రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ద్వైపాక్షిక రక్షణ సహకారం పెంపొందించేలా భారత్, జర్మనీ రక్షణ మంత్రుల చర్చలు

- ద్వైపాక్షిక రక్షణ సహకారంలో ముఖ్యంగా పారిశ్రామిక భాగస్వామ్యాన్ని పెంపొందించేలా చర్చలు
- ఉత్తర ప్రదేశ్ & తమిళనాడులలో ఉన్న డిఫెన్స్ కారిడార్‌లలో జర్మన్ పెట్టుబడులను ఆహ్వానించిన
శ్రీ రాజ్‌నాథ్ సింగ్
- జర్మనీ యొక్క అత్యున్నత సాంకేతికతలు, పెట్టుబడితో పాటు భారతదేశపు యొక్క నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్ & పోటీ ఖర్చులు సంబంధాలను మరింత బలోపేతం చేయగలవు:

Posted On: 06 JUN 2023 2:24PM by PIB Hyderabad

రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ జూన్ 06, 2023 న్యూ ఢిల్లీలో జర్మనీ దేశపు రక్షణ శాఖ మంత్రి శ్రీ బోరిస్ పిస్టోరియస్తో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారుమంత్రులిద్దరూ కొనసాగుతున్న ద్వైపాక్షిక రక్షణ సహకార కార్యకలాపాలను సమీక్షించారు. సహకారాన్నిముఖ్యంగా రక్షణ పారిశ్రామిక భాగస్వామ్యాన్ని పెంపొందించే మార్గాలను అన్వేషించారుఉత్తరప్రదేశ్ & తమిళనాడులోని రెండు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లలో జర్మన్ పెట్టుబడులకు ఉన్న అవకాశాలతో సహారక్షణ ఉత్పత్తి రంగంలో తెరవబడిన అవకాశాలను గురించి రక్షణ మంత్రి ప్రధానంగా వివరించారుభారత రక్షణ పరిశ్రమ జర్మన్ రక్షణ పరిశ్రమ యొక్క సరఫరా గొలుసులలో పాల్గొనవచ్చని మరియు సరఫరా గొలుసు స్థితిస్థాపకతకు దోహదం చేయడంతో పాటు పర్యావరణ వ్యవస్థకు విలువను జోడించవచ్చని అన్నారు.  భాగస్వామ్య లక్ష్యాలు, బలం యొక్క పరిపూరత, అంటే భారతదేశం నుండి నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్ & పోటీ ఖర్చులు మరియు జర్మనీ నుండి అధిక సాంకేతికతలు & పెట్టుబడి ఆధారంగా భారతదేశం మరియు జర్మనీలు మధ్య మరింత మేటి సంబంధాన్ని నిర్మించగలవని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ నొక్కి చెప్పారు. భారతదేశం మరియు జర్మనీలు 2000 నుండి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి, ఇది ప్రభుత్వాధినేతల స్థాయిలో 2011 నుండి అంతర్-ప్రభుత్వ సంప్రదింపుల ద్వారా బలోపేతం అవుతోంది.  రక్షణ శాఖ కార్యదర్శి శ్రీ గిరిధర్ అరమనే మరియు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్తో సహా రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు ప్రతినిధిలు స్తాయి సమావేశంలో పాల్గొన్నారుజర్మనీ వైపు నుండిరక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి బెనెడిక్ట్ జిమ్మెర్సీనియర్ అధికారులు మరియు భారతదేశంలోని జర్మన్ రాయబారి హాజరయ్యారు. 2015 తర్వాత జర్మనీ రక్షణ మంత్రి భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి.  ద్వైపాక్షిక సమావేశానికి ముందు సందర్శనకు వచ్చిన ప్రముఖులకు ట్రై-సర్వీస్ గార్డ్ ఆఫ్ హానర్ అందించారుబోరిస్ పిస్టోరియస్ ఐఐటీ ఢిల్లీలోని ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ (ఐడెక్స్నిర్వహించిన కార్యక్రమంలో కొన్ని భారతీయ డిఫెన్స్ స్టార్టప్లతో సంభాషించనున్నారు.

 

జర్మన్ ఫెడరల్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ జూన్ 05 నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారతదేశానికి వచ్చారుజూన్ 07 అతను ముంబయికి వెళ్తాడుఅక్కడ అతను ప్రధాన కార్యాలయంపశ్చిమ నౌకాదళ కమాండ్ మరియు మజాగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్లను సందర్శించనున్నారు.

***



(Release ID: 1930340) Visitor Counter : 159