యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు ‘ఖేలో ఇండియా దస్ కా దమ్’ ను న్యూఢిల్లీలోని జే ఎల్ ఎన్ స్టేడియంలో శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ఘనంగా ప్రారంభించారు.


‘హై దమ్ టు బధావో కదమ్’ అనేది ఖేలో ఇండియా దస్ కా దమ్ ఈవెంట్ యొక్క ట్యాగ్‌లైన్, ఇది క్రీడల ద్వారా మహిళలకు సాధికారత కల్పించడానికి మేము తీసుకున్న మరో ప్రధాన ముందడుగు: శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్

టోర్నమెంట్‌ను ఏకకాలంలో 50కి పైగా నగరాల్లో ప్రారంభించారు

Posted On: 10 MAR 2023 3:01PM by PIB Hyderabad

ఈరోజు న్యూఢిల్లీలోని జే ఎల్ ఎన్ స్టేడియంలో  ఘనంగా జరిగిన వేడుకలో కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ఖేలో ఇండియా దస్ కా దమ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2023 వేడుకల్లో భాగంగా నిర్వహించబడిన ఈ టోర్నమెంట్ ఈరోజు దేశంలోని 50కి పైగా నగరాల్లో ఏకకాలంలో ప్రారంభమైంది.

  

 దేశవ్యాప్తంగా కొన్ని నెలలుగా జరుగుతున్న బహుళ ఖేలో ఇండియా మహిళల లీగ్‌ల విజయ పరంపర కొనసాగుతూ, దస్ కా దమ్ చొరవ దేశవ్యాప్తంగా వేలాది మంది మహిళల ప్రతిభ నైపుణ్యాలను మరింత బహిర్గతం చేస్తుంది. మార్చి 10 నుండి 31 వరకు మొత్తం 10 క్రీడలలో భారతదేశంలోని 26 రాష్ట్రాల్లోని 50 కంటే ఎక్కువ నగరాల్లో జరుగుతున్న టోర్నమెంట్‌లో దాదాపు 15000 మంది అథ్లెట్లు పాల్గొంటారు. ఈ కార్యక్రమం కోసం భారత ప్రభుత్వం మొత్తం రూ.1 కోటి మంజూరు చేసింది.

శుక్రవారం ఉదయం జరిగిన ఈవెంట్ యొక్క గ్రాండ్ లాంచ్‌లో స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ జనరల్ శ్రీ సందీప్ ప్రధాన్ అలాగే కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ మరియు ఎస్ ఎ ఐ నుండి ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు.  దాదాపు 2000 మంది మహిళా అథ్లెట్లు  జే ఎల్ ఎన్ స్టేడియంలో జరిగిన ప్రారంభ వేడుకలలో పాల్గొన్నారు, ఇందులో ఖేలో ఇండియా దస్ కా దమ్ పాల్గొనేవారు మరియు క్యాంపర్లు ఉన్నారు.

"హై దమ్ టు బధావో కదమ్ అనేది ఖేలో ఇండియా దస్ కా దమ్ ఈవెంట్ యొక్క ట్యాగ్‌లైన్ . ఇది క్రీడల ద్వారా మహిళలకు సాధికారత కల్పించడానికి మేము తీసుకున్న మరో ప్రధాన అడుగు" అని శ్రీ ఠాకూర్ పేర్కొన్నారు. "చాలా నెలల నుండి దేశవ్యాప్తంగా 14 క్రీడలలో మహిళల లీగ్‌లను నిర్వహించడానికి ఎస్ ఎ ఐ  ప్రయత్నం 20,000 మంది బలమైన మహిళా అథ్లెట్లకు అవసరమైన ప్రతిభ నైపుణ్యాలను బహిర్గతం అయ్యేటట్లు సాధికారతను పొందడానికి అవకాశం కల్పించింది. ఈ లీగ్‌లు గొప్ప విజయాన్ని సాధించాయని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను, ”అని కేంద్ర మంత్రి తెలిపారు.

 

మేరీ కోమ్ మరియు పివి సింధు వంటి అగ్రశ్రణి అథ్లెట్ల ఉదాహరణలను ఉదహరిస్తూ, శ్రీ ఠాకూర్ ఇలా అన్నారు, “మేరీ కోమ్ నుండి లోవ్లినా వరకు నిఖత్ మరియు పివి సింధు నుండి సైనా నెహ్వాల్ వరకు, ఈ అమ్మాయిలు భారతదేశానికి మళ్లీ మళ్లీ కీర్తిని తీసుకురావడానికి తమ సర్వ శక్తులన్నింటినీ అందించారు. ఇప్పుడు ఇలాంటి టోర్నీల ద్వారా అలాంటి సూపర్‌స్టార్‌లు పుట్టుకొస్తారు. అత్యుత్తమ టోర్నమెంట్‌లు మరియు ప్లేఫీల్డ్‌లను అందించడానికి మేము ప్రతిదీ చేస్తున్నాము, ఇప్పుడు మహిళలందరూ తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది.

 

ఖేలో ఇండియా దస్ కా దమ్ ఈవెంట్‌లో పాల్గొనే అతి పిన్న వయస్కులలో ఒకరైన ఢిల్లీకి చెందిన 8 ఏళ్ల ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ సాక్షితో కలిసి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈవెంట్‌ను జెండా ఊపి ప్రారంభించటం  ప్రారంభ వేడుకలో ప్రధానమైన ముఖ్యాంశాలలో ఒకటి.  ఖో-ఖో, స్విమ్మింగ్, అథ్లెటిక్స్, వుషు, ఆర్చరీ, ఫెన్సింగ్, జూడో, వెయిట్ లిఫ్టింగ్, హాకీ మరియు యోగాసనా మొదలైన క్రీడలు ప్రదర్శించబడే క్రీడల జాబితాలో ఉన్నాయి.

 

నగరాల జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి



(Release ID: 1905686) Visitor Counter : 129