ప్రధాన మంత్రి కార్యాలయం

భూకంపం కారణం గా సిరియా లో ప్రాణనష్టం వాటిల్లినందుకు సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 06 FEB 2023 3:32PM by PIB Hyderabad

భూకంపం కారణం గా సిరియా లో ప్రాణ నష్టం సంభవించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. సిరియా ప్రజల దుఃఖం లో మేం సైతం పాలుపంచుకొంటున్నాం; ఈ కష్ట కాలం లో సహాయాన్ని అందించడాని కి మేం కట్టుబడి ఉన్నాం అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘విధ్వంసకారి భూకంపం సిరియా ను కూడా ప్రభావితం చేసిందన్న సంగతి ని తెలుసుకొని తీవ్రమైన దు:ఖం కలిగింది. బాధిత కుటుంబాల కు నేను హృదయ పూర్వక సంతాపాన్ని తెలియ జేస్తున్నాను. మేము సిరియా ప్రజల దుఃఖం లో పాలుపంచుకోవడం తో పాటుగా ఈ కష్టకాలం లో సహాయాన్ని అందించడానికి కట్టుబడి ఉన్నాం.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/SH



(Release ID: 1896685) Visitor Counter : 140