ప్రధాన మంత్రి కార్యాలయం

జాతీయ చలనచిత్ర అవార్డు విజేతలందరికీ ప్రధానమంత్రి అభినందనలు

Posted On: 30 SEP 2022 10:44PM by PIB Hyderabad

   జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్న వారందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందనలు తెలిపారు.

ఈ మేరకు కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ ట్వీట్‌కు ప్రతిస్పందనగా ట్వీట్‌ చేస్తూ:

“జాతీయ చలనచిత్ర అవార్డు విజేతలందరికీ అభినందనలు. వారు ప్రపంచానికి అందించిన సృజనాత్మకత, పంచిన వినోదం, కళ-సంస్కృతులకు సముచిత గుర్తింపుగా దక్కిన గౌరవమిది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.



(Release ID: 1864191) Visitor Counter : 113