ప్రధాన మంత్రి కార్యాలయం
తమిళ నాడు లోబస్సు ప్రమాదం లో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
01 OCT 2023 11:29AM by PIB Hyderabad
తమిళ నాడు లోని నీలగిరీస్ జిల్లా లో జరిగిన ఒక బస్సు దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రియతముల ను కోల్పోయిన కుటుంబాల కు కలిగిన శోకం లో తాను సైతం పాలుపంచుకొంటున్నట్లు మరియు మృతుల ఆత్మ కు శాంతి కలగాలని ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నట్లు ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
బస్సు ప్రమాదం లో మరణించిన వారి యొక్క దగ్గరి సంబంధికుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి రెండు లక్షల రూపాయల వంతున మరియు గాయపడిన వారి కి 50,000 రూపాయల వంతున పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి ప్రకటించారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -
తమిళ నాడు లోని నీలగిరీస్ జిల్లా కూనూర్ సమీపం లో ఒక బస్సు దుర్ఘటన లో ప్రాణ నష్టం వాటిల్లిందని తెలుసుకొని బాధ పడ్డాను. ప్రియతములను కోల్పోయిన కుటుంబాల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరగా కోలుకోవాలని ఆ ఈశ్వరుడి ని నేను ప్రార్థిస్తున్నాను. మృతుల దగ్గరి సంబంధికుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి రెండు లక్షల రూపాయల వంతున మరియు గాయపడిన వారి కి 50,000 రూపాయల వంతున పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి @narendramodi’’ అని తెలిపింది.
***
DS/RT
(रिलीज़ आईडी: 1962971)
आगंतुक पटल : 163
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam