ప్రధాన మంత్రి కార్యాలయం
మారిశస్ ప్రధాని, బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా గారు మరియు యుఎస్ అధ్యక్షుడు లతో మూడుద్వైపాక్షిక సమావేశాల ను న్యూ ఢిల్లీ లోని తన నివాసం లో నిర్వహించనున్న ప్రధానమంత్రి
Posted On:
08 SEP 2023 1:40PM by PIB Hyderabad
మారిశస్ ప్రధాని శ్రీ ప్రవింద్ కుమార్ జుగ్ నాథ్, బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా గారు మరియు యుఎస్ అధ్యక్షుడు శ్రీ జో బైడెన్ లతో మూడు ద్వైపాక్షిక సమావేశాల ను ఈ రోజు న సాయంత్రం పూట న్యూ ఢిల్లీ లోని తన నివాసం లో జరపనున్నట్లు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ఎక్స్’ మాధ్యం ద్వారా తెలియ జేశారు.
ఆయా దేశాల తో భారతదేశాని కి ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాల ను సమీక్షించడాని కి మరియు అభివృద్ధి పరమైన సహకారాన్ని మరింత బలపరచుకోవడాని కి ఒక అవకాశాన్ని ఈ సమావేశాలు ఇవ్వనున్నాయి అని కూడా శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ ను ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేస్తూ, అందులో -
‘‘ఈ రోజు న సాయంత్రం, నా నివాసం లో జరగబోయే మూడు ద్వైపాక్షిక సమావేశాల కోసం నేను ఎదురు చూస్తున్నాను. మారిశస్ ప్రధాని శ్రీ @KumarJugnauth, బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా గారు మరియు శ్రీ @POTUS @JoeBiden లతో నేను సమావేశమవుతాను. ఆయా దేశాల తో భారతదేశాని కి ఉన్న ద్వైపాక్షిక సంబంధాల ను సమీక్షించడాని కి మరియు అభివృద్ధి సంబంధి సహకారాన్ని మరింత గా బలపరచుకోవడాని కి ఒక అవకాశాన్ని ఈ సమావేశాలు అందించనున్నాయి’’ అని పేర్కొన్నారు.
*******
DS/ST
(Release ID: 1955563)
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam