బొగ్గు మంత్రిత్వ శాఖ
బొగ్గు ఉత్పత్తి పెంచడానికి, అనవసర దిగుమతులు తగ్గించడానికి చర్యలు
2023 జూలై వరకు 9.2% పెరిగిన దేశీయ బొగ్గు ఉత్పత్తి
Posted On:
09 AUG 2023 2:13PM by PIB Hyderabad
ప్రస్తుతం అమలులో ఉన్న దిగుమతి విధానం ప్రకారం ఓపెన్ జనరల్ లైసెన్స్ (OGL) కింద బొగ్గు ఉంది. బొగ్గు వినియోగదారులు వర్తించే సుంకం చెల్లించి కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు తమకు నచ్చిన మూలం నుంచి బొగ్గును దిగుమతి చేసుకోవచ్చు. దేశంలో బొగ్గు అవసరాలు చాలా వరకు స్వదేశీ ఉత్పత్తి ద్వారా తీరుతున్నాయి. దేశంలో ఉత్పత్తి పెంచడం, అనవసరమైన బొగ్గు దిగుమతిని తగ్గించే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. గత సంవత్సరంతో పోల్చి చూస్తే 2022-23 సంవత్సరంలో దేశంలో బొగ్గు ఉత్పత్తి దాదాపు 14.77% పెరిగింది. ప్రస్తుత సంవత్సరం 2023 జూలై వరకు దేశీయ బొగ్గు ఉత్పత్తి గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 9.2% పెరిగింది. ప్రస్తుత సంవత్సరంలో 2023-24 లో దేశీయ బొగ్గు ఉత్పత్తి ఒక బిలియన్ టన్ను కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా.
2022-23 లో విద్యుత్ రంగానికి 731.7 ఎంటీ దేశీయ బొగ్గు సరఫరా అయింది అని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (CEA) తెలిపింది.2019-20 లో విద్యుత్ రంగానికి 569.5 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా అయింది. వార్షిక సరఫరా వృద్ధి రేటు 8.6% గా ఉందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నివేదించింది.
ఏప్రిల్ 2023 - జూన్ 2023 మధ్య కాలంలో విద్యుత్ రంగం బొగ్గు దిగుమతి 14.21ఎంటీ గా ఉంది. గత సంవత్సరం ఇదే కాలంలో 16.36 ఎంటీ బొగ్గు దిగుమతి అయింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ డైలీ కోల్ రిపోర్ట్ (DCR) ప్రకారం థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 2023 ఆగస్టు 5 నాటికి 32.09 ఎంటీ బొగ్గు నిల్వలు ఉన్నాయి. బొగ్గు నిల్వలు దాదాపు 16 రోజుల అవసరాలు తీరుస్తాయి. సరిపోతుంది.
బొగ్గు ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు క్రింది విధంగా ఉన్నాయి:
i. బొగ్గు బ్లాక్ల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ ద్వారా తరచూ సమీక్షలు జరుగుతున్నాయి.
ii. గనులు మరియు ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ) సవరణ చట్టం, 2021 నిబంధనల ప్రకారం క్యాప్టివ్ గనుల యజమానులు (అణు ఖనిజాలు కాకుండా) వారి వార్షిక ఖనిజ (బొగ్గు తో సహా) ఉత్పత్తిలో 50% వరకు కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా గనితో అనుసంధానించబడిన తుది వినియోగ ప్లాంట్ అవసరాలు తీర్చిన తర్వాత బహిరంగ మార్కెట్లో విక్రయించడానికి వీలు కల్పిస్తుంది. దీనికి కేంద్రం నిర్ణయించిన అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
iii. బొగ్గు గనుల కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు బొగ్గు రంగానికి సింగిల్ విండో క్లియరెన్స్ పోర్టల్
iv. బొగ్గు గనుల ముందస్తు కార్యాచరణ కోసం వివిధ అనుమతులు/క్లియరెన్స్లను పొందడం కోసం బొగ్గు బ్లాక్ కేటాయింపుదారుల హ్యాండ్హోల్డింగ్ కోసం ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్.
v. ఆదాయ భాగస్వామ్య ప్రాతిపదికన వాణిజ్య ప్రాతిపదికన బొగ్గు గనుల వేలం 2020 లో ప్రారంభమైంది. వాణిజ్య తవ్వకాల విధానం కింద నిర్ణీత గడువు లోగా నిర్ణయించిన లక్ష్యాల మేరకు బొగ్గు తవ్వకాలు సాగించిన సంస్థలకు చివరి ఆఫర్పై 50% రిబేట్ లభిస్తుంది. అలాగే, బొగ్గు గ్యాసిఫికేషన్ లేదా ద్రవీకరణపై ప్రోత్సాహకాలు (చివరి ఆఫర్పై 50% తగ్గింపు) మంజూరు చేయబడ్డాయి.
vi. సాధ్యమైనంత వరకు కోల్ ఇండియా లిమిటెడ్ తన భూగర్భ గనుల్లో మాస్ ప్రొడక్షన్ టెక్నాలజీ ముఖ్యంగా నిరంతర మైనర్లుని అవలంబిస్తోంది. వదిలివేయబడిన / నిలిపివేయబడిన గనుల లభ్యత దృష్ట్యా కోల్ ఇండియా లిమిటెడ్ కూడా పెద్ద సంఖ్యలో హై వాల్స్ (HW) గనులను ప్రారంభించాలని నిర్ణయించింది. కోల్ ఇండియా లిమిటెడ్ సాధ్యమైన చోట భారీ సామర్థ్యం గల భూగర్భ గనులు ప్రారంభించాలని కోల్ ఇండియా లిమిటెడ్ నిర్ణయించింది.
vii. తన ఓపెన్కాస్ట్ (ఓసి ) గనుల్లో కోల్ ఇండియా లిమిటెడ్ ఇప్పటికే అధిక సామర్థ్యం గల ఎక్స్కవేటర్లు, డంపర్లు మరియు సర్ఫేస్ మైనర్ లాంటి అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉంది. కోల్ ఇండియా లిమిటెడ్ 7 మెగా మైన్స్లో డిజిటలైజేషన్ను ప్రయోగాత్మకంగా అమలు చేసి, దశల వారీగా అన్ని కేంద్రాలకు విస్తరించడానికి ప్రణాళిక రూపొందింది.
viii. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రస్తుతం 67 ఎంటీ బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. 2023-24 నాటికి 75 ఎంటీ బొగ్గు ఉత్పత్తి చేయడానికి ఎస్సిసిఎల్ ప్రణాళిక సిద్ధం చేసింది. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ట్, ప్రస్తుతం పని చేస్తున్న ప్రాజెక్టుల పని తీరును క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు
బొగ్గు తరలింపు, పంపిణీ సామర్థ్యాలను మెరుగుపరచడానికి రైల్వే మంత్రిత్వ శాఖతో బొగ్గు మంత్రిత్వ శాఖ సమన్వయంతో పని చేస్తోంది. బొగ్గు పంపిణీ సామర్థ్యాల విస్తరణ కోసం రైల్వే మంత్రిత్వ శాఖ సహకారంతో 13 రైల్వే లైన్లు నిర్మిస్తున్నారు. పనులు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి.
1 బీటీ మెకనైజ్డ్ బొగ్గు నిర్వహణ సామర్థ్యాన్ని సాధించడానికి మొత్తం 67 ఫస్ట్ మైల్ కనెక్టివిటీ (FMC) ప్రాజెక్ట్లు 885 MT సామర్థ్యంతో 3 దశల్లో అమలు జరుగుతాయి. ప్రధానమంత్రి గతి శక్తి లక్ష్యానికి అనుగుణంగా మల్టీ మోడల్ కనెక్టివిటీని అభివృద్ధి చేయడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ రూ. 26000 కోట్ల రూపాయల విలువ చేసే రైల్వే ప్రాజెక్టులు చేపట్టింది.
విద్యుత్ రంగానికి బొగ్గు సరఫరా చేసే అంశంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు. వివిధ కార్యాచరణ నిర్ణయాలు తీసుకోవడానికి విద్యుత్ మంత్రిత్వ శాఖ, బొగ్గు మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ , కోల్ ఇండియా లిమిటెడ్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రతినిధులతో కూడిన ఇంటర్-మినిస్టీరియల్ సబ్ గ్రూప్ క్రమం తప్పకుండా సమావేశమవుతుంది. థర్మల్ పవర్ ప్లాంట్లకు బొగ్గు సరఫరాను మెరుగుపరచడానికి, విధ్యుత్ రంగంలో ఏర్పడే అత్యవసర పరిస్థితి ఎదుర్కోవడానికి, విధ్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో బొగ్గు నిల్వలు తగినంతగా వుండేలా చూసేందుకు వివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో ఏర్పాటైన ఇంటర్-మినిస్టీరియల్ సబ్ గ్రూప్ చర్యలు తీసుకుంటుంది.
అంతేకాకుండా, రైల్వే బోర్డు ఛైర్మన్, బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి, పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఇంధన శాఖ కార్యదర్శి, సభ్యులుగా మరో ఇంటర్-మినిస్టీరియల్ కమిటీ (IMC) కూడా ఏర్పాటు అయ్యింది. బొగ్గు సరఫరా , విద్యుదుత్పత్తి సామర్థ్యం పెంపుదల అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.
కేంద్ర బొగ్గు, గనులు ,పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ఈరోజు లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ సమాచారం అందించారు.
***
(Release ID: 1947280)