ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

క్విట్ ఇండియాఉద్యమం లో పాలుపంచుకొన్న స్వాతంత్య్ర సమర యోధుల కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 09 AUG 2023 11:50AM by PIB Hyderabad

క్విట్ ఇండియా ఉద్యమం లో పాలుపంచుకొన్న స్వాతంత్య్ర సమర యోధుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని ఘటించారు. గాంధీ జీ నాయకత్వం లో వలస పాలన బారిన నుండి భారతదేశాన్ని విముక్తం చేయడం లో క్విట్ ఇండియా ఉద్యమం ఒక ప్రధానమైన పాత్ర ను పోషించిందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ సందర్భం లో ఒక వీడియో సందేశం మాధ్యం ద్వారా కూడా తన ఆలోచనల ను శ్రీ నరేంద్ర మోదీ వెల్లడి చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘క్విట్ ఇండియా ఉద్యమం లో పాల్గొన్న మహానుభావుల కు ఇదే శ్రద్ధాంజలి. గాంధీజీ నాయకత్వం లో ఈ ఉద్యమం వలస పాలన బారి నుండి భారతదేశాన్ని విముక్తం చేయడం లో ఒక ప్రధానమైనటువంటి పాత్ర ను పోషించింది. ప్రస్తుతం,

కరప్శన్ క్విట్ ఇండియా (అవినీతి, భారతదేశాన్ని వదిలిపెట్టు)

డినస్టి క్విట్ ఇండియా (వంశమా, భారతదేశాన్ని వదిలిపెట్టు)

అపీజ్ మెంట్ క్విట్ ఇండియా (తృప్తిపరిచే విధానమా, భారతదేశాన్ని వదిలిపెట్టు)

అని భారతదేశం ఒకే స్వరం లో పలుకుతోంది.’’ అని పేర్కొన్నారు.

********

DS/ST


(रिलीज़ आईडी: 1946974) आगंतुक पटल : 233
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Gujarati , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Kannada , Malayalam