పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులను తగ్గించడంలో భారతదేశం ముందు వరుసలో ఉంది. దేశం తన శక్తి పరివర్తన ఎజెండాలో వేగంగా అభివృద్ధి చెందుతోంది: ఆటో ఎక్స్‌పో 2023లో శ్రీ హర్దీప్ ఎస్. పూరి


పెరుగుతున్న ఇంధన డిమాండ్‌ను ఏకకాలంలో పరిష్కరిస్తూ పర్యావరణాన్ని పరిరక్షిస్తామనే తన ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడానికి భారతదేశం ఎంతమేరకు కృషి చేస్తుందో నేటి కార్యక్రమం సూచిస్తుంది: శ్రీ హర్దీప్ ఎస్. పూరి

ఆటో ఎక్స్‌పో- 2023ని "ఎక్స్‌ప్లోర్ ది వరల్డ్ ఆఫ్ మొబిలిటీ" అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు.

Posted On: 13 JAN 2023 12:54PM by PIB Hyderabad

"ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులను తగ్గించడంలో భారతదేశం ముందు వరుసలో ఉంది. తన శక్తి పరివర్తన ఎజెండాలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. పెరుగుతున్న ఇంధన డిమాండ్‌ను ఏకకాలంలో పరిష్కరిస్తూ పర్యావరణాన్ని పరిరక్షిస్తామనే తన ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడానికి భారతదేశం ఎంతమేరకు కృషి చేస్తుందో నేటి కార్యక్రమం సూచిస్తుంది" అని శ్రీ హర్దీప్ ఎస్. పూరి అన్నారు.

ఆటో ఎక్స్‌పో-2023లో పెట్రోలియం మరియు సహజవాయువు శాఖ మంత్రి మాట్లాడుతూ..ఆటోమొబైల్ పరిశ్రమ కోసం ఈ కార్యక్రమం మన సాంకేతికత, సామర్థ్యం మరియు రేపటి కోసం మొబిలిటీ యొక్క విజన్-సురక్షితమైన, క్లీనర్, కనెక్ట్ చేయబడిన మరియు భాగస్వామ్యం చేయడాన్ని తెలియజేస్తుందని అన్నారు. సందర్శకులకు ఈ మొబిలిటీ ఎకో-సిస్టమ్ అనుభవంగా ఉంటుందని మరియు మన అన్ని అవసరాలకు మెరుగైన పరిష్కారాలను అందిస్తుందన్నారు. "ఇది దేశీయ మరియు అంతర్జాతీయ పెట్టుబడిదారులు మరియు ఇతర వాటాదారులకు కూడా ఒక వేదికను అందిస్తుంది" అని మంత్రి చెప్పారు.

ఆటోమోటివ్ కాంపోనెంట్స్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏసిఎంఏ), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) మరియు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (ఎస్‌ఐఏఎం) "ఎక్స్‌ప్లోర్ ది వరల్డ్ ఆఫ్ మొబిలిటీ" అనే థీమ్‌తో ఆటో ఎక్స్‌పో-2023ని నిర్వహిస్తున్నాయి.

ఈవెంట్‌కు 100+ కంటే ఎక్కువ కంపెనీలు మరియు 30000+ హాజరు ఉంటుందని భావిస్తున్నారు. "ఇది అనుకూలమైన మరియు పెట్టుబడి-స్నేహపూర్వక వాతావరణం మరియు నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి  మద్దతుతో ప్రపంచ ఆర్థిక వృద్ధికి మరియు ప్రపంచ వినియోగానికి డ్రైవర్‌గా భారతదేశాన్ని ప్రదర్శించడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుంది" అని శ్రీ హర్దీప్ ఎస్. పూరి ఉద్ఘాటించారు.

ఇథనాల్ మిశ్రమంలో భారతదేశం సాధించిన పురోగతి గురించి మంత్రి మాట్లాడుతూ  2013-14లో పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం 1.53% నుండి 2022 నాటికి 10.17%కి పెంచామని, ఇది నవంబర్ 2022 గడువు కంటే చాలా ముందుగానే ఉందని మరియు దాని లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్లిందని మంత్రి చెప్పారు. పెట్రోల్‌లో 20% ఇథనాల్ కలపాలన్న లక్ష్యాన్ని 2030 నుండి 2025-26కు ముందుకు జరిపామని చెప్పారు. ఇది దేశ ఇంధన భద్రతను పెంపొందించడమే కాకుండా, ఫారెక్స్ నిల్వలను రూ. 41,500 కోట్లను ఆదా చేస్తుందన్నారు. జీహెచ్‌జీ ఉద్గారాలను 27 లక్షల ఎంటీకు తగ్గించింది మరియు రైతులకు రూ.40,600 కోట్లకు పైగా వేగవంతమైన చెల్లింపులతో రైతులకు ప్రయోజనం చేకూర్చిందని తెలిపారు.

సెక్యూరిటీ డిపాజిట్ మొత్తాన్ని 5% నుండి 1%కి తగ్గించడం గురించి కూడా మంత్రి ప్రస్తావించారు. దీని ద్వారా ఇథనాల్ సరఫరాదారులకు దాదాపు రూ.400 కోట్లు ఆదా అయ్యాయన్నారు. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ కోసం బయో-ఇంధనంపై జిఎస్‌టిని 18% నుండి 5%కి తగ్గించామన్నారు.

హర్యానాలోని పానిపట్ (పరాలీ), పంజాబ్‌లోని భటిండా, ఒడిశాలోని బార్‌గఢ్ (పరాలీ), అస్సాంలోని నుమాలిగఢ్ (బ్యాంబు), కర్ణాటకలోని దేవంగెరెలో  ఐదు 2జీ ఇథనాల్ బయో రిఫైనరీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని మంత్రి తెలిపారు.

"భారతదేశం జీ20 అధ్యక్షుడిగా ఉన్న సమయంలో యూఎస్ఏ మరియు బ్రెజిల్‌లతో పాటు మనం జీవ ఇంధనాలపై గ్లోబల్ అలయన్స్‌ను కూడా ప్రారంభిస్తున్నాము" అని ఆయన చెప్పారు.

బెంగుళూరులోని బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ (బిఐఈసీ)లో 2023 ఫిబ్రవరి 6 నుండి 8 వరకు జరిగే ఇండియా ఎనర్జీ వీక్ (ఐఈడబ్ల్యూ)కి హాజరు కావాలని మంత్రి తన ముగింపు వ్యాఖ్యలలో ఇంధన రంగంలోని వాటాదారులందరినీ ఆహ్వానించారు.ఐఈడబ్ల్యూ మొదటి ఎడిషన్ "గ్రోత్, కొలాబరేషన్ మరియు ట్రాన్సిషన్" అనే అంశంతో రూపొందించబడింది మరియు 30 కంటే ఎక్కువ ఇంధన మంత్రులు, 50 కంటే ఎక్కువ ప్రపంచ కంపెనీల సీఈఓలు, 650 ఎగ్జిబిటర్లు మరియు 30000 కంటే ఎక్కువమంది హాజరు కావచ్చని భావిస్తున్నారు.


 

******



(Release ID: 1891035) Visitor Counter : 172