గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

‘స్వచ్ఛ్ టాయ్‌కాథాన్’ను ప్రారంభించనున్న ఎంఓహెచ్‌యుఏ. ‘వ్యర్థాల’ నుండి బొమ్మలను తయారు చేయడానికి ఇది ఓ ప్రత్యేకమైన పోటీ.

Posted On: 25 SEP 2022 2:31PM by PIB Hyderabad

భారతదేశాన్ని గ్లోబల్ టాయ్ హబ్‌గా స్థాపించే లక్ష్యంతో సాంప్రదాయ హస్తకళలు, చేతితో తయారు చేసిన బొమ్మలతో పాటు భారతీయ బొమ్మల పరిశ్రమను ప్రోత్సహించే లక్ష్యంతో నేషనల్ యాక్షన్ ప్లాన్ (ఎన్‌ఏపిటి) 2020 ప్రవేశపెట్టబడింది. పరిశ్రమల ప్రోత్సాహం మరియు అంతర్గత వాణిజ్య విభాగం (డిపిఐఐటీ) కేంద్ర ప్రభుత్వంలోని 14 మంత్రిత్వ శాఖలతో పాటు ప్రస్తుతం ఎన్‌ఏపిటి పలు  అంశాలను అమలు చేస్తోంది.

భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద జనాభా కలిగిన దేశమే కాకుండా.. మొత్తం జనాభాలో సగం మంది 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న  యువ జనాభాను కూడా కలిగి ఉంది. అలాగే బలమైన ఆర్థిక వృద్ధి, పెరుగుతున్న పునర్వినియోగపరచదగిన ఆదాయాలు మరియు చిన్నారుల కోసం అనేక ఆవిష్కరణల కారణంగా బొమ్మల డిమాండ్ కూడా పెరుగుతోంది.

ఎప్పటికప్పుడు మారుతున్న వినియోగ విధానాలు మరియు ఈ-కామర్స్ వేగవంతమైన పెరుగుదలతో గత దశాబ్దంలో తలసరి వ్యర్థాల ఉత్పత్తి క్రమంగా పెరిగింది. దీంతో నగరాల్లో వ్యర్థాల నిర్వహణ పట్టణ స్థానిక సంస్థలకు సవాలుగా మారింది. 2026 నాటికి ‘చెత్త రహిత’ నగరాల లక్ష్యంతో గౌరవనీయ ప్రధాన మంత్రి 1 అక్టోబర్ 2021న స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్‌బిఎం 2.0) రెండవ దశను ప్రారంభించారు.

ఒకవైపు బొమ్మలకు పెరుగుతున్న డిమాండ్ మరోవైపు ఘన వ్యర్థాల ప్రభావం నేపథ్యంలో స్వచ్ఛ్ టాయ్‌కాథాన్ అనేది ఎన్‌ఏపిటి మరియు ఎస్‌బిఎం 2.0 మధ్య భాగస్వామ్యం ఏర్పడింది. ఇది బొమ్మల సృష్టి లేదా తయారీలో వ్యర్థాలను ఉపయోగించడం కోసం పరిష్కారాలను అన్వేషిస్తుంది. పొడి వ్యర్థాలను ఉపయోగించి బొమ్మల డిజైన్‌లలో ఆవిష్కరణలను తీసుకురావడానికి వ్యక్తులు మరియు సమూహాల మధ్య ఈ పోటీ ఏర్పటు చేయబడుతోంది. ఇది పెద్ద స్థాయిలో తయారు చేయగల సమర్థవంతమైన డిజైన్‌లు, కనీస భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండే బొమ్మలు, అలాగే బొమ్మల సౌందర్యంపై దృష్టి సారిస్తుంది. సెంటర్ ఫర్ క్రియేటివ్ లెర్నింగ్, ఐఐటీ గాంధీనగర్ ఈ కార్యక్రమానికి నాలెడ్జ్ పార్టనర్.

ఈ పోటీ ‘స్వచ్ఛ అమృత్ మహోత్సవ్’ కింద ప్రారంభించబడుతోంది. 17 సెప్టెంబర్ 2022 సేవాదివాస్ నుండి 2 అక్టోబర్ 2022 స్వచ్ఛతదివాస్ వరకు స్వచ్ఛత కార్యాచరణను పెంపొందించడానికి15 రోజుల పాటు కార్యకలాపాలు నిర్వహించబడుతున్నాయి.

ఈ పోటీ మైగవ్‌ ఇన్నోవేట్ ఇండియా(MyGov's Innovate India) పోర్టల్‌లో నిర్వహించబడుతుంది.

ఈ కార్యక్రమాన్ని 26 సెప్టెంబర్ 2022న ఉదయం 10:30 గంటలకు వర్చువల్ ఈవెంట్‌లో హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ సెక్రటరీ ప్రారంభించనున్నారు. ఈవెంట్‌ను ఇక్కడ bit.ly/3r1OaIE ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

***



(Release ID: 1862153) Visitor Counter : 125