సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

సిపిజిఆర్‌ఏఎంఎస్‌పై ఆగస్టు, 2023లో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పనితీరుపై 13వ నివేదికను విడుదల చేసిన డిఏఆర్‌పిజి


ఉత్తరప్రదేశ్ మరియు మహారాష్ట్ర ఆగస్టు 2023లో అత్యధిక ఫిర్యాదులను పరిష్కరించాయి

ఆగస్టు, 2023లో రాష్ట్రం/యూటీల ద్వారా మొత్తం 82,013 ఫిర్యాదులు పరిష్కరించబడ్డాయి. రాష్ట్ర/యూటీ ప్రభుత్వాల్లో పెండెన్సీ 1,69,753 ఫిర్యాదులకు తగ్గించబడింది

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెద్ద రాష్ట్రాలలో అగ్రస్థానంలో ఉంది తర్వాతి స్థానాల్లో జార్ఖండ్ ప్రభుత్వం మరియు రాజస్థాన్ ప్రభుత్వం ఉన్నాయి

20,000 కంటే తక్కువ ఫిర్యాదులు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ప్రభుత్వం అగ్రస్థానంలో ఉంది తర్వాత ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మరియు కేరళ ప్రభుత్వాలు ఉన్నాయి

ఈశాన్య రాష్ట్రాలలో సిక్కిం ప్రభుత్వం అగ్రస్థానంలో ఉంది ఆ తర్వాత అస్సాం ప్రభుత్వం మరియు అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఉన్నాయి

కేంద్రపాలిత ప్రాంతాలలో లక్షద్వీప్ ప్రభుత్వం అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత అండమాన్ & నికోబార్ ప్రభుత్వం మరియు లడఖ్ ప్రభుత్వం ఉన్నాయి

Posted On: 19 SEP 2023 5:29PM by PIB Hyderabad

డిపార్ట్‌మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ (డిఏఆర్‌పిజి) ఆగస్టు, 2023లో రాష్ట్రాలకు సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (సిపిజిఆర్‌ఏఎంఎస్‌) 13వ నెలవారీ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రజల ఫిర్యాదుల రకాలు మరియు పరిష్కారంపై వివరణాత్మక విశ్లేషణను అందిస్తుంది.

ఆగస్టు, 2023లో రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల ద్వారా మొత్తం 82,013 ఫిర్యాదులు పరిష్కరించబడ్డాయి. సిపిజిఆర్‌ఏఎంఎస్‌ పోర్టల్‌లో స్వీకరించబడిన రాష్ట్రాలు/యుటిల ఫిర్యాదుల పెండింగ్‌లు రాష్ట్రాలు/యుటిల ప్రభుత్వాల అంతటా 1,69,753 ఫిర్యాదులకు తగ్గాయి.

రాష్ట్రాలు/యూటీలలో పెండింగ్‌లు జూలై, 2023 చివరి నాటికి 1,79,077 పీజీ కేసుల నుండి ఆగస్టు 2023 చివరి నాటికి 1,69,753 పీజీ కేసులకు తగ్గాయి. రాష్ట్రాలు/యూటీలలో పెండింగ్‌లు ఈ సంవత్సరం నమోదైన అతి తక్కువ కేసులు  1,69,753కి తగ్గాయి. వరుసగా 12వ నెలలో రాష్ట్రాలు/యూటీలలో నెలవారీ కేసుల సంఖ్య 50 వేలు దాటింది. ఆగస్టు, 2023లో రాష్ట్రాలు/యూటీలు 2023లో గరిష్ట ఫిర్యాదులను పరిష్కరించాయి.

మే, 2023 నుండి డిఏఆర్‌పిజి సిపిజిఆర్‌ఏఎంఎస్‌ పోర్టల్‌లో వారి పనితీరు ఆధారంగా రాష్ట్రాలు/యూటీల ర్యాంకింగ్ ప్రక్రియను ప్రారంభించింది. ప్రస్తుతం డిఏఆర్‌పిజి రాష్ట్రాలు/యూటీలను 4 కేటగిరీలలో ర్యాంక్ చేస్తుంది. అంటే ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఫిర్యాదుల రసీదు సంఖ్య ఆధారంగా రాష్ట్రాలకు మరో రెండు కేటగిరీలు విభజించబడ్డాయి. ఈ ర్యాంకింగ్ రాష్ట్రాలు/యుటిలు వారి ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను సమీక్షించడానికి మరియు క్రమబద్ధీకరించడానికి మరియు ఇతర రాష్ట్రాలు/యుటిలతో తులనాత్మక అంచనాను కలిగి ఉండటానికి సహాయం చేయడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో భాగం. గ్రీవెన్స్ రిడ్రెసల్ ఇండెక్స్‌లో 2 కొలతలు మరియు 4 సూచికలు ఉంటాయి.

ర్యాంకింగ్‌లు 01.01.2023 నుండి 31.08.2023 వరకు రెండు కోణాలలో (నాణ్యత మరియు ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించడం) రాష్ట్రాలు/యూటీల పనితీరుపై ఆధారపడి ఉంటాయి. 4 కేటగిరీలలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో టాప్ 3 ప్రదర్శకులు క్రింద చూపిన విధంగా ఉన్నారు:

 

క్రమ సంఖ్య

సమూహం

రాష్ట్రాలు/యూటీలు

ర్యాంక్ 1

ర్యాంక్ 2

ర్యాంక్ 3

1

గ్రూప్ ఏ

ఈశాన్య రాష్ట్రాలు

సిక్కిం

అస్సాం

అరుణాచల్ ప్రదేశ్

2

గ్రూప్ బి

కేంద్రపాలిత ప్రాంతాలు

లక్షద్వీప్

అండమాన్ & నికోబార్

లడఖ్

3

గ్రూప్ సి

>= 20000

ఫిర్యాదులు ఉన్న రాష్ట్రాలు

ఉత్తర ప్రదేశ్

జార్ఖండ్

రాజస్థాన్

4

గ్రూప్ డి

< 20000

ఫిర్యాదులు ఉన్న రాష్ట్రాలు

తెలంగాణ

ఛత్తీస్‌గఢ్

కేరళ

 

వరుసగా 12వ నెలలో, రాష్ట్రాలు/యూటీలలో నెలవారీ కేసుల సంఖ్య 50 వేలు దాటింది.

2023 ఆగస్టులో ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక ఫిర్యాదులు అందాయి వాటి సంఖ్య 24575గా ఉంది. ఉత్తరప్రదేశ్ మరియు మహారాష్ట్ర ఆగస్టు, 2023లో గరిష్ట సంఖ్యలో ఫిర్యాదులను పరిష్కరించాయి. వాటి సంఖ్య వరుసగా 24157 మరియు 18692 ఉన్నాయి. సేవోత్తం పథకం కింద రాష్ట్రం/యూటీ ఏటీఐలు నిర్వహిస్తున్న శిక్షణల నిజ సమయ స్థితిని పర్యవేక్షించడానికి డిఏఆర్‌పిజి ఒక ప్రత్యేక పోర్టల్‌ను అభివృద్ధి చేసింది.

 
***


(Release ID: 1958880) Visitor Counter : 117