ఆర్థిక మంత్రిత్వ శాఖ

జిల్లా విద్య మరియు శిక్షణా సంస్థల ద్వారా ఉపాధ్యాయుల శిక్షణకు కొత్త హంగులు


-పిల్లలు, యుక్తవయసుల వారి కోసం జాతీయ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు

-పంచాయతీ, వార్డు స్థాయిలలో భౌతిక గ్రంథాలయాల ఏర్పాటు చేసేలా రాష్ట్రాలకు ప్రోత్సహం

- భౌతిక లైబ్రరీల ద్వారా పుస్తక పఠన మరియు ఆర్థిక అక్షరాస్యతలకు ప్రోతాహం

Posted On: 01 FEB 2023 1:23PM by PIB Hyderabad

‘సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్’ అనే ప్రభుత్వ విధానం సమ్మిళిత అభివృద్ధిని సులభతరం చేసిందని కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈరోజు పార్లమెంట్‌లో మంత్రి కేంద్ర బడ్జెట్ 2023-24ను సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర బడ్జెట్ ఏడు ప్రాధాన్యతలను స్వీకరించిందని అన్నారు. ఇవి ఒకదానికొకటి స్పురణగా ఉంటాయని.. అమృత్ కాల సయంలో మనకు మార్గనిర్దేశం చేసే 'సప్తఋషి'గా పనిచేస్తాయని వివరించారు. సమ్మిళిత అభివృద్ధి అనేది ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలలో ఒకటి, ఇందులో ఆరోగ్యం, విద్య మరియు నైపుణ్య పెంపు అనే అంశాలు ఉన్నాయి. ఉపాధ్యాయుల శిక్షణపై ప్రధానంగా దృష్టి సారిస్తూ.. వినూత్న పెద్దలకు బోధన, పాఠ్యాంశాల లావాదేవీ, నిరంతర వృత్తిపర అభివృద్ధి, డిప్‌స్టిక్‌ సర్వేలు మరియు ఐసీటీ అమలు ద్వారా ఉపాధ్యాయుల శిక్షణను పునఃసమీక్షిస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు. జిల్లా విద్య మరియు శిక్షణా సంస్థలను (డైట్లను) ఈ ప్రయోజనం కోసం శక్తివంతమైన అద్భుతమైన సంస్థలుగా అభివృద్ధి చేస్తామని ఆమె తెలిపారు. భౌగోళికాలు, భాషలు, వాటి వివిధ శైలులు మరియు స్థాయిలలో నాణ్యమైన పుస్తకాల లభ్యత, పరికరాల వాడకం అందుబాటులోకి తెచ్చేందుకు పిల్లలు మరియు కౌమారదశలో ఉన్న వారి కోసం జాతీయ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. రాష్ట్రాలు పంచాయితీ మరియు వార్డు స్థాయిలలో భౌతిక గ్రంథాలయాలను ఏర్పాటు చేయడానికి మరియు నేషనల్ డిజిటల్ లైబ్రరీ వనరులను యాక్సెస్ చేయడానికి మౌలిక సదుపాయాలను కల్పించేలా ప్రోత్సహిస్తామని మంత్రి  తెలియజేశారు.  పఠన సంస్కృతిని పెంపొందించడానికి మరియు మహమ్మారి విస్తరణ సమయంలో పఠన నష్టాలను భర్తీ చేయడానికి గాను నేషనల్ బుక్ ట్రస్ట్, చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్ మరియు ఇతర వనరులను ప్రాంతీయ భాషలు మరియు ఆంగ్లంలో పాఠ్యేతర శీర్షికలను అందించడానికి, పఠన లోపాలను భర్తీ చేయడాన్ని ప్రోత్సహిస్తామని మంత్రి తెలియజేశారు. భౌతిక గ్రంథాలయాలు. అక్షరాస్యతలో పనిచేసే స్వచ్ఛంద సంస్థల సహకారం కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఉంటుందని ఆమె తెలిపారు. ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడానికి, ఈ లైబ్రరీలకు వయస్సుకి తగిన రీడింగ్ మెటీరియల్‌ను అందించడానికి ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలు మరియు ఇతర సంస్థలను ప్రోత్సహిస్తామని శ్రీమతి నిర్మలా సీతారామన్ చెప్పారు.

*****



(Release ID: 1895532) Visitor Counter : 231