సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

'సద్భావన దివస్' పాటించిన డీఈపీడబ్ల్యూడీ

Posted On: 18 AUG 2023 3:17PM by PIB Hyderabad

'సద్భావన దివస్'ను ప్రతి సంవత్సరం ఆగస్టు 20న దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. అయితే, ఈ సంవత్సరం ఆగస్టు 20వ తేదీ ఆదివారం రోజు రావడంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ రోజు సద్భావన ప్రతిజ్ఞ నిర్వహించారు.

డీఈపీడబ్ల్యూడీ కార్యదర్శి శ్రీ రాజేష్ అగర్వాల్ నేతృత్వంలో, విభాగం అధికారులు సీజీవో కాంప్లెక్స్‌లోని అంత్యోదయ భవన్‌ సమావేశ మందిరంలో 'సద్భావన ప్రతిజ్ఞ' చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరిగింది.

దేశంలోని అన్ని మతాలు, భాషలు, ప్రాంతాల ప్రజల మధ్య జాతీయ సమైక్యత, మత సామరస్యాన్ని పెంచడానికి 'సద్భావన దివస్'ను పాటిస్తారు. హింసను విడనాడడం, ప్రజల మధ్య స్నేహాన్ని పెంచడం ఈ దినోత్సవాన్ని పాటించడం వెనుక ఉన్న ఉద్దేశం.

***



(Release ID: 1950373) Visitor Counter : 143