ప్రధాన మంత్రి కార్యాలయం

దేశీయ గ్యాస్ ధరల మార్గదర్శకాల సవరణకు మంత్రిమండలి నిర్ణయంపై ప్రధాని అభినందన

Posted On: 07 APR 2023 11:19AM by PIB Hyderabad

   అంతర్జాతీయ గ్యాస్ ధరల పెరుగుదల నుంచి భారత వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ దిశగా దేశీయ గ్యాస్ ధరలపై ప్రభావం పడకుండా సవరణను ఆమోదిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు.

దీనిపై కేంద్ర పెట్రోలియం-సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి ట్వీట్‌ను ప్రజలతో పంచుకుంటూ పంపిన సందేశంలో:

“సవరించిన దేశీయ గ్యాస్ ధరలకు సంబంధించి మంత్రిమండలి నిర్ణయం వినియోగదారులకు అనేక ప్రయోజనాలు కల్పిస్తుంది. దీన్ని ఈ రంగానికి సానుకూల పరిణామంగా పరిగణించాలి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.



(Release ID: 1914670) Visitor Counter : 160