ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
జీ20 ఇండియా ప్రెసిడెన్సీ: 3వ హెచ్ డబ్ల్యూ జి సమావేశం
మూడవ జి 20 ఇండియా హెచ్ డబ్ల్యుజి సమావేశం సందర్భంగా "ఎంసిఎమ్ లలో పరిశోధన - అభివృద్ధిపై అంతర్జాతీయ భాగస్వామ్య (గ్లోబల్ కొలాబరేషన్) నెట్ వర్క్ ను బలోపేతం చేయడం" అనే అంశంపై ప్రారంభోపన్యాసం చేసిన కేంద్ర రసాయనాలు , ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ భగవంత్ ఖుబా
పరిశోధన - అభివృద్ధి భాగస్వామ్యం కోసం అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు , వాటాదారులతో నిమగ్నం కావడం వల్ల సమన్వయం తో వనరుల కేటాయింపు సులభతరం అవుతుంది: నిధులు, వైద్య సరఫరాలు, సిబ్బంది , సమాచారం వంటి వనరులను ప్రభావవంతంగా, సమర్థవంతంగా పంపిణీ చేసేందుకు దోహదపడుతుంది: శ్రీ భగవంత్ ఖుబా
‘‘సురక్షితమైన, సమర్థవంతమైన, నాణ్యమైన , తక్కువ ఖర్చు వైద్య సేవలను అందించడం లో సహకారాన్ని పెంపొందించడం గ్లోబల్ ఆర్ అండ్ డి నెట్వర్క్ లక్ష్యంగా పెట్టుకుంది.”
భాగస్వామ్య పరిశోధన నెట్ వర్క్ ల నుంచి వనరులు , నైపుణ్యాన్ని సమీకరించడం ద్వారా, మనం పరిశోధన, ఆవిష్కరణల వేగాన్ని పెంచవచ్చు: సహకారాన్ని పెంపొందించడం ద్వారా, ప్రపంచ ఆరోగ్య సవాళ్లకు సమర్థవంతంగా ప్రతిస్పందించడానికి అవసరమైన సమిష్టి నైపుణ్యం , వనరులను మనం ఉపయోగించుకోవచ్చు: కేంద్ర ఫార్మా కార్యదర్శి
ప్రతిపాదిత
నాడు పోస్టు చేయడమైనది:
05 JUN 2023 4:27PM by PIB Hyderabad
హైదరాబాద్ లో జరుగుతున్న 3వ జి 20 హెల్త్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో నేడు రెండవ రోజున ‘భవిష్యత్ హెల్త్ ఎమర్జెన్సీలపై దృష్టి సారించి మెడికల్ కౌంటర్ మెజర్స్ (డయాగ్నోస్టిక్స్, వ్యాక్సిన్లు, థెరప్యూటిక్స్) లో పరిశోధన - అభివృద్ధిపై గ్లోబల్ కోలాబరేషన్ నెట్ వర్క్ ను బలోపేతం చేయడం" అనే అంశం పై ఏర్పాటయిన ఒక కార్యక్రమంలో కేంద్ర రసాయనాలు , ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ భగవంత్ ఖుబా
ప్రారంభోపన్యాసం చేశారు, ఆయనతో పాటు నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వి కె పాల్ కూడా ఉన్నారు.
నాణ్యమైన, సమర్థవంతమైన, సురక్షితమైన , భరించ గలిగిన మెడికల్ ప్రతిచర్యల (ఎంసిఎమ్) ప్రాప్యత, లభ్యతపై దృష్టి సారించి ఫార్మాస్యూటికల్ రంగంలో సహకారాన్ని బలోపేతం చేసే భారతదేశ జి 20 ప్రెసిడెన్సీ రెండవ ప్రాధాన్యతను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశ్యం. వ్యాక్సిన్, థెరప్యూటిక్స్ ,డయాగ్నోస్టిక్స్ (విటిడి) విలువ గొలుసుల ప్రతి భాగంపై సమానంగా దృష్టి సారించాల్సిన ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, భారతదేశ జి 20 ప్రెసిడెన్సీ ఎంసిఎం పర్యావరణ వ్యవస్థ అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ కోణాల వివిధ అంశాలను ఎలా సమన్వయం చేయాలో చర్చిస్తోంది.

ఈ సందర్భంగా శ్రీ భగవంత్ ఖుబా మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన, పునరావృతమయ్యే వ్యాప్తి, భవిష్యత్తులో వచ్చే మహమ్మారులకు ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉండవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అభివృద్ధి చెందుతున్న ఆరోగ్య సవాళ్లకు వినూత్న పరిష్కారాలను అందించడంలో పరిశోధన, అభివృద్ధి భాగస్వామ్యం ప్రాముఖ్యతను ప్రపంచ దేశాలు గుర్తించాయని ఆయన అన్నారు.
పరిశోధన లో భాగస్వామ్యం బహుళ విభాగాలు, సంస్థల నుండి నైపుణ్యం, వనరులను సమీకరించడానికి వీలు కల్పిస్తుందని, ఇది వ్యాధుల గురించి మరింత సమగ్ర అవగాహనకు ,మరింత ప్రభావవంతమైన విటిడిల అభివృద్ధికి దోహదపడుతుందని శ్రీ భగవంత్ ఖుబా పేర్కొన్నారు. పరిశోధన - అభివృద్ధి భాగస్వామ్యం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థలు, వాటాదారులతో నిమగ్నం కావడం వల్ల సమన్వయం తో వనరుల కేటాయింపును సులభతరం చేస్తుందని, నిధులు, వైద్య సరఫరాలు, సిబ్బంది, సమాచారం వంటి వనరులను ప్రభావవంతంగా, సమర్థవంతంగా పంపిణీ చేసేలా చూస్తుందని ఆయన అన్నారు. ప్రాధాన్యతలను సర్దుబాటు చేయడం ద్వారా, ప్రయత్నాల డూప్లికేషన్ ను తగ్గించవచ్చు. వనరులను చాలా అవసరమైన ప్రాంతాలు , జనాభాకు మళ్లించవచ్చు".
ప్రపంచ పరిశోధన, అభివృద్ధి నెట్వర్క్ భారతదేశ జి 20 భావజాలం అయిన "వసుధైక కుటుంబం" - ఒకే భూమి, ఒకే కుటుంబం అనే సూత్రాలతో ముడిపడి ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. వన్ ఫ్యూచర్ - సురక్షితమైన, సమర్థవంతమైన, నాణ్యమైన ,సరసమైన వైద్య సేవలను (విటిడి) అందుబాటులో ఉంచడం లో సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
"ఈ అత్యవసర వైద్య వనరులకు సార్వత్రిక ప్రాప్యతను నిర్ధారించే అంతిమ లక్ష్యంతో విటిడిల కోసం ప్రపంచ పరిశోధన, ఆవిష్కరణలలో దేశాల మధ్య సహకారం. భాగస్వామ్యాన్ని పెంపొందించడం ఈ చొరవ లక్ష్యం" అని ఆయన అన్నారు.
శ్రీ భగవంత్ ఖుబా మాట్లాడుతూ, "గౌరవ ప్రధాన మంత్రి పేర్కొన్నట్లుగా, ఈ సవాళ్లకు పరిష్కారాలను కనుగొనడంలో దేశాల పరస్పర సంబంధం ,భాగస్వామ్య బాధ్యతలను గుర్తించి, తీవ్రమైన ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడంపై భారతదేశ జి 20 ప్రెసిడెన్సీ దృష్టి సారించింది" అని పేర్కొన్నారు. వరల్డ్ హెల్త్ అసెంబ్లీ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం , జి 7 వంటి ప్రపంచ వేదికలలో పరిశోధన , ఆవిష్కరణలకు భారతదేశం స్థిరంగా బలమైన నిబద్ధతను ప్రదర్శించిందని ఆయన చెప్పారు. "ప్రాధాన్యతా ప్రాంతాలు , వ్యాధులలో పరిశోధన ఆవిష్కరణ ప్రయత్నాలను ఆప్టిమైజ్ చేయడమే ఈ సహకార ప్రయత్నం ప్రాధమిక లక్ష్యం" అని అన్నారు.

భాగస్వామ్య పరిశోధన దిశగా భారతదేశ ప్రయత్నాలను వివరిస్తూ, "బయో ఫార్మాస్యూటికల్స్ కోసం ముందస్తు అభివృద్ధిని వేగవంతం చేయడం, సహకారానికి మంచి అవకాశాలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్న పరిశ్రమ-అకాడెమియా సహకార మిషన్ అయిన నేషనల్ బయోఫార్మా మిషన్ ద్వారా జాతీయ స్థాయిలో సహకార పరిశోధన - అభివృద్ధి దిశగా భారతదేశం ఒక ముఖ్యమైన అడుగు వేసింది‘‘ అన్నారు. ‘‘కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ), కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సంయుక్తంగా ప్రారంభించిన ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం (ఇన్సాకోగ్) కూడా జాతీయ స్థాయి సహకారానికి మరో ముఖ్యమైన ఉదాహరణ‘‘ అని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య ఫలితాలను అందించడంలో ఫార్మాస్యూటికల్ కంపెనీల కీలక పాత్రకు గుర్తింపుగా ప్రపంచ ఫార్మసీగా భారతదేశం గుర్తింపు పొందిందని కేంద్ర మంత్రి అన్నారు. "భారతీయ ఫార్మా కంపెనీలు అధిక-నాణ్యత గల మందుల నమ్మదగిన సరసమైన ధరకు సరఫరాదారులుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణకు , మెరుగైన ప్రాప్యతకు గణనీయమైన సహకారం అందించాయి‘‘అన్నారు. ప్రపంచ వ్యాక్సిన్ సరఫరాలో భారతదేశం సుమారు 60% అందిస్తోంది. జనరిక్ ఎగుమతుల్లో 20-22% వాటాను కలిగి ఉంది. ఇంకా ఫార్మాస్యూటికల్స్ ప్రధాన ఎగుమతిదారుగా ఉంది, దాని ఫార్మా ఎగుమతుల ద్వారా 200 దేశాలకు సేవలందిస్తోంది‘‘అనిపేర్కొన్నారు. ‘ఆఫ్రికా జనరిక్స్ అవసరాల్లో 45 శాతం, అమెరికాలో జనరిక్ డిమాండ్ లో 40 శాతం, యూకేలో మొత్తం జనరిక్ మెడిసిన్ లో 25 శాతం భారత్ సరఫరా చేస్తోంది.‘
ఆరోగ్య సవాళ్లను అధిగమించడానికి ప్రపంచ ప్రయత్నాలను బలోపేతం చేయడంలో భారతదేశం పాత్రను ఆయన ప్రస్తావించారు. ‘భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ వ్యాక్సిన్, తక్కువ ఖర్చుతో, అధిక నాణ్యతతో ఉండటమే కాకుండా, స్థానిక ప్రజల నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా, ప్రపంచానికి విశ్వసనీయమైన ,అందుబాటులో ఉన్న పరిష్కారాన్ని అందించిందని‘ ఆయన పేర్కొన్నారు. 'వ్యాక్సిన్ మైత్రి' కార్యక్రమం ద్వారా అవసరమైన వైద్య సామాగ్రి, వ్యాక్సిన్లను అందించడం ద్వారా 96 దేశాలకు భారత్ తన సహాయాన్ని అందించింది‘ అని చెప్పారు.
వాతావరణ మార్పులు ,వ్యాధి వ్యాప్తి మధ్య పరస్పర చర్యతో నడిచే మారుతున్న భూభాగంలో సురక్షితమైన, సమర్థవంతమైన, నాణ్యత-భరోసా ఇంకా సరసమైన వైద్య ప్రతిచర్యల పరిశోధన- అభివృద్ధిని ప్రోత్సహించడం ,బలోపేతం చేయడం తక్షణ అవసరం అని శ్రీమతి ఎస్ అపర్ణ పేర్కొన్నారు. " భాగస్వామ్య పరిశోధన నెట్వర్క్ నుంచి వనరులు, “ నైపుణ్యాన్ని సమీకరించడం ద్వారా, “ పరిశోధన, ఆవిష్కరణల ప్రక్రియను మరింత వేగవంతం చేయగలము. సహకారాన్ని పెంపొందించడం ద్వారా, ప్రపంచ ఆరోగ్య సవాళ్లకు సమర్థవంతంగా ప్రతిస్పందించడానికి ,ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడానికి అవసరమైన సమిష్టి నైపుణ్యం , వనరులను ఉపయోగించుకోగలము" అని ఆమె పేర్కొన్నారు.
"గ్లోబల్ ఆర్ అండ్ డి నెట్వర్క్ ను స్థాపించేటప్పుడు, వ్యాధి, ఉత్పత్తి, సాంకేతికత వంటి వేరియబుల్స్ అంతటా నిర్దిష్ట ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సరైన సందర్భాన్ని సెట్ చేయడం చాలా ముఖ్యం" అని కేంద్ర ఫార్మా కార్యదర్శి పేర్కొన్నారు. "ప్రపంచ ఆరోగ్య సమానత్వాన్ని ప్రోత్సహించడానికి సమగ్ర, సమతుల్య వ్యూహం ఆధారంగా సమర్థవంతమైన ఆర్ అండ్ డి నెట్వర్క్ వైపు ప్రాధాన్యత ఒక అవసరమైన అడుగు" అని ఆమె పేర్కొన్నారు.
శ్రీ రాజేష్ భూషణ్ భారతదేశ జి 20 ప్రెసిడెన్సీ కింద ప్రతిపాదిత గ్లోబల్ ఎంసిఎమ్ కోఆర్డినేషన్ ప్లాట్ఫామ్ వంటి సహకార వేదికల కీలక పాత్రను వివరించారు. "వైద్య ప్రతిచర్యల అభివృద్ధి, పంపిణీలో సమన్వయం, సహకారాన్ని బలోపేతం చేయడానికి గ్లోబల్ ఎంసిఎం కోఆర్డినేషన్ ప్లాట్ఫామ్ ఒక ముఖ్యమైన యంత్రాంగంగా భావించబడుతుంది. అందరికీ నివారణ, నిఘా ,చికిత్స ప్రతిచర్యలకు ఆచరణీయమైన ,ప్రతిస్పందించే పరిష్కారాన్ని సృష్టించడానికి దృష్టి సారించిన రీతిలో పరిశోధన , అభివృద్ధిలో సమిష్టి ప్రయత్నాలను ఈ వేదిక కలిగి ఉండటం చాలా ముఖ్యం" అన్నారు. పరిశోధన, అభివృద్ధి ప్రయత్నాల్లో 'వన్ హెల్త్' విధానాన్ని సమన్వయం చేయాల్సిన ఆవశ్యకతను కూడా ఆయన నొక్కిచెప్పారు.

కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ రాజీవ్ బహల్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సీఈవో జి.కమల వర్ధనరావు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి లవ్ అగర్వాల్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి , భారతదేశ జి 20 ప్రెసిడెన్సీ సౌస్ షెర్పా శ్రీ అభయ్ ఠాకూర్, కేంద్ర ప్రభుత్వ ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
****
(రిలీజ్ ఐడి: 1930005)
సందర్శకుల సూచీ సంఖ్య : : 257