రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

దుబాయ్‌లోని రషీద్ పోర్టును చేరిన భారతీయ నౌకలు, ఈ నెల 11 వరకు పర్యటన

Posted On: 09 AUG 2023 11:42AM by PIB Hyderabad

భారత నౌకాదళానికి చెందిన ఐఎస్‌ఎస్‌ విశాఖపట్నం, ఐఎస్‌ఎస్‌ త్రికండ్, దుబాయ్‌లోని రషీద్ పోర్టుకు చేరుకున్నాయి. ఈ నెల 08-11 తేదీల్లో పర్యటన సాగుతుంది. INS విశాఖపట్నం, INS త్రికండ్‌ కెప్టెన్లు అశోక్ రావు, కెప్టెన్ ప్రమోద్ జి థామస్. ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ వెస్ట్రన్ ఫ్లీట్, కమాండ్ ఆఫ్ రియర్‌ అడ్మిరల్‌ వినీత్ మెకార్టీ ఆధ్వర్యంలో ఈ పర్యటన సాగుతుంది.

పర్యటన సమయంలో, యూఏఈ నావికాదళంతో కలిసి భారతీయ నౌకలు వివిధ సముద్ర కార్యక్రమాలు నిర్వహిస్తాయి. రెండు నౌకాదళాల మధ్య సహకారాన్ని పెంచుకోవడం, సంబంధాలను బలోపేతం చేయడం ఈ పర్యటన లక్ష్యం. రెండు నౌకాదళాల స్నేహాన్ని మెరుగుపరచడానికి 'జాయెద్ తల్వార్' పేరిట విన్యాసాలు కూడా చేపడతాయి. ప్రస్తుత పర్యటన రెండు నౌకాదళాల భాగస్వామ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది, ఆ ప్రాంతంలోని భద్రతపరమైన సవాళ్ల విషయంలో అవగాహన పెంచుతుంది.

****



(Release ID: 1947028) Visitor Counter : 138