వ్యవసాయ మంత్రిత్వ శాఖ

ఇండోర్‌లో జీ-20 అగ్రికల్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశం


- మొదటి రోజున నగరంలో హెరిటేజ్ వాక్ చేసిన ప్రతినిధులు

- చారిత్రాత్మకమైన రాజ్‌వాడ ప్యాలెస్‌ని సందర్శించి స్థానిక సంస్కృతి మరియు వంటకాలను ఆస్వాదించిన ప్రతినిధులు

Posted On: 13 FEB 2023 3:05PM by PIB Hyderabad

ఇండోర్‌లో జరిగిన జీ-20 అగ్రికల్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశం మొదటి రోజైన సోమవరాం సభ్య దేశాల ప్రతినిధులు ‘హెరిటేజ్ వాక్’ చేశారు. ప్రతినిధులు రాజ్‌వాడ ప్యాలెస్ మరియు ఇండోర్‌లోని చారిత్రక హోల్కర్ స్టేట్‌లోని ఛత్రిలను సందర్శించారు. హెరిటేజ్ వాక్‌లో ప్రతినిధులు స్థానిక వంటకాలతో పాటు సాంస్కృతిక దృశ్యాలను ఆస్వాదించారు. హెరిటేజ్ వాక్‌లో ప్రతినిధులు స్థానిక వంటకాలతో పాటు సాంస్కృతిక దృశ్యాలను ఆస్వాదించారు. బోలియా సర్కార్ స్మారక్ ఛత్రి నుంచి ప్రారంభమైన హెరిటేజ్ వాక్ కృష్ణపుర ఛత్రి మీదుగా రాజ్‌వాడకు చేరుకుంది. అనంతరం ప్రతినిధులు మీడియాతో ముచ్చటించారు. హెరిటేజ్ వాక్ సందర్భంగా జిల్లా పరిపాలన, వ్యవసాయ శాఖ అధికారులు ప్రతినిధుల వెంట ఉన్నారు.

***



(Release ID: 1898958) Visitor Counter : 168