మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఆగస్టు 2, 2023 నుంచి 4 వరకు గుజరాత్‌లోని గాంధీనగర్‌లో మహిళా సాధికారతపై జీ 20 మంత్రివర్గ సమావేశం జరగనుంది.


అంశం: ‘అంతర్-తరాల పరివర్తన కోణంగా స్త్రీల నేతృత్వంలో సమ్మిళిత అభివృద్ధి’

మహిళా-నేతృత్వంలోని అభివృద్ధిపై దృష్టి సారించే ఈ సదస్సు లింగ సమానత్వం, మహిళా సాధికారత మరియు ఎస్ డి జీ ని సాధించడం కోసం వేగవంతమైన విజయానికి అవకాశం:లక్ష్యం 5

Posted On: 01 AUG 2023 10:37AM by PIB Hyderabad

కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ అధ్యక్షతన జీ 20 ఇండియన్ ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలో మహిళా సాధికారతపై మంత్రివర్గ సమావేశం 2023 ఆగస్టు 2 నుండి 4 వరకు గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరగనుంది.

 

గాంధీనగర్ ఆధునికత మరియు సాంస్కృతిక చైతన్యంతో శతాబ్దాల నాటి వాస్తుశిల్పాల సంగమానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. చారిత్రక వారసత్వం, కళాఖండాలు, హస్తకళలు, కళలు, పండుగలు, గొప్ప దేవాలయాలు, మ్యూజియంలు మరియు సబర్మతి నది పశ్చిమ ఒడ్డున అభివృద్ధి చెందిన గొప్ప నాగరికతకు ఇది ప్రసిద్ధి చెందింది. 

 

మహిళా సాధికారతపై మంత్రివర్గ సమావేశం ప్రపంచ సవాళ్ల మధ్య తగినంత పురోగతి నుండి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్ డి జీ లు), వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సవాళ్లు మరియు  మహమ్మారి అనంతర అసమాన పునరుద్ధరణ నేపథ్యంలో జరుగుతుంది.

 

జీ 20 మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ మహిళల నేతృత్వంలోని అభివృద్ధిపై దృష్టి సారించడం ద్వారా లింగ సమానత్వం మరియు మహిళా సాధికారత మరియు ఎస్ డి జీ : లక్ష్యం 5ని సాధించడంలో వేగవంతమైన విజయానికి అవకాశం ఉంటుంది.

 

మూడు రోజుల పాటు జరిగే మంత్రివర్గ సమావేశంలో జీ 20 సభ్యులు, ఆహ్వానిత దేశాలు మరియు అంతర్జాతీయ సంస్థల  నుండి వారి సంబంధిత ప్రతినిధుల అధిపతుల నేతృత్వంలో 150 కంటే ఎక్కువ మంది ప్రతినిధులు పాల్గొంటారు.

 

మంత్రివర్గ సమావేశం ప్రారంభం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రత్యేక వీడియో ప్రసంగం చేస్తారు.

 

మూడు రోజుల చర్చలలో విద్యపై ప్రాధాన్యతా రంగాలపై దృష్టి సారిస్తాయి, మహిళా సాధికారతకు నూతన మార్గం; మహిళల పారిశ్రామిక వ్యవస్థాపకత, పెట్టుబడి మరియు ఆర్ధిక రంగ వృద్ధి కోసం; క్షేత్ర స్థాయి తో సహా అన్ని స్థాయిలలో మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించడం కోసం భాగస్వామ్యాన్ని సృష్టించడం;  వాతావరణ మార్పిడి ని తట్టుకునే మహిళా సాధికారత చర్య మరియు డిజిటల్ స్కిల్లింగ్‌లో మహిళలు మరియు బాలికలు సాధికారత పై చర్చిస్తారు.ఈ సెషన్లలో ఇతివృత్త చర్చలు చైర్ సారాంశంలో ప్రతిబింబిస్తాయి మరియు జీ 20 నాయకులకు సిఫార్సులుగా అందించబడతాయి.

 

ఇంకా, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ , యూ ఎన్ ఉమెన్ మరియు ఎన్ ఐ పి సి సి డి సంయుక్తంగా లింగ సమానత్వం కోసం ఆర్థిక విధానాలు మరియు సాధనాల యొక్క మూడు కీలక రంగాలలో చర్యలు మరియు విధాన సహాయ పరికరాలను గుర్తించడానికి సంరక్షణ ఆర్థిక వ్యవస్థ మరియు లింగ సమానత్వాన్ని వేగవంతం చేయడానికి వాతావరణ మార్పు సవాలు ఎదుర్కోవడం పై మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మద్దతుతో ఒక సైడ్ ఈవెంట్‌ను నిర్వహిస్తాయి. 

 

 

2- 3 ఆగస్ట్, 2023న మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 'భారతదేశం @ 75: మహిళల సహకారం' అనే అంశంపై మహిళల చేతిపనులు, పోషకాహారం, ఆహారం, ఆరోగ్యం, స్టెమ్, విద్య మరియు నైపుణ్యం, వాణిజ్యం ఆర్థిక రంగం పై దృష్టి సారించి ఒక ప్రదర్శనను నిర్వహించనుంది. 

'షిల్లాంగ్ ఛాంబర్ కోయిర్', 'డ్రమ్స్ ఆఫ్ ఇండియా' కార్యక్రమాలతో సహా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించే సంగీత మరియు నృత్య ప్రదర్శనలు మరియు పాల్గొనే మంత్రులు మరియు వారి ప్రతినిధుల కోసం బాల్ భవన్ నుండి పిల్లల ప్రదర్శనలు నిర్వహించబడతాయి. ఇంకా, అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరం సందర్భంగా  స్థానిక వంటకాలు మరియు మిల్లెట్ ఆధారిత ఆహారం ఈ కార్యక్రమంలో  అందించబడుతుంది.

 

గుజరాత్ రాష్ట్రం యొక్క శక్తివంతమైన చారిత్రక వారసత్వాన్ని ఆస్వాదించే అవకాశాన్ని ప్రతినిధులకు అందించడానికి విహారయాత్రలు కూడా ప్రణాళిక చేయబడ్డాయి.

 

భారత ప్రెసిడెన్సీ క్రింద ఉన్న ఎం సీ డబ్ల్యు ఈ  మునుపటి జీ 20 అధ్యక్షుల ద్వారా చేసిన పనిని నిర్మిస్తూనే, మహిళా సాధికారత దిశగా పురోగతిని వేగవంతం చేయడానికి మరియు మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని ప్రోత్సహించడంలో జీ 20 ప్రయత్నాలను బలోపేతం చేయడానికి జీ 20 యొక్క సహకారాన్ని పెంపొందించే ఆదేశాన్ని ముందుకు తీసుకువెళుతుంది.

 

భారతదేశం నేడు మహిళల అభివృద్ధి నుండి మహిళల నేతృత్వంలోని అభివృద్ధికి జరుగుతున్న పరివర్తనతో పెద్ద పరివర్తన మార్పులను ఎదుర్కొంటోంది. మహిళల పురోగతికి దారితీసే ప్రతి అడ్డంకిని తొలగించాలనే నమ్మకం మరియు సంకల్పం మరియు లింగం సంభావ్యతను నిర్వచించదనే దృఢ విశ్వాసం మహిళా సాధికారతపై జీ20 మినిస్టీరియల్ కాన్ఫరెన్స్‌కు ఆధారం.

 

***



(Release ID: 1944771) Visitor Counter : 172