రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

డిఫెన్స్ ఎక్స్‌పో -2022 సందర్భంగా ఆఫ్రికన్ దేశాల ప్రతినిధులతో రక్షణ మంత్రి


ద్వైపాక్షిక సమావేశాలు

Posted On: 19 OCT 2022 9:01AM by PIB Hyderabad

డిఫెన్స్ ఎక్స్‌పో -2022 భాగంగా, భారత -ఆఫ్రికా రక్షణ శాఖ చర్చలు గుజరాత్‌లోని గాంధీనగర్‌లో అక్టోబర్ 18, 2022న జరిగాయి. ఆఫ్రికన్ దేశాల ప్రతినిధులతో రక్షణ శాఖ కార్యదర్శి ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. సుడాన్ రక్షణ మంత్రిత్వ శాఖ సెక్రటరీ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ ఇస్మాన్ మొహమ్మద్ హసన్ కరార్‌తో ద్వైపాక్షిక సమావేశం జరిగింది. సుడాన్ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రషద్ అబ్దెల్ హమిద్ ఇస్మాయిల్ అబ్దల్లా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న రక్షణ సహకార సమస్యలు మరియు సంభావ్య రంగాలలో భవిష్యత్ సహకారంపై చర్చించారు. జాంబియా రక్షణ శాఖ శాశ్వత కార్యదర్శి నార్మన్ చిపాకుపాకు నేతృత్వంలోని జాంబియా ప్రతినిధి బృందం కూడా రక్షణ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్‌ను కలిశారు. కొనసాగుతున్న ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని సమీక్షించడంతో పాటు శిక్షణ మరియు సామర్థ్యం పెంపుదలకు సంబంధించిన అంశాలపై కూడా ఇరు పక్షాల వారు చర్చించారు. డాక్టర్ అజయ్ కుమార్ నైజర్ రక్షణ మంత్రి సెక్రటరీ జనరల్ బ్రిగేడియర్ జనరల్ డిడ్డిల్లి అమాడౌ నేతృత్వంలోని నైజర్ ప్రతినిధి బృందాన్ని కూడా కలిశారు. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారానికి గల అవకాశాలపై చర్చించారు. డిపార్ట్‌మెంట్ సెక్రటరీ జనరల్ మేజర్ జనరల్ సాధిక్  సమకే నేతృత్వంలోని మాలి ప్రతినిధి బృందం రక్షణ కార్యదర్శిని కలిసింది. వారు రక్షణ పారిశ్రామిక సహకార సమస్యలతో సహా సంభావ్య రక్షణ సహకారాన్నిగురించి చర్చించారు.

***



(Release ID: 1869358) Visitor Counter : 104