ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ విజేతల తో జనవరి 24 వ తేదీ న సమావేశం కానున్న ప్రధాన మంత్రి

Posted On: 23 JAN 2023 2:59PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ (పిఎమ్ఆర్ బిపి) విజేతల తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ జనవరి 24 వ తేదీ నాడు సాయంత్రం పూట 4 గంటల వేళ లో తన నివాసం 7, లోక్ కల్యాణ్ మార్గ్ లో సమావేశం కానున్నారు.

 

భారతదేశం ప్రభుత్వం బాలల కు వారి యొక్క అసాధారణమైన కార్యసాధన కు గాను ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాల’ ను ఆరు కేటగిరీల లో ప్రదానం చేస్తున్నది. నూతన ఆవిష్కరణ, సామాజిక సేవ, విద్య సంబంధి, క్రీడలు, కళ మరియు సంస్కృతి, ఇంకా సాహసం .. ఇవే ఆ ఆ ఆరు కేటగిరీ లు. ప్రతి ఒక్క పురస్కార విజేత కు ఒక పతకాన్ని, ఒక లక్ష రూపాయల నగదు బహుమతి ని మరియు ఒక ధ్రువపత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం, పిఎమ్ఆర్ బిపి-2023 కోసం, దేశం లోని వివిధ ప్రాంతాల నుండి 11 మంది పిల్లల ను వివిధ కేటగిరీల లో బాల శక్తి పురస్కారాల కు గాను ఎంపిక చేయడమైంది. పదకొండు రాష్ట్రాల కు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన ఆరుగురు బాలురు మరియు ఐదుగురు బాలిక లు పురస్కార విజేతల లో ఉన్నారు.

 

**

 



(Release ID: 1893030) Visitor Counter : 175