ప్రధాన మంత్రి కార్యాలయం

నాటు నాటు ను జర్మన్ రాయబారి కార్యాలయంవేడుక జరుపుకోవడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి

Posted On: 20 MAR 2023 10:34AM by PIB Hyderabad

భారతదేశాని కి మరియు భూటాన్ కు జర్మనీ తరఫు రాయబారి డాక్టర్ శ్రీ ఫిలిప్ ఎకర్ మేన్ శేర్ చేసిన వీడియో ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆ వీడియో లో డాక్టర్ శ్రీ ఫిలిప్ ఎకర్ మేన్ మరియు రాయబారి కార్యాలయం యొక్క సభ్యులు ‘నాటు నాటు’ గీతం ఆస్కర్ పురస్కారాన్ని సాధించడాన్ని హర్షిస్తూ, చిందులు వేయడం కనిపించింది. ఆ వీడియో ను పాత దిల్లీ నగరం లో చిత్రీకరించడం జరిగింది.

ఇంతకు మునుపు ఫిబ్రవరి నెల లో, భారతదేశం లోని కొరియా రాయబారి కార్యాలయం కూడాను ఈ పాట కు ప్రశంస గానా అన్నట్లు సంబరాన్ని జరుపుకొని సదరు సంబరాన్ని ఒక వీడియో రూపం లో సమర్పించింది.

జర్మనీ రాయబారి ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రత్యుత్తరాన్ని ఇస్తూ -

‘‘భారతదేశం యొక్క రంగులు మరియు రుచులు ! జర్మన్ దేశస్తులు చాలా చక్కగా ఆడి పాడగలరురు. అందులో సందేహం లేదు.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

****

DS/SK



(Release ID: 1908715) Visitor Counter : 155