హోం మంత్రిత్వ శాఖ

హైదరాబాద్‌లో ఈరోజు జరిగిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) 54వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోం మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా

దేశంలోని పారిశ్రామిక సంస్థలు, విమానాశ్రయాలు మరియు ఓడరేవుల భద్రతను నిర్ధారించడం ద్వారా, సీఐఎస్ఎఫ్ గత 53 సంవత్సరాలలో దేశ ఆర్థిక పురోగతికి గణనీయమైన కృషి చేసింది-అమిత్ షా


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం గత 9 సంవత్సరాల నుండి అమలులో ఉన్న ఉగ్రవాదంపై నిస్సహన విధానాన్ని కొనసాగిస్తుంది, దేశంలోని ఏ ప్రాంతంలోనైనా ఉగ్రవాదం, వేర్పాటువాదం మరియు దేశ వ్యతిరేక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తుంది.



ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దేశం 5 ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను లక్ష్యం గా నిర్దేశించుకున్నారు.  దీనిని సాధించాలంటే మన విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థల భద్రత చాలా కీలకం.



ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం, అన్ని సీఏపీఎఫ్ లు  మరియు రాష్ట్ర పోలీసులతో కలిసి, అంతర్గత భద్రత రంగంలో అన్ని సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొంది.



కాశ్మీర్, ఈశాన్య మరియు వామ పక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో ఈ మూడు విభాగాలలో హింస గణనీయంగా తగ్గింది, ప్రజల్లో విశ్వాసం పెరిగింది. వేర్పాటువాదులు మరియు ఉగ్రవాదులు లొంగిపోయి ప్రధాన స్రవంతిలోకి వస్తున్నారు.



నేటి డిజిటల్ యుగంలో, సీఐఎస్ఎఫ్ రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలతో భద్రతా ప్రోటోకాల్‌ను రూపొందిచడమే కాకుండా దానిని అభేద్యంగా చేసింది.



ఓడరేవులు, విమానాశ్రయాలు మరియు పారిశ్రామిక యూనిట్ల భద్రత కోసం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం ద్వారా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సవాళ్లను పరిష్కరించడానికి అన్ని సాంకేతికతలతో సీఐఎస్ఎఫ్ ని సన్నద్ధం చేయడానికి ఎటువంటి అవకాశాన్నీ వదిలిపెట్టదు.



ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ద్వారా సీఏపీఎఫ్ సిబ్బంది కోసం అనేక చర్యలు తీసుకుంది, ఆయుష్మాన్ సీఏపీఎఫ్ పథకం కింద 35 లక్షలకు పైగా ఆయుష్మాన్ సీఏపీఎఫ్ కార్డులు పంపిణీ చేయబడ్డాయి, 2024 లో గృహ సంతృప్తి నిష్పత్తి 73 శాతం ఉంటుంది , ఇది స్వాతంత్ర్యం తర్వాత దేశం లో అత్యధికం.

Posted On: 12 MAR 2023 1:49PM by PIB Hyderabad

 

ఈరోజు హైదరాబాద్‌లో జరిగిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) 54వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కేంద్ర హోం  మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి పరేడ్‌ గౌరవ వందనం స్వీకరించి, సీఐఎస్ఎఫ్ పత్రిక సెంటినెల్-2023 మరియు కాఫీ టేబుల్ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, డీజీ సీఐఎస్ఎఫ్, పలువురు ప్రముఖులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

 

శ్రీ అమిత్ షా తన ప్రసంగంలో, సీఐఎస్ఎఫ్ యొక్క 53 సంవత్సరాల చరిత్ర దేశ ఆర్థిక ప్రగతికి ఎంతగానో తోడ్పడిందని నిరూపిస్తున్నదని అన్నారు. పారిశ్రామిక సంస్థలు, విమానాశ్రయాలు, ఓడరేవులకు భద్రత కల్పించినప్పుడే దేశం పురోగమిస్తుందని అన్నారు. సీఐఎస్ఎఫ్ యొక్క ప్రతి ఒక్క సిబ్బంది సీఐఎస్ఎఫ్ యొక్క లక్ష్యాలను నెరవేర్చడానికి తమ జీవితాలను అంకితం చేయడం ద్వారా గత 53 సంవత్సరాలలో దేశానికి అమూల్యమైన సేవను అందించారని ఆయన అన్నారు.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశానికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకున్నారని, దానిని సాధించడానికి మన విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు మరియు జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థల భద్రత అత్యంత ముఖ్యమైనదని కేంద్ర హోం  మరియు సహకార మంత్రి అన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే అన్ని సవాళ్లను ఎదుర్కొనేందుకు సిఐఎస్‌ఎఫ్ సిద్ధపడడం ద్వారా దేశానికి సేవలను కొనసాగిస్తుందని శ్రీ షా విశ్వాసం వ్యక్తం చేశారు.

 

1930లో మహాత్మాగాంధీ ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించి, 240 మైళ్ల దండి మార్చ్‌ను ప్రారంభించిన రోజున ఈ రోజు చారిత్రక ప్రాముఖ్యతను కూడా కలిగి ఉందని శ్రీ అమిత్ షా అన్నారు. సహాయ నిరాకరణ, అహింసా మార్గాల ద్వారా భారీ సామ్రాజ్యాన్ని ఎలా ఓడించవచ్చో తెలుపుతూ ఉప్పు సత్యాగ్రహం భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించిందని అన్నారు.

 

1969లో సీఐఎస్‌ఎఫ్‌లో దాదాపు 3 వేల మంది సిబ్బంది ఉండేవారని, 53 ఏళ్లలో అది 1.70 లక్షలకు పెరిగిందని కేంద్ర హోంమంత్రి తెలిపారు. రాబోయే పదేళ్లలో సిఐఎస్‌ఎఫ్‌ అభివృద్ధికి అనేక అవకాశాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. సమకాలీన డిజిటల్ యుగంలో, సీఐఎస్ఎఫ్ దాని లబ్దిదారులకు అత్యాధునిక భద్రతను అందించిందని ఆయన తెలిపారు. రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చడం ద్వారా భద్రతా ప్రోటోకాల్‌ను దుర్భేద్యంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు మరియు పారిశ్రామిక యూనిట్ల భద్రత కోసం అత్యాధునిక సాంకేతికతలను అవలంబించడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సీఐఎస్ఎఫ్ ను అన్ని సరికొత్త సాంకేతికతలతో సన్నద్ధం చేసేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని నిబంధనలను రూపొందిస్తుందని శ్రీ షా చెప్పారు. ఇందుకు సంబంధించి హోంశాఖ ఇప్పటికే కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసిందని తెలిపారు.

 

ప్రస్తుతం సీఐఎస్ఎఫ్ 66 సున్నితమైన మరియు ప్రధాన విమానాశ్రయాలు, 14 ప్రధాన నౌకాశ్రయాలు, అణు మరియు అంతరిక్ష సంస్థలు, ఢిల్లీ మెట్రో, స్టాట్యూ ఆఫ్ యూనిటీ మరియు అనేక పారిశ్రామిక యూనిట్లు మరియు గనులకు భద్రత కల్పిస్తోందని శ్రీ అమిత్ షా చెప్పారు. సిఎపిఎఫ్‌లలో సిఐఎస్‌ఎఫ్ మాత్రమే సమర్థవంతమైన అగ్నిమాపక దళాన్ని కలిగి ఉందని, అగ్ని రక్షణ రంగంలో ఘనత సాధించిందని ఆయన అన్నారు. ఢిల్లీ మెట్రో మరియు ఎయిర్‌పోర్ట్‌లో ప్రతిరోజూ సుమారు 50 లక్షల మంది ప్రయాణికులతో వ్యవహరిస్తున్నప్పుడు, సీఐఎస్ఎఫ్ ధర్మబద్ధమైన  దృఢమైన ప్రవర్తనతో దేశం యొక్క ఆస్తుల భద్రతకు కట్టుబడి ఉందని శ్రీ షా చెప్పారు.

 

సిఐఎస్‌ఎఫ్ మిశ్రమ మోడల్‌ను అవలంబించిందని, ఇది రాబోయే కాలంలో దాని పాత్రను మెరుగుపరుస్తుందని కేంద్ర హోం మంత్రి మరియు సహకార మంత్రి అన్నారు. ఈ మోడల్‌ను అడ్వైజరీలో మరియు ప్రైవేట్ కంపెనీలలో అనేక ఇతర పాత్రలలో ఉపయోగించుకోవడానికి ఈ మోడల్ మార్గం సుగమం చేస్తుందని ఆయన అన్నారు. రానున్న రెండు దశాబ్దాల్లో డ్రోన్‌లు, ఆధునిక సాంకేతికతకు సంబంధించిన భద్రతాపరమైన ముప్పుల నుంచి ప్రైవేట్‌ కంపెనీలను కూడా ఈ దళం రక్షించగలదని ఆయన అన్నారు.

 

చెట్ల పెంపకం కార్యక్రమం కింద గత 4 సంవత్సరాలలో 3 కోట్లకు పైగా చెట్లను నాటడం ద్వారా సీఐఎస్ఎఫ్ పర్యావరణం పట్ల తన అవగాహన మరియు అంకితభావాన్ని ప్రదర్శించిందని శ్రీ అమిత్ షా అన్నారు. ఇది కాకుండా, దళం 1200 కి పైగా స్వచ్ఛతా ప్రచారాలను నిర్వహించింది. స్వచ్ఛత ప్రచారం ప్రాచుర్యం పొందడం ద్వారా, పరిశుభ్రత సంస్కృతిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించింది. ‘హర్ ఘర్ తిరంగ అభియాన్’ సమయంలో కూడా 5 లక్షలకు పైగా త్రివర్ణ పతాకాలను ఎగురవేసి విజయవంతం చేయడంలో సీఐఎస్‌ఎఫ్ ఎంతో కృషి చేసిందన్నారు. అంతేకాకుండా, నేషనల్ స్టేడియంలో జరిగిన రన్ ఫర్ యూనిటీలో పాల్గొనడం ద్వారా భారత ఉక్కు మనిషి సర్దార్ పటేల్‌కు దళం నివాళులర్పించింది.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 9 సంవత్సరాలలో, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని సీఏపీఎఫ్ లు మరియు అంతర్గత భద్రత రంగంలో అన్ని సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొందని కేంద్ర హోం మంత్రి మరియు సహకార మంత్రి అన్నారు. రాష్ట్ర పోలీసు, కాశ్మీర్‌, ఈశాన్య, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో మనకు ఆందోళన కలిగించే మూడు రంగాల్లో హింస గణనీయంగా తగ్గిందని, ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని, వేర్పాటువాదం, ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేవారు లొంగిపోయి ప్రధాన స్రవంతిలోకి వస్తున్నారని ఆయన అన్నారు. దేశంలోని అన్ని సీఏపీఎఫ్ లు హింసకు పాల్పడేవారిని ఎదుర్కోవడంలో భారీ సహకారం అందించారని శ్రీ షా అన్నారు. శ్రీ నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్రప్రభుత్వం రానున్న కాలంలో కూడా ఉగ్రవాదంపై నిస్సహన విధానాన్ని కొనసాగిస్తుందని ఆయన అన్నారు. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా వేర్పాటువాదం, తీవ్రవాదం మరియు దేశ వ్యతిరేక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తామని, ఇందులో సీఏపీఎఫ్ లు మరియు రాష్ట్ర పోలీసులు చాలా ముఖ్యమైనవి అని ఆయన అన్నారు.

 

నేడు భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారిందని, దేశంలోని పారిశ్రామిక సంస్థలు, గనులు, ఓడరేవులు, విమానాశ్రయాలు సురక్షితంగా ఉంచడం మన బాధ్యత అని శ్రీ అమిత్ షా అన్నారు. రానున్న రోజుల్లో రక్షణ, భద్రతను పెంచాల్సి ఉందన్నారు. ఆయుష్మాన్ సీఏపీఎఫ్ పథకం కింద, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 35 లక్షలకు పైగా ఆయుష్మాన్ సీఏపీఎఫ్ కార్డులను పంపిణీ చేసిందని మరియు జవాన్లు. వారి కుటుంబాలకు దాదాపు 24,000 ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు శ్రీ షా తెలిపారు. గృహనిర్మాణ పథకం కింద కూడా గృహ సంతృప్తి నిష్పత్తిని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. 2015లో రూ.3,100 కోట్లతో 13 వేల ఇళ్లు, 113 బ్యారక్‌ల నిర్మాణాలు చేపట్టామని, అందులో 2022 నాటికి 11 వేల ఇళ్లు పూర్తి చేశామని, ఈ 11 వేల ఇళ్లు కాకుండా 2026 నాటికి 28,500 ఇళ్లు నిర్మించి  ఇస్తామన్నారు. శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం జవాన్ల కుటుంబాలకు జీవన ఏర్పాట్లు చేస్తుంది. సీఏపీఎఫ్ ఈ అవాస్ వెబ్ పోర్టల్ సెప్టెంబర్, 2022లో ప్రారంభించబడింది. దాని ఆధారంగా, 6 నెలల్లో 2 లక్షల 17 వేల మంది సిబ్బంది నమోదు చేయబడ్డారు. సంతృప్తి నిష్పత్తిలో పెద్ద ప్రగతి ఉంది. ఏ దళానికి చెందిన సిబ్బంది అయినా ఖాళీగా ఉన్న ఇళ్లలో నివాసం ఉండేలా నిబంధన మార్చడం వల్ల నిర్మించిన ఇళ్ల ఉపయోగం బాగా పెరిగింది. 2024 నవంబర్‌లో గృహ సంతృప్తి నిష్పత్తి 73 శాతంగా ఉంటుందని, ఇది స్వాతంత్య్రానంతరం అత్యధికమని ఆయన అన్నారు.

 

విమానాశ్రయాలు, ఓడరేవులు సురక్షితంగా లేని దేశం ఎప్పటికీ సురక్షితంగా ఉండదని కేంద్ర హోంమంత్రి అన్నారు. నకిలీ కరెన్సీ వ్యాపారం, చొరబాటు, మాదక ద్రవ్యాల వంటి అనేక సవాళ్లు నేడు మన ముందు ఉన్నాయని, ఉజ్వల చరిత్ర కలిగిన సీఐఎస్‌ఎఫ్ దేశానికి భద్రత కల్పించిందని అన్నారు.



(Release ID: 1906137) Visitor Counter : 163