ఫీల్డ్ క్రీడాకారిణి పారుల్ చౌదరిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు అభినందించారు. ఈ మేరకు ఆమె ప్రతిభను కొనియాడుతూ- ఈ విజయం నిజంగా అత్యద్భుతమని,  భవిష్యత్తులో ఆమె ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“మహిళల 5000 మీటర్ల పరుగులో పారుల్ చౌదరి స్వర్ణ పతకం సాధించడం దేశానికి గర్వకారణం. ఆమె సాధించిన ఈ విజయం అపూర్వం… ఆమె మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతూ భవిష్యత్తులోనూ విజయపథంలో దూసుకుపోవాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/RT



(Release ID: 1963933) Visitor Counter : 82