ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ 19 వైద్య నిర్వహణ కోసం ఆసుపత్రి మౌలిక సదుపాయాల సంసిద్ధతను నిర్ధారించడానికి చేపట్టిన కసరత్తు ను సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిని సందర్శించారు,


"పరికరాలు, ప్రక్రియలు మరియు మానవ వనరుల పరంగా మొత్తం కోవిడ్ వైద్య కార్యాచరణ సంసిద్ధత స్థితిలో ఉందని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం"

కోవిడ్ నియంత్రణ కోసం తగిన ఆరోగ్య ప్రవర్తనను అనుసరించాలని మరియు ధృవీకరించని సమాచారాన్ని పంచుకోవడం మానుకోవాలని ప్రతి ఒక్కరినీ కోరారు

Posted On: 27 DEC 2022 2:11PM by PIB Hyderabad

కోవిడ్ 19 వైద్య నిర్వహణ కోసం ఆసుపత్రి మౌలిక సదుపాయాల సంసిద్ధతను నిర్ధారించడానికి చేపట్టిన కసరత్తును సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈరోజు న్యూఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిని సందర్శించారు.

 

కేంద్ర మంత్రి మాట్లాడుతూ, “నేను ఇటీవల రాష్ట్ర ఆరోగ్య మంత్రులతో కోవిడ్ 19 పరిస్థితి మరియు కోవిడ్ నివారణ మరియు నిర్వహణ యొక్క సంసిద్ధతను సమీక్షించాను. కోవిడ్19 వైద్య నిర్వహణ కోసం సంసిద్ధతను సమీక్షించడానికి ఈ రోజు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌లు నిర్వహించబడుతున్నాయి, దీని కోసం ఆసుపత్రులలో సంసిద్ధత చాలా ముఖ్యమైనది. ప్రభుత్వ, ప్రయివేట్‌ ఆసుపత్రులు నేడు మాక్‌ డ్రిల్స్‌ నిర్వహిస్తున్నాయి. రాష్ట్ర ఆరోగ్య మంత్రులు తమ తమ రాష్ట్రాల్లో కసరత్తులను సమీక్షిస్తున్నారు” అని ఆయన చెప్పారు.

ఆయన  సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ మరియు వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజీ విభాగాల అధిపతులు మరియు సిబ్బందితో అనధికారిక సమావేశం లో పాల్గొన్నారు. వివిధ విభాగాల అధిపతులు, వైద్యులు, నర్సులు, భద్రత, పారిశుద్ధ్య సేవల అధిపతులతో సుమారు గంటపాటు గడిపిన ఆయన, నాణ్యమైన ఆసుపత్రి నిర్వహణ, వైద్య విధానాలు,  నియంత్రణ చర్యలు, పారిశుద్ధ్య ప్రక్రియలు, ఆరోగ్య సంరక్షణ సదుపాయం రోగుల ఆధారిత అధిక నాణ్యతపై వారిచ్చిన పలు సూచనలను ఓపికగా విన్నారు.  మహమ్మారి సమయంలో నిరంతరం సేవలను అందించడానికి పనిచేసిన వారి అనుభవాన్ని వారు పంచుకున్నారు. ప్రతి వారం తమ బృందాలను కలవాలని, అన్ని విభాగాలు సందర్శనను చేపట్టాలని మరియు అత్యుత్తమ ఫలితాలను నిర్ధారించడానికి వారి పనితీరును అంచనా వేయాలని డాక్టర్ మాండవ్య విభాగాధిపతులకు సూచించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో వైద్యులు ఆదర్శప్రాయంగా పనిచేసినందుకు ఆయన ప్రశంసించారు.

డాక్టర్ మాండవ్య కి నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాధి కి తగిన ఆరోగ్య ప్రవర్తనను అనుసరించాలని కోరారు. అప్రమత్తంగా ఉండాలని, ధృవీకరించని సమాచారాన్ని పంచుకోవడం మానుకోవాలని మరియు ఉన్నత స్థాయి సంసిద్ధతను నిర్ధారించుకోవాలని ఆయన ఉద్ఘాటించారు. “ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి మరియు భారతదేశంలో కూడా కేసులు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల పరికరాలు, ప్రక్రియలు మరియు మానవ వనరుల పరంగా మొత్తం కోవిడ్ వైద్య కార్యాచరణ సంసిద్ధత స్థితిలో ఉండటం చాలా ముఖ్యం” అని ఆయన పేర్కొన్నారు.

 

ఈ కార్యక్రమంలో హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అతుల్ గోయెల్, సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బీఎల్ షేర్వా, శానిటేషన్ తో సహా వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.

 

***



(Release ID: 1886870) Visitor Counter : 135