సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
48వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొని దేశ సృజనాత్మక నైపుణ్యాన్ని ప్రదర్శించనున్న భారతదేశం
భారతీయ ప్రతినిధి బృందం భారతదేశాన్ని సృజనాత్మక కేంద్రంగా, కథకుల దేశంగా ప్రదర్శిస్తుంది మరియు దేశంలో చిత్రీకరణ సౌలభ్యాన్ని ప్రోత్సహిస్తుంది
నాడు పోస్టు చేయడమైనది:
06 SEP 2023 4:05PM by PIB Hyderabad
ఈ సంవత్సరం మేలో 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో విజయవంతంగా పాల్గొన్న తర్వాత, భారతదేశం తన చిత్రాలను సెప్టెంబర్ 7, 2023 నుండి ప్రారంభమయ్యే 48వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (టిఐఎఫ్ఎఫ్) తీసుకువెళ్లడానికి సిద్ధమైంది. ఈ సంవత్సరం భారతదేశాన్నిప్రతిభ, కంటెంట్ మరియు వినోద కేంద్రంగా ప్రదర్శించడంపై దృష్టి కేంద్రీకరించబడుతుంది.టిఐఎఫ్ఎఫ్కి అధికారిక భారతీయ ప్రతినిధి బృందానికి భారత ప్రభుత్వంలోని సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ (సినిమాలు), మరియు నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్డిసి) మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పృథుల్ కుమార్ నాయకత్వం వహిస్తారు. ఎన్ఎఫ్డిసి అనేది టిఐఎఫ్ఎఫ్లో భారతదేశ భాగస్వామ్యాన్ని నిర్వహించే సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన నోడల్ ఏజెన్సీ.
భారతదేశం తన విస్తృతమైన భాగస్వామ్య ప్రణాళికలో దేశ సృజనాత్మక మరియు సాంకేతిక బలాలను ప్రదర్శించడానికి అనేక సెషన్లను నిర్వహిస్తుంది మరియు భారతదేశంతో కలిసి చిత్రాలను నిర్మించడానికి మరియు భారతీయ ప్రదేశాలలో చిత్రీకరించడానికి అంతర్జాతీయ వాటాదారులను ఆహ్వానిస్తుంది. కమ్, ఫిల్మ్ ఇన్ ఇండియా అనే పేరుతో ఒక ప్రత్యేకమైన స్పాట్లైట్ సెషన్, భారతదేశ చలనచిత్ర విధానాలను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తుంది. దేశంలో చిత్రీకరణ సౌలభ్యాన్ని ప్రోత్సహించడానికి భారతదేశం యొక్క సింగిల్ విండో మెకానిజం అంతర్జాతీయ సోదరులకు తయారు చేయబడుతుంది. భారతదేశం మరియు కెనడా యొక్క సినిమా విజయాల వేడుకగా, దేశాలు ఫీచర్, షార్ట్ ఫిల్మ్లు, యానిమేషన్ ప్రాజెక్ట్లు, ఓటిటి కంటెంట్ మరియు వెబ్ ప్రాజెక్ట్లు వంటి మాధ్యమాలలో చలనచిత్ర నిర్మాణ సామర్థ్యాన్ని అన్వేషించడానికి మరియు ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తాయి. కార్యక్రమానికి హాజరవుతున్నవారిలో ఎన్ఎఫ్డిసి, అంటారియో క్రియేట్స్, టెలిఫిల్మ్ కెనడా, భారతీయ నిర్మాతలు మరియు కెనడియన్ నిర్మాతల ప్రతినిధులు ఉంటారు.
అహ్మదాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ రూపొందించిన ఇండియా పెవిలియన్ ప్రారంభోత్సవంతో టిఐఎఫ్ఎఫ్లో భారతదేశం పాల్గొనడం ప్రారంభమవుతుంది. స్పాట్లైట్ సెషన్తో పాటు, కథకుల భూమిగా భారతదేశంపై ఒక సెషన్ మరియు అంతర్జాతీయ ప్రముఖులతో అనేక సమావేశాలు ప్లాన్ చేయబడ్డాయి.
ఈ సంవత్సరం టిఐఎఫ్ఎఫ్లో అధికారిక ఎంపికలో ఆరు భారతీయ సినిమాలు షార్ట్లిస్ట్ చేయబడ్డాయి. అవి తార్సేమ్ సింగ్ దంద్వార్ దర్శకత్వం వహించిన డియర్ జస్సీ, నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వం వహించిన కిల్, కరణ్ బూలానీ దర్శకత్వం వహించిన థ్యాంక్యూ ఫర్ కమింగ్, కిరణ్రావ్ దర్శకత్వం వహించిన లాస్ట్ లేడీస్, జయంత్ దిగంబర్ సోమల్కర్ దర్శకత్వం వహించిన స్థల్/ ఎ మ్యాచ్, ఆనంద్ పట్వర్ధన్ దర్శకత్వం వహించిన వసుధైవ కుటుంబం / ది వరల్డ్ ఈజ్ ఫ్యామిలీ ఉన్నాయి. అలాగే సుసి గణేశన్ దర్శకత్వం వహించిన దిల్ హై గ్రే చిత్రం మార్కెట్ విభాగంలో ప్రదర్శించబడుతుంది.
***
(రిలీజ్ ఐడి: 1955241)
సందర్శకుల సూచీ సంఖ్య : : 173