ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రపంచ పర్యావరణ దినం అంశం పై ఏర్పాటైనసమావేశాన్నిఉద్దేశించి వీడియో సందేశం మాధ్యం ద్వారా ప్రసంగించిన ప్రధాన మంత్రి


‘‘ఒక ప్రక్కన మేం సింగిల్-యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాం, మరో ప్రక్కన ప్లాస్టిక్  వ్యర్థాల శుద్ధి ని తప్పనిసరి చేయడం జరిగింది’’


‘‘21వశతాబ్ది కిచెందిన భారతదేశం జలవాయు పరివర్తన కోసం మరియు పర్యావరణ పరిరక్షణ కోసం చాలా స్పష్టమైనటువంటిమార్గసూచి తో ముందుకు సాగిపోతున్నది’’

‘‘గడచిన తొమ్మిది సంవత్సరాల లో, భారతదేశం లో మాగాణి నేల మరియు రాంసర్ స్థలా ల సంఖ్య అంత క్రితం తో పోలిస్తే దాదాపు గా మూడు రెట్లు వృద్ధి చెందింది’’

‘‘ప్రపంచ శీతోష్ణస్థితి ని పరిరక్షించడం కోసం ప్రతి ఒక్క దేశం స్వార్థ ప్రయోజనాల కు మించిన ఆలోచనలను చేయాలి’’

‘‘భారతదేశం యొక్క వేల సంవత్సరాల సంస్కృతి లో ప్రకృతి కి తోడు ప్రగతి కూడా ఉంది’’

‘‘ప్రపంచాన్ని మార్చడం కోసం మీ యొక్క స్వభావం లో మార్పు నుతీసుకురావాలి అనేదే మిశన్ లైఫ్ యొక్క మూల సూత్రం గా ఉంది’’

‘‘జలవాయుపరివర్తన సంబంధి చైతన్యం ఒక్క భారతదేశాని కి పరిమితం కాదు, ఈ కార్యక్రమాని కి ప్రపంచంలో లభిస్తున్న సమర్థన అంతకంతకు పెరుగుతున్నది’’

‘‘మిశన్లైఫ్ దిశ లో తీసుకొనే ప్రతి చర్య, రాబోయే కాలాల్లో పర్యావరణాని కి సంబంధించిన ఒక దృఢమైన కవచం గాఉంటుంది’’

Posted On: 05 JUN 2023 2:38PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో సందేశం మాధ్యం ద్వారా ప్రపంచ పర్యావరణ దినం అంశం పై ఏర్పాటైన ఒక సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

 

సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ప్రపంచ పర్యావరణ దినం సందర్భం లో ప్రపంచం లోని ప్రతి ఒక్క దేశాని కి తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం పర్యావరణ దినం యొక్క ఇతివృత్తం అయినటువంటి సింగిల్-యూజ్ ప్లాస్టిక్కు స్వస్తి పలకడం కోసం ప్రచార ఉద్యమాన్ని గురించి ప్రధాన మంత్రి నొక్కి చెప్తూ, భారతదేశం గడచిన 4-5 సంవత్సరాలు గా ఈ దిశ లో నిరంతరం శ్రమిస్తోందంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. భారతదేశం 2018 వ సంవత్సరం నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బారి నుండి విముక్తి కోసం రెండు స్థాయిల లో పని చేస్తోందని శ్రీ నరేంద్ర మోదీ తెలియ జేశారు. ‘‘ఒక ప్రక్కన మేం సింగిల్-యూజ్ ప్లాస్టిక్ పై నిషేధాన్ని విధించాం, మరో ప్రక్కన ప్లాస్టిక్ వ్యర్థాల శుద్ధి ని తప్పనిసరి చేశాం’’ అని ఆయన అన్నారు. దీని వల్ల భారతదేశం లో ఇంచుమించుగా 30 లక్షల టన్నుల ప్లాస్టిక్ ప్యాకేజింగ్ యొక్క నిర్భంద రీ సైక్లింగ్ చోటు చేసుకొంది. ఇది భారతదేశం లో ఏటా పోగు పడే మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాల లో 75 శాతాని కి సమానం గా ఉంది. అంతేకాకుండా, ప్రస్తుతం దీని పరిధి లోకి దాదాపు గా ఉత్పత్తిదారు సంస్థ లు, దిగుమతిదారు సంస్థ లు మరియు బ్రాండులు కలుపుకొని దాదాపు గా పది వేల సంస్థ లు వచ్చేశాయి అని ఆయన వివరించారు.

 

 

21 వ శతాబ్దం లో భారతదేశం జలవాయు పరివర్తన కోసం మరియు పర్యావరణ పరిరక్షణ ల కోసం చాలా స్పష్టమైన మార్గసూచి తో ముందుకు కదులుతున్నది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. భారతదేశం ప్రస్తుత అవసరాల కు మరియు భావి దృష్టికోణాని కి మధ్య ఒక సమతుల్యత ను ఏర్పరచింది అని ప్రధాన మంత్రి చెప్తూ, రాబోయే కాలం లో శక్తి అవసరాల ను దృష్టి లో పెట్టుకొని ప్రధానమైన చర్యల ను తీసుకొంటూనే నిరుపేదల కోసం అవసరమైన సహాయాన్ని సమకూర్చడమైంది అని వివరించారు. ‘‘గత తొమ్మిది సంవత్సరాల లో గ్రీన్ ఎనర్జీ మరియు క్లీన్ ఎనర్జీల పై భారతదేశం ఇది వరకు ఎన్నడూ లేనంతగా శ్రద్ధ ను తీసుకొంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. సౌర శక్తి మరియు ఎల్ఇడి బల్బు లను ఆయన ఉదాహరణలు గా ప్రస్తావిస్తూ, ఈ చర్య లు ప్రజల కు డబ్బు ను ఆదా చేసుకోవడం లో తోడ్పడడం తో పాటు గా పర్యావరణాన్ని పరిరక్షించే దిశ లో కూడాను వాటి వంతు తోడ్పాటు ను అందించాయన్నారు. ప్రపంచం లో మహమ్మారి తలెత్తిన వేళ భారతదేశం వహించిన నాయకత్వాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, మిశన్ గ్రీన్ హైడ్రోజన్ కార్యక్రమాన్ని భారతదేశం మొదలు పెట్టింది, రసాయనిక ఎరువుల బారి నుండి నేల ను, నీటి ని రక్షించడం కోసం ప్రాకృతిక వ్యవసాయం దిశ లో ప్రధాన చర్యల ను చేపట్టిందన్నారు.

 

‘‘గడచిన తొమ్మిది సంవత్సరాల లో భారతదేశం లో మాగాణి నేల ల సంఖ్య మరియు రాంసర్ స్థలాల సంఖ్య అంత క్రితం తో పోలిస్తే దాదాపు గా మూడు రెట్లు వృద్ధి చెందింది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ రోజు న మరో రెండు పథకాల ను ప్రవేశపెట్టడమైంది. అవి గ్రీన్ ఫ్యూచర్, గ్రీన్ ఇకానమి ల తాలూకు ప్రచార ఉద్యమాన్ని ముందుకు తీసుకు పోతాయి అని ఆయన అన్నారు. ఈ రోజు న ప్రారంభించిన అమృత్ ధరోహర్ యోజనప్రజల భాగస్వామ్యం ద్వారా ఈ రాంసర్ స్థలాల పరిరక్షణ కు పూచీ పడుతుంది అని ప్రధాన మంత్రి తెలిపారు. భవిష్యత్తు లో ఈ రాంసర్ స్థలాలు ఇకో-టూరిజమ్ కు కేంద్రాలు గా నిలుస్తాయి, మరి వేల కొద్దీ ప్రజల కు గ్రీన్ జాబ్స్ తాలూకు ఒక వనరు గా కూడా మారుతాయి అని ప్రధాన మంత్రి వివరించారు. రెండో పథకం మిష్టీ యోజనఅని ఆయన వెల్లడించారు. ఈ పథకం దేశం లో మేన్ గ్రోవ్ ఇకో సిస్టమ్ ను పరిరక్షించడం తో పాటు దాని మనుగడ కు కూడా దోహద పడుతుంది అని ఆయన అన్నారు. దీనితో దేశం లోని తొమ్మిది రాష్ట్రాల లో మడ అడవుల విస్తృతి ని పునరుద్ధరించడం జరుగుతుంది, అంతేకాకుండా, సముద్ర మట్టాలు పెరగడం, చక్రవాతం వంటి విపత్తు ల బారి నుండి సముద్ర కోస్తా తీర ప్రాంతాల లో ప్రజాజీవనాని కి మరియు బ్రతుకుదెరువు కు ఎదురయ్యే ముప్పు ను తగ్గించడం లోనూ ఈ పథకం అండగా ఉంటుంది అని ఆయన అన్నారు.

 

ప్రపంచం లో శీతోష్ణ స్థితి ని పరిరక్షించడం కోసం ప్రతి దేశం స్వార్థ ప్రయోజనాల కు అతీతం గా ఆలోచనల ను చేయాలి అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. తమ దేశాన్ని అభివృద్ధి పరచుకొనే ఆలోచన, దానితో బాటే పర్యావరణాన్ని గురించి ఆందోళన చెందడం అనే కోవ కు చెందిన అభివృద్ధి చాలా కాలం పాటు ప్రపంచం లోని పెద్ద మరియు ఆధునిక దేశాల లో ఉంటూ వచ్చింది అని ప్రధాన మంత్రి అన్నారు. అటువంటి దేశాలు అభివృద్ధి సంబంధి లక్ష్యాల ను సాధించినప్పటికీ, అందుకు యావత్తు ప్రపంచం లోని పర్యావరణం మూల్యాన్ని చెల్లించవలసి వచ్చింది అని ఆయన అన్నారు. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల యొక్క లోపభూయిష్టమైన విధానాల వల్ల ప్రపంచం లోని అభివృద్ధి చెందుతున్న దేశాలు, అంతగా అభివృద్ధి చెందని దేశాలు ఈ రోజు కు కూడా ను యాతన లు పడుతున్నాయని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘అభివృద్ధి చెందిన కొన్ని దేశాల ఈ రకమైన ధోరణి ని నిలువరించేందుకు దశాబ్దాల తరబడి ఏ దేశమూ ముందుకు రాలేదు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. అటువంటి ప్రతి ఒక్క దేశం ముందు జలవాయు సంబంధి న్యాయం అంశాన్ని భారతదేశం లేవనెత్తడం పట్ల ఆయన ప్రసన్నత ను వ్యక్తం చేశారు.

 

‘‘భారతదేశం యొక్క వేల సంవత్సరాల ప్రాచీన సంస్కృతి లో పకృతి తో పాటు ప్రగతి కి కూడాను స్థానం లభించింది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం పర్యావరణాని కి మరియు ఆర్థిక వ్యవస్థ కు తగిన ప్రాధాన్యాన్ని ఇస్తూ వచ్చిన పరిణామాని దే ఈ ఖ్యాతి అని ఆయన వ్యాఖ్యానించారు. భారతదేశం తన మౌలిక సదుపాయాల కల్పన పట్ల మునుపు ఎన్నడూ ఎరుగని విధం గా పెట్టుబడులు పెడుతున్న క్రమం లో అది పర్యావరణం పైన సైతం సమానం గా శ్రద్ధ ను వహిస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. ఆర్థిక వ్యవస్థ కు మరియు పర్యావరణాని కి ఊతాన్ని అందించేటటువంటి పోలికల ను గురించి ప్రధాన మంత్రి పేర్కొంటూ, దేశం లో 4జి మరియు 5జి కనెక్టివిటీ పరిధి ని విస్తరిస్తూనే అటవీ ప్రాంతాల పరిధి ని పెంచడం జరిగిందని వెల్లడించారు. భారతదేశం పేదల కోసం 4 కోట్ల గృహాల ను నిర్మించింది, అయితే అదే కాలం లో దేశం లో అభయారణ్యాలు మరియు వన్యప్రాణుల సంఖ్య రికార్డు స్థాయి లో అధికం అయింది అని ఆయన చెప్పారు. జల్ జీవన్ అభియాన్ ను గురించి మరియు జల భద్రత కోసం ఉద్దేశించిన 50,000 అమృత్ సరోవర్ ల నిర్మాణాన్ని గురించి, భారతదేశం ప్రపంచం లోని అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా ఎదగడాన్ని గురించి, అంతేకాకుండా, నవీకరణయోగ్య శక్తి రంగం లో అగ్రగామి అయిదు దేశాల సరసన నిలవడాన్ని గురించి, భారతదేశం యొక్క వ్యావసాయిక ఎగుమతులు వృద్ధి చెందుతూ ఉండడాన్ని గురించి, అలాగే పెట్రోల్ లో 20 ఇథెనాల్ ను కలిపేందుకు ఒక ప్రచార ఉద్యమాన్ని నిర్వహించడాన్ని గురించి కూడా శ్రీ నరేంద్ర మోదీ తెలియ జేశారు. భారతదేశం కొయెలిశన్ ఫార్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్’ - సిడి ఆర్ఐ మరియు ఇంటర్ నేశనల్ బిగ్ కేట్ అలాయన్స్ ల వంటి సంస్థల కు నిలయం గా మారింది అని కూడా ఆయన తెలిపారు.

 

మిశన్ ఎల్ఐఎఫ్‌ఇ.. అదే, లైఫ్ స్ట‌యిల్ ఫార్ ఎన్ వైరన్ మంట్ (లైఫ్‌’) ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, అది ఒక ప్రజాందోళన గా రూపుదాల్చిందని, జలవాయు పరివర్తన తో పోరాడడం కోసం జీవన శైలి లో మార్పుల ను అనుసరించడాని కి సంబంధించిన ఒక సరిక్రొత్త చైతన్యాన్ని వ్యాప్తి చేయడమే ఈ మిశన్ అని ఆయన ప్రముఖం గా ప్రస్తావించారు. కిందటి సంవత్సరం గుజరాత్ లోని కేవడియా-ఏక్ తా నగర్ లో ఈ మిశన్ ను ప్రారంభించినప్పుడు ప్రజల లో ఆసక్తి రేకెత్తింది, అయితే ఒక నెల రోజుల క్రితం మిశన్ లైఫ్ కు సంబంధించిన ప్రచార ఉద్యమాన్ని ఆరంభించడమైంది, దీని లో భాగం గా 30 రోజుల కన్నా తక్కువ వ్యవధి లో 2 కోట్ల మంది ప్రజానీకం ఈ మిశన్ లో పాలుపంచుకొన్నారు అని ఆయన వివరించారు. గివింగ్ లైఫ్ టు మై స్కీమ్అనే భావన తో ర్యాలీలు, క్విజ్ పోటీల ను నిర్వహిస్తున్న సంగతి ని ఆయన వెల్లడించారు. ‘‘లక్షల కొద్దీ సహచరులు వారి యొక్క నిత్య జీవనం లో భాగం గా రెడ్యూస్, రీయూజ్ ఎండ్ రీ సైకిల్ మంత్రాన్ని ఆచరిస్తున్నారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రపంచం లో పరివర్తన ను తీసుకు రావాలి అంటే వ్యక్తి యొక్క స్వభావం లో మార్పు ను తీసుకు రావలసి ఉంది అనేదే మిశన్ లైఫ్ యొక్క మూల సూత్రం అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ‘‘మిశన్ లైఫ్ అనేది యావత్తు మానవ జాతి కి ఉజ్వలమైన భవిష్యత్తు, మన భావి తరాల వారి కోసం ఉద్దేశించినటువంటి ఒక ముఖ్యమైన కార్యక్రమం’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

‘‘జలవాయు పరివర్తన దిశ లో చైతన్యం అనేది ఒక్క భారతదేశానికే పరిమితం కాదు, ఈ కార్యక్రమాని కి ప్రపంచవ్యాప్తం గా సమర్థన నానాటికీ అధికం అవుతోంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. కిందటి సంవత్సరం లో పర్యావరణ దినం సందర్భం లో ప్రపంచ సముదాయాని కి ఒక అభ్యర్థన ను చేసిన విషయాన్ని ఆయన గుర్తు కు తెచ్చుకొంటూ, అప్పట్లో వ్యక్తుల లో, సముదాయాల లో శీతోష్ణస్థితి కి అనుకూలమైనటువంటి ప్రవర్తన పూర్వక పరివర్తన ను తీసుకు రావడం కోసం వినూత్నమైనటువంటి పరిష్కార మార్గాల తో ముందుకు రావలసింది గా తాను విజ్ఞప్తి ని చేసినట్లు చెప్పారు. ఇంచుమించు 70 దేశాల నుండి వేల కొద్దీ సహచరులు వారి వారి ఆలోచనల ను వెల్లడి చేశారని, అవి ఆచరణాత్మకం గా ఉన్నాయని చెబుతూ ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అభిప్రాయాల ను వెల్లడించిన వారి లో విద్యార్థులు, పరిశోధకులు, వేరు వేరు రంగాల నిపుణులు, వృత్తి నిపుణులు, ఎన్ జిఒ లు మరియు సామాన్య పౌరులు ఉన్నారన్నారు. వారి వారి ఆలోచనల ను వ్యక్తం చేసినందుకు గాను పురస్కారాల ను అందుకొన్న వారి కి ఆయన తన అభినందనల ను సైతం వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగిస్తూ, మిశన్ లైఫ్ దిశ లో వేసేటటువంటి ప్రతి ఒక్క అడుగు రాబోయే కాలాల్లో పర్యావరణాని కి దృఢతరమైన కవచం గా మారుతుంది అన్నారు. థాట్ లీడర్ శిప్ ఫార్ లైఫ్ పేరు తో ఒక సంకలనాన్ని కూడా ఈ రోజు న ఆవిష్కరించడమైంది అని ఆయన పేర్కొన్నారు. ఈ తరహా ప్రయాస లు ప్రకృతి తో సామరస్య పూర్వకమైనటువంటి వృద్ధి ని సాధించాలన్న సంకల్పాన్ని మరింత గా బలపరచగలవన్న విశ్వాసాన్ని శ్రీ నరేంద్ర మోదీ వెలిబుచ్చారు.

 

 

***

 



(Release ID: 1930095) Visitor Counter : 146