ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్రప్రదేశ్‌లోని ముజఫర్‌పూర్‌లో పశుప్రదర్శన.. కిసాన్‌ మేళాపై ప్రధానమంత్రి ప్రశంస

Posted On: 08 APR 2023 11:35AM by PIB Hyderabad

   కిసాన్‌ సమ్మేళనాలు, పశు ప్రదర్శనలు మన రైతాంగాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకునేలా ప్రోత్సహిస్తాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌పూర్‌లో నిర్వహిస్తున్న పశుప్రదర్శన, కిసాన్‌ మేళాపై స్థానిక ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్‌ సంజీవ్‌ బల్యాన్‌ ట్వీట్‌పై ప్రతిస్పందిస్తూ పంపిన సందేశంలో:

“ఇది చాలా మంచి ప్రయత్నం! ఇలాంటి కిసాన్ మేళాల నిర్వహణతో మన అన్నదాత సోదరసోదరీమణులు మరింతగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించడంలో ప్రేరణ పొందుతారు. తద్వారా వారి ఆదాయ మార్గాలు కూడా విస్తరిస్తాయి” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.


***

DS


(Release ID: 1914892)