శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

భారతదేశ అభివృద్ధిలో 'హరిత ఆర్థిక వ్యవస్థ" పాత్ర కీలకంగా ఉంటుంది.. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


రాబోయే కాలంలో జీవ ఆర్థిక వ్యవస్థ అత్యంత లాభదాయకమైన జీవనాధారం: డాక్టర్ జితేంద్ర సింగ్

"ప్రధాని మోదీ ప్రకటించిన అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వేతర వనరులు సమకూరుతాయి " ... డాక్టర్ జితేంద్ర సింగ్

"జాతీయ విద్యా విధానం - 2020 యువతకలలు సాకారం... చేస్తుంది.డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 03 OCT 2023 4:36PM by PIB Hyderabad

భారతదేశ అభివృద్ధిలో 'హరిత ఆర్థిక వ్యవస్థ" పాత్ర కీలకంగా ఉంటుంది అని కేంద్ర  శాస్త్ర సాంకేతిక, ప్రధాన మంత్రి కార్యాలయంలో సహాయ మంత్రి, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ మంత్రిత్వ శాఖ, అణు శక్తి శాఖ, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత)  డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.    

"గ్రీన్ రిబ్బన్ ఛాంపియన్స్" సదస్సు  సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్  ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. .

ప్రారంభం నుంచి పరిశ్రమ రంగం అంకుర సంస్థలు, పరిశోధన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. 

' గ్రీన్ ఫైనాన్సింగ్ రంగంలో  పరిశ్రమలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. పరిశ్రమల సహకారం లేకుండా 

 ఒక నిర్దిష్ట స్థాయికి మించి ముందుకు సాగలేరని నా అభిప్రాయం," అని మంత్రి పేర్కొన్నారు. 

 రాబోయే కాలంలో బయో ఎకానమీ జీవనోపాధికి అత్యంత లాభదాయకమైన వనరుగా మారుతుందన్న అభిప్రాయాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ వ్యక్తం చేశారు.  

"2014లో భారతదేశ బయో ఎకానమీ కేవలం 10 బిలియన్ డాలర్లుగా ఉంది, నేడు అది 80 బిలియన్ డాలర్లకు చేరింది.  కేవలం 8/9 సంవత్సరాల కాలంలో బయో ఎకానమీ   8 రెట్లు వృద్ధి సాధించింది.  2025 నాటికి $125 బిలియన్లకు చేరే అవకాశం ఉంది' అని మంత్రి తెలిపారు.  

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించిన అనుసంధన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (NRF) ద్వారా  భారీగా ప్రభుత్వేతర వనరులు సమకూరుతాయని  డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. తత్ఫలితంగా, ప్రభుత్వ  ప్రైవేటు రంగాల మధ్య ఉన్న అంతరాలు తొలిగిపోయి  భవిష్యత్ వృద్ధికి గొప్ప సమన్వయంతో పని చేయడానికి వీలవుతుంది అని ఆయన అన్నారు.

"నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఒక ఆలోచనల వేదికగా పని చేస్తుంది.  అవసరాలు లేదా భవిష్యత్తు అంచనాల ఆధారంగా చేపట్టాల్సిన  ప్రాజెక్ట్‌లు , నిధుల సమీకరణ అంశాలపై  నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ నిర్ణయం తీసుకుంటుంది." అని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు.  శాస్త్రీయ విధానంలో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ పనిచేసి ఆవిష్కరణలు ప్రోత్సహిస్తుందని మంత్రి తెలిపారు. 

ఇటీవల జరిగిన వర్షాకాల సమావేశాల్లో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ చట్టానికి  పార్లమెంట్ ఆమోదం తెలిపింది. 5 సంవత్సరాల కాలానికి నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కు ప్రభుత్వం  రూ.50,000 కోట్ల బడ్జెట్‌ కేటాయింపులు చేసింది. భారతదేశంలో విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పరిశోధన సంస్థలు , పరిశోధన అభివృద్ధి, ప్రయోగశాలలలో పరిశోధన, ఆవిష్కరణలను నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రోత్సహిస్తుంది.స్వచ్ఛమైన ఇంధన పరిశోధన ,వినూత్న ఆవిష్కరణలకు  నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్   సహకారం అందిస్తుంది. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కు అవసరమైన నిధులలో   70% నిధులను  ప్రభుత్వేతర వనరుల నుంచి సమీకరిస్తారు. 

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ తీసుకొచ్చిన గొప్ప విప్లవాలలో ఒకటి జాతీయ విద్యా విధానం, NEP-2020. ఇది విద్యార్థులు తమ ఉన్నత చదువులను ఇంజినీరింగ్ నుండి హ్యుమానిటీస్‌కు మార్చడానికి మరియు వారి ఆప్టిట్యూడ్ ఆధారంగా వారి ఉన్నత చదువులను మార్చుకోవడానికి అనుమతిస్తుంది.

"ఇది మన జీవితంలోని ప్రతి రంగంపై, మన మానసిక శ్రేయస్సుపై కూడా ప్రభావం చూపుతుంది. నేను చెప్పినట్లుగా, పౌరులు లేదా యువత తమ జీవితమంతా తమ తల్లిదండ్రులచే పోషించబడిన 'తమ ఆకాంక్షల ఖైదీలుగా' జీవించరు, ”అని అతను చెప్పాడు.

మల్టిపుల్ ఎంట్రీ/ఎగ్జిట్ ఆప్షన్‌తో, NEP-202 యొక్క లక్ష్యాలలో ఒకటి విద్య నుండి డిగ్రీని డి-లింక్ చేయడం. అకడమిక్ ఫ్లెక్సిబిలిటీ విద్యార్థులపై వారి అంతర్గత అభ్యాసం మరియు స్వాభావిక యోగ్యతపై ఆధారపడి వివిధ సమయాల్లో వివిధ కెరీర్ అవకాశాల లభ్యతకు సంబంధించిన సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.

 

****



(Release ID: 1963873) Visitor Counter : 139