సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి నిబద్ధతలో భాగంగా దేశవ్యాప్తంగా 45 ప్రదేశాలలో రోజ్‌గార్ మేళాల నిర్వహణ


కొత్తగా రిక్రూట్ అయిన వారికి సిమ్లాలో అపాయింట్‌మెంట్ లెటర్‌లను అందజేసిన కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్

అవినీతిని అరికట్టేందుకు పూర్తి భక్తి, చిత్తశుద్ధితో పని చేయండి: అనురాగ్ ఠాకూర్

Posted On: 16 MAY 2023 5:51PM by PIB Hyderabad

ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి నిబద్ధతలో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా 45 ప్రదేశాలలో రోజ్‌గార్ మేళాలు నిర్వహించబడ్డాయి. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా కొత్తగా చేరిన రిక్రూట్‌మెంట్ల‌కు ఆఫ‌ర్ ఆఫ్ అపాయింట్‌మెంట్ (ఓఓఏ)ని పంపిణీ చేశారు.

కొత్తగా నియమితులైన వారు ప్రభుత్వంలో చేరి దేశానికి సేవ చేస్తారు. వారు దేశ నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు మరియు భారతదేశం@47 సాక్షిగా ఉంటారు. ప్రధానమంత్రి నిర్దేశించిన విధంగా వచ్చే ఏడాది కాలంలో 10 లక్షల అపాయింట్‌మెంట్‌లను అందించడంలో భాగంగా ఈ కార్యక్రమం ఐదవది.

కేంద్ర సమాచార & ప్రసార మరియు యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో గల గైటీ హెరిటేజ్ కల్చరల్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన రోజ్‌గార్ మేళాలో ముఖ్య అతిథిగా పాల్గొని 28 మంది యువకులకు వివిధ ఉద్యోగాల నియామక పత్రాలను అందజేశారు. జాతీయ స్థాయిలో ఈ రోజ్‌గార్ మేళా నిర్వహించబడింది. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమం సిమ్లాలోని గైటీ హెరిటేజ్ కల్చరల్ కాంప్లెక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ సభను ఉద్దేశించి ప్రసంగించారు.

రోజ్‌గార్‌ మేళాలో కొత్తగా చేరిన రిక్రూట్‌లకు శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ అభినందనలు తెలిపారు. ప్రభుత్వ శాఖలలో అవినీతిని అరికట్టేందుకు పూర్తి భక్తి మరియు చిత్తశుద్ధితో పని చేయాలని వారికి పిలుపునిచ్చారు. ప్రభుత్వోద్యోగం కోసం కాకుండా దేశానికి సేవ చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలని కోరారు. అంత్యోదయ జాబితాలో అట్టడుగున ఉన్న దేశంలోని పేద ప్రజలకు సేవ చేయాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నప్పుడు అతను లేదా ఆమె అదనపు సమయం మరియు కృషిని వెచ్చించడం ద్వారా దేశ నిర్మాణానికి తన సేవలను అందించగల నిర్దిష్ట ప్రాంతాన్ని ఎంచుకోవాలని ఆయన అన్నారు. ఎవరెన్ని పాత్రలు పోషించినా దేశ సమైక్యత, సమగ్రతను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని అన్నారు.

జీవితంలోని అన్ని రంగాలలో సాంకేతికతను అపూర్వంగా ఉపయోగించడం మరియు స్టార్ట్-అప్‌లలో అనేక రెట్లు పెరుగుదల గురించి ఆయన మాట్లాడుతూ..కొత్తగా నియమితులైన రిక్రూట్‌లు తమ విధులను నిర్వర్తించడంలో సాంకేతికతను ఎక్కువగా ఉపయోగించడం కోసం ఎప్పటికప్పుడు తమనుతాము అప్‌డేట్ చేసుకోవాలని మరియు సాంకేతికంగా అప్‌గ్రేడ్ కావాలని పిలుపునిచ్చారు. లక్షకు పైగా స్టార్టప్‌లను కలిగి ఉన్న ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను భారతదేశం సృష్టించిందని దీనివల్ల 10 లక్షల మందికి పైగా యువతకు ఉపాధి లభించిందని ఆయన అన్నారు.

యువతకు గరిష్ట ఉపాధి కల్పించడంలో కొత్త చొరవ తీసుకుని ప్రధాని నరేంద్ర మోదీ పది లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా అడుగులు వేశారని మంత్రి తెలిపారు. కొత్తగా నియమితులైన వ్యక్తులకు భారత ప్రభుత్వ ప్రతినిధిగా పబ్లిక్ సర్వెంట్‌గా పని చేసే కర్మవీర్ పేరు ఇవ్వబడింది. ప్రభుత్వ రంగంలో చేరడం వల్ల సమాజం పట్ల, పౌరుల పట్ల బాధ్యత పెరుగుతుంది, దానిని పూర్తి అంకితభావంతో, నిజాయితీతో నిర్వహించాలి.

దేశం ఆర్థికాభివృద్ధి బాటలో పయనిస్తోందని ఈ సందర్భంగా శ్రీ సింగ్ అన్నారు. దేశంలో ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేటు రంగంలోనూ కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయన్నారు. ప్రభుత్వ సర్వీసుల్లో 10 లక్షల ఉద్యోగాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, దీని కింద ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జాతీయ స్థాయిలో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ రోజ్‌గార్ మేళాలలో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2 లక్షల 88000 వేల నియామక పత్రాలు అందజేయబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేలా ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వం దృష్టి ఇప్పుడు ఉపాధిపైనే ఉందన్నారు.

ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించిందని త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించనుందని శ్రీ సింగ్ హైలైట్ చేశారు. దేశం ముందుకు సాగుతోందని అందుకు తగిన శక్తి కూడా అవసరం మరియు మీరు ప్రభుత్వంలో భాగం కావడం వల్ల దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తారని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలు మరియు పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వానికి సహాయం చేయాలని, తద్వారా వారి ప్రయోజనాలు చివరి పౌరునికి చేరాలని ఆయన కొత్తగా ప్రవేశించిన వారిని కోరారు.

కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీమతి  వందిత కౌల్ స్వాగతోపన్యాసం చేశారు. శ్రీ సురేష్ కశ్యప్, ఎంపీ సిమ్లా (హెచ్‌పీ) మరియు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు చెందిన ఇతర సీనియర్ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేపథ్యం:

రోజ్‌గార్ మేళా దేశవ్యాప్తంగా 45 ప్రదేశాలలో నిర్వహించబడింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ శాఖలు మరియు రాష్ట్ర ప్రభుత్వాలు/యుటిలలో నియామకాలు జరిగాయి. దేశవ్యాప్తంగా ఎంపిక చేయబడిన కొత్త రిక్రూట్‌లలో గ్రామీణ డాక్ సేవక్స్, పోస్ట్‌ల ఇన్‌స్పెక్టర్, కమర్షియల్-కమ్-టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్, జూనియర్ అకౌంట్స్ క్లర్క్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ,లోవర్ డివిజన్ క్లర్క్, సబ్ డివిజనల్ ఆఫీసర్, టాక్స్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, ఇన్‌స్పెక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్లు, ఫైర్‌మెన్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, డివిజనల్ అకౌంటెంట్, ఆడిటర్, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, అసిస్టెంట్ కమాండెంట్, ప్రిన్సిపాల్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయుడు, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ వంటి వివిధ ఉద్యోగాలు/పోస్టులలో చేరతారు.

రోజ్‌గార్ మేళా అనేది ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రధానమంత్రి నిబద్ధత నెరవేర్చే దిశగా ఒక అడుగు. రోజ్‌గార్ మేళా మరింత ఉపాధి కల్పనలో ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని మరియు యువతకు వారి సాధికారత మరియు దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కోసం అర్ధవంతమైన అవకాశాలను అందించాలని భావిస్తున్నారు.

కొత్తగా నియమితులైన వారు వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా నియమితులైన వారందరికీ ఆన్‌లైన్ ఓరియంటేషన్ కోర్సు అయిన కర్మయోగి ప్రారంభం ద్వారా శిక్షణ పొందే అవకాశాన్ని కూడా పొందుతారు.

 

image.png

********



(Release ID: 1924646) Visitor Counter : 156