ప్రధాన మంత్రి కార్యాలయం

నారీశక్తి బలోపేతంపై సమష్టి కృషికి ప్రధానమంత్రి ప్రశంస

Posted On: 05 OCT 2022 10:22AM by PIB Hyderabad

   భారతదేశంలో నారీశక్తిని బలోపేతం చేయడంలో 130 కోట్ల మంది భారతీయులు సమష్టిగా కృషి చేయడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ మేరకు దేశంలో నవజాత ఆడశిశు మరణ శాతంలో తగ్గుదల నమోదుపై కేంద్ర మహిళా-శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ ట్వీట్‌పై-

ప్రధానమంత్రి పంపిన స్పందనాత్మక సందేశంలో:

“ఇదొక గొప్ప సంకేతం... దేశంలో నారీశక్తిని బలోపేతం చేయడంలో 130 కోట్ల మంది భారతీయుల సమష్టి కృషిని ఇది ప్రతిబింబిస్తోంది” అని ప్రశంసించారు.

****

DS/TS



(Release ID: 1865435) Visitor Counter : 119