ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పండిట్‌ మదన్‌ మోహన్‌ మాలవీయ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళి

Posted On: 25 DEC 2022 8:50AM by PIB Hyderabad

   పండిట్‌ మదన్‌ మోహన్‌ మాలవీయ జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన నివాళి అర్పించారు. విద్యా రంగాన్ని సుసంపన్నం చేయడంలో ఆ మహనీయుడు చేసిన కృషి చిరస్మరణీయమని శ్రీ మోదీ గుర్తుచేసుకున్నారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ద్వారా ఇచ్చిన సందేశంలో:

   “భరతమాత ప్రియపుత్రుడైన మహామన పండిట్ మదన్ మోహన్ మాలవీయ జయంతి సందర్భంగా ఆయనకు నా నివాళి. దేశంలో విద్యారంగం శ్రేయస్సు కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. ఈ దిశగా ఆయన చేసిన అవిరళ కృషి ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోతుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

********

DS/ST


(Release ID: 1886470)