ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఖుంటి లోక్‌సభ స్థానం పరిధిలోని గుమ్లా సమితిలో మహిళా వికాస్‌ మండల్ వార్షిక సర్వసభ్య సమావేశంలో 15,000 మంది పాల్గొనడంపై ప్రధాని ప్రశంస

प्रविष्टि तिथि: 26 FEB 2023 10:34AM by PIB Hyderabad

   జార్ఖండ్‌ రాష్ట్రంలోని ఖుంటి లోక్‌సభ స్థానం పరిధిలోగల గుమ్లా సమితిలో మహిళా వికాస్ మండల్ వార్షిక సర్వసభ్య సమావేశానికి 15,000 మంది మహిళలు హాజరు కావడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ మేరకు ఖుంటి లోక్‌సభ స్థానం పరిధిలోగల  పాల్‌కోట్‌ (గుమ్లా) సమితిలో నిర్వహించిన మహిళా వికాస్ మండల్ వార్షిక సర్వసభ్య సమావేశంలో 15,000 మంది మహిళలు పాల్గొన్నారంటూ కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అర్జున్‌ ముండా చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ-

ప్రధానమంత్రి ఒక ట్వీట్‌ద్వారా ఇచ్చిన సందేశంలో:

 “ఇదెంతో అభినందించదగిన ప్రయత్నం. మహిళల భాగస్వామ్యం పెరగడం వారి సాధికారతకు, అభివృద్ధికి ఒక సంకేతం” అని పేర్కొన్నారు.

*******

DS/ST


(रिलीज़ आईडी: 1902537) आगंतुक पटल : 185
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam