గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సుస్థిర, ఆవిష్కరణ-నేతృత్వంలోని పట్టణ అభివృద్ధి సానుకూల ప్రభావాలు ఆవిష్కృతం


అక్టోబర్ 3 నుండి 6 వరకు 'సిటీస్ ఆఫ్ టుమారో' - ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్

Posted On: 03 OCT 2022 4:56PM by PIB Hyderabad

సీఐటిఐఎస్ఎస్ కార్యక్రమం కింద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (ఎన్ఐయుఏ) భారతదేశంలో స్థిరమైన, ఆవిష్కరణలతో నడిచే పట్టణ అభివృద్ధి సానుకూల ప్రభావాలు సాధారణ పౌరుడు ఆలోచనల్లో ప్రతిబింబించేలా "రేపటి నగరాలు" పేరుతో ఫోటోగ్రఫీ ప్రదర్శనను నిర్వహిస్తోంది.    సీఐటిఐఎస్ఎస్ ప్రాజెక్ట్‌లు ఉన్న 12 స్మార్ట్ సిటీలలో నిర్వహించిన "రేపటి నగరాలు" ఫోటోగ్రఫీ పోటీకి ఈ ప్రదర్శన ముగింపు.

సీఐటిఐఎస్ఎస్ (సిటీస్ ఇన్వెస్ట్‌మెంట్ టు ఇన్నోవేట్, ఇంటిగ్రేట్ & సస్టైన్) అనేది గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్యుఏ), ఫ్రెంచ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఏఎఫ్డి), యూరోపియన్ యూనియన్ (ఈయు), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (ఎన్ఐయుఏ) ఉమ్మడి కార్యక్రమం. వినూత్నమైన, స్థిరమైన పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి, అమలు చేయడానికి - పోటీ ప్రక్రియ ద్వారా ఎంపిక చేసిన - భారతదేశం అంతటా 12 నగరాలకు ఈ కార్యక్రమం సహాయం చేస్తోంది. అగర్తల, అమరావతి, అమృత్‌సర్, భువనేశ్వర్, చెన్నై, డెహ్రాడూన్, హుబ్బల్లి-ధార్వాడ్, కొచ్చి, పుదుచ్చేరి, సూరత్, ఉజ్జయిని, విశాఖపట్నం వంటి నగరాల నుంచి పోటీకి ఎంట్రీలు ఆహ్వాననించారు.

"రేపటి నగరాలు" పోటీలో పాల్గొనేవారు CITIIS  ఫోకస్ ప్రాంతాలకు సంబంధించిన ఇతివృత్తాలను అర్థం చేసుకోవడం, ఫోటోగ్రాఫ్‌లను తీయడం అవసరం, అంటే, సస్టైనబుల్ మొబిలిటీ, పబ్లిక్ ఓపెన్ స్పేస్‌లు, ఈ-గవర్నెన్స్, ఐసిటి,  సామాజిక, సంస్థాగత ఆవిష్కరణలు ఆదాయ పరిష్కారాలుపై ఈ పోటీ దృష్టి సారించింది. 400 కంటే ఎక్కువ ఎంట్రీలు అందాయి. విజేతలను ప్రముఖ ఫోటోగ్రాఫర్లు  రఘు రాయ్,  కేతకీ షెథ్,  సౌనక్ బెనర్జీతో కూడిన జ్యూరీ ఎంపిక చేసింది.

అక్టోబర్ 3న ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం భారత్, భూటాన్‌లోని ఈయూ రాయబారి ఉగో అస్టుటో, భారత్ లోని ఫ్రెంచ్ రాయబార కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్  డామియన్ సయ్యద్, భారతదేశంలో ఏఎఫ్డి కంట్రీ డైరెక్టర్ బ్రూనో బోస్లే, మిషన్ డైరెక్టర్ (స్మార్ట్ సిటీస్ మిషన్), గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ  కునాల్ కుమార్, ఎన్ఐయుఏ డైరెక్టర్ హితేష్ వైద్య, ఫోటోగ్రాఫర్, పోటీ జ్యూరీ చైర్‌పర్సన్ రఘు రాయ్ పాల్గొనున్నారు. అత్యుత్తమ ఎంట్రీల క్యూరేటెడ్ ఎంపిక న్యూ ఢిల్లీలోని ఇండియా హాబిటాట్ సెంటర్‌లో అక్టోబర్ 3వ తేదీ నుండి 6వ తేదీ వరకు ప్రదర్శిస్తున్నారు.  .

*****


(Release ID: 1864996)